Sex Racket: హానీ ట్రాప్.. వీడియోలు చూపుతూ 50 మంది పురుషులకు బెదిరింపులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sex Racket: హానీ ట్రాప్ ద్వారా పురుషులను ఆకట్టుకొని తద్వారా డబ్బులు వసూలు చేసే ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. సెక్స్ రాకెట్లో భాగంగా మగవారి శృంగార వీడియోలు తీసి.. నిందితులు బెదిరిస్తున్నట్లు పోలీసులు నిర్ధారించారు. సుమారు 50 మంది మగవాళ్ల దగ్గర నుంచి భారీగా వసూళ్లు చేసినట్లు తేలింది. బెంగళూరులో ఓ మహిళ హనీ ట్రాప్లో పురుషులను బంధించి వారి నుంచి భారీ మొత్తంలో డబ్బు వసూలు చేసే దోపిడీ రాకెట్ను కర్ణాటక పోలీసులు ఛేదించారు. ముఠాలోని ముగ్గురు సభ్యులను అరెస్టు చేయగా.. కేసులో కీలక నిందితురాలిగా ఉన్న మహిళ కోసం గాలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. హనీ ట్రాప్కి పాల్పడిన ప్రధాన నిందితురాలి పేరు నేహా అలియాస్ మేహర్. మరో ముగ్గురుతో కలిసి ఆమె సెక్స్ రాకెట్ నడిపింది. మెసేజింగ్ ప్లాట్ఫారమ్ టెలిగ్రామ్ ద్వారా బాధితులను సెక్స్ కోసం తన నివాసానికి ఆహ్వానించేది. మగవాళ్లకు వలవేసి, ఆ తర్వాత శృంగారం కోసం వాళ్లను తన ఇంటికి ఆహ్వానించేది. శృంగారం చేస్తున్న సమయంలో మరో ముగ్గురు నిందితులు వీడియోలు తీసేవారు. ఆ తర్వాత ఆ వీడియోలతో బ్లాక్మెయిల్ చేసేవారని పోలీసులు వెల్లడించారు. మెహర్ను పెళ్లి చేసుకోవాలని, లేదంటే ఇస్లాం మతంలోకి మారాలని, లేదంటే డబ్బులు ఇవ్వాలని బాధితులను వేధించేవారు.
Read also: Rajanikanth : యోగానంద ఆశ్రమంలో ధ్యానం చేసిన తలైవా…
Also Read
- IMD Big Alert: దేశాన్ని కమ్ముకున్న మేఘాలు.. భారీ వర్షాలకు హెచ్చరిక.. ఇస్రో చిత్రాలు విడుదల
- CJP Protest: ‘మోడీ ప్రభుత్వానికి ఇదే చివరి రోజు’.. ప్రాణత్యాగాలకు సిద్ధంకండి.. సీక్రెట్ యాప్పై దర్యాప్తు
- Delhi: ప్రధాని నివాసం ముందు కాంగ్రెస్ ధర్నా.. రాహుల్ గాంధీతో కేంద్రమంత్రి చర్చలు..
- Supreme Court: భర్తల పొట్టకొట్టొద్దు.. భార్యల తీరుపై సుప్రీంకోర్టు కామెంట్స్..
మెహర్ పురుషులతో లైంగిక సంబంధం కొనసాగిస్తున్నప్పుడు మిగిలిన ముగ్గురు నిందితులు వీడియో తీస్తారు. తరువాత బాధితులను బ్లాక్మెయిల్ చేయడానికి ఫుటేజీని ఉపయోగిస్తారు. బాధితులను .. వారు మెహర్ను వివాహం చేసుకుని ఇస్లాం మతంలోకి మారాలని లేదా ఆమెకు డబ్బు చెల్లించాలని డిమాండ్ చేస్తారు. ఈ ముఠా బ్లాక్ మెయిల్ ద్వారా ఇప్పటి వరకు రూ.35 లక్షలకుపైగా వసూలు చేసినట్టు పోలీసులు తెలిపారు. ఈ దోపిడీ ఏడాదిన్నరకు పైగా కొనసాగిందని పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. నిందితుల్లో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేయగా.. మెహర్ ఆచూకీ ముంబైలో ఉన్నట్టు గుర్తించారు. వారి నుంచి ఇప్పటి వరకు రూ.60,000 రికవరీ చేశారు. ఈ ఉచ్చులో 50 మందికి పైగా పురుషులు బలైపోయారని భావిస్తున్నందున, బాధితులు ఎంత మంది ఉన్నారనేది విచారణ జరుపుతున్నట్టు పోలీసులు చెబుతున్నారు. బాధితుల్లో ఒకరు ముఠాపై అధికారికంగా ఫిర్యాదు చేయడంతో కేసు వెలుగులోకి వచ్చింది. నిందితులపై తప్పుడు నిర్బంధం మరియు మోసానికి సంబంధించిన భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 348 మరియు 420 కింద పుట్టెనహళ్లి పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేయబడింది.
తాజావార్తలు
-
IMD Big Alert: దేశాన్ని కమ్ముకున్న మేఘాలు.. భారీ వర్షాలకు హెచ్చరిక.. ఇస్రో చిత్రాలు విడుదల
-
Fauji vs King: బాక్సాఫీస్ వార్.. ప్రభాస్ ‘ఫౌజీ’ vs షారుఖ్ ‘కింగ్’.. వెయ్యి కోట్ల వేటలో విజేత ఎవరు?
-
KVN : విజయ్ లెగసీకి అదిరిపోయే ట్రిబ్యూట్.. ‘జన నాయకుడు’
-
CJP Protest: ‘మోడీ ప్రభుత్వానికి ఇదే చివరి రోజు’.. ప్రాణత్యాగాలకు సిద్ధంకండి.. సీక్రెట్ యాప్పై దర్యాప్తు
-
Murali Kishor: ‘లెనిన్’ డైరెక్టర్కు బిగ్ ఛాన్స్.. సితారలోనే నెక్స్ట్ మూవీ! ఆ స్టార్ హీరో సినిమా?
ట్రెండింగ్
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!
-
తెలంగాణ ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ (TGTET-2026) నోటిఫికేషన్ విడుదల..!
-
స్క్రీన్ లేకుండానే పనిచేసే Google Fitbit Air త్వరలో భారత్లో లాంచ్.. ఫీచర్స్ ఇవే.!