Sex Racket: హానీ ట్రాప్.. వీడియోలు చూపుతూ 50 మంది పురుషులకు బెదిరింపులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sex Racket: హానీ ట్రాప్ ద్వారా పురుషులను ఆకట్టుకొని తద్వారా డబ్బులు వసూలు చేసే ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. సెక్స్ రాకెట్లో భాగంగా మగవారి శృంగార వీడియోలు తీసి.. నిందితులు బెదిరిస్తున్నట్లు పోలీసులు నిర్ధారించారు. సుమారు 50 మంది మగవాళ్ల దగ్గర నుంచి భారీగా వసూళ్లు చేసినట్లు తేలింది. బెంగళూరులో ఓ మహిళ హనీ ట్రాప్లో పురుషులను బంధించి వారి నుంచి భారీ మొత్తంలో డబ్బు వసూలు చేసే దోపిడీ రాకెట్ను కర్ణాటక పోలీసులు ఛేదించారు. ముఠాలోని ముగ్గురు సభ్యులను అరెస్టు చేయగా.. కేసులో కీలక నిందితురాలిగా ఉన్న మహిళ కోసం గాలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. హనీ ట్రాప్కి పాల్పడిన ప్రధాన నిందితురాలి పేరు నేహా అలియాస్ మేహర్. మరో ముగ్గురుతో కలిసి ఆమె సెక్స్ రాకెట్ నడిపింది. మెసేజింగ్ ప్లాట్ఫారమ్ టెలిగ్రామ్ ద్వారా బాధితులను సెక్స్ కోసం తన నివాసానికి ఆహ్వానించేది. మగవాళ్లకు వలవేసి, ఆ తర్వాత శృంగారం కోసం వాళ్లను తన ఇంటికి ఆహ్వానించేది. శృంగారం చేస్తున్న సమయంలో మరో ముగ్గురు నిందితులు వీడియోలు తీసేవారు. ఆ తర్వాత ఆ వీడియోలతో బ్లాక్మెయిల్ చేసేవారని పోలీసులు వెల్లడించారు. మెహర్ను పెళ్లి చేసుకోవాలని, లేదంటే ఇస్లాం మతంలోకి మారాలని, లేదంటే డబ్బులు ఇవ్వాలని బాధితులను వేధించేవారు.
Read also: Rajanikanth : యోగానంద ఆశ్రమంలో ధ్యానం చేసిన తలైవా…
Also Read
- Supreme Court: పెళ్లికి ముందు శారీరక బంధంలో ఉంటే క్యారెక్టర్ను తప్పుపట్టలేం.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు!
- West Nile Fever: డెంగ్యూ, మలేరియానే కాదు.. కేరళలో దోమ కాటుతో మరో ప్రాణాంతక వ్యాధి!
- Zojila Tunnel Breakthrough: భారత ఇంజినీరింగ్ అద్భుతం.. 'జోజిలా టన్నెల్ బ్రేక్ త్రూ' ను ప్రారంభించిన కేంద్ర మంత్రి..
- TMC Rebellion: మమతా బెనర్జీకి కోలుకోలేని దెబ్బ.. పక్కా ప్లాన్తో పార్టీని వీడిన ఆ 20 మంది ఎంపీలు..
మెహర్ పురుషులతో లైంగిక సంబంధం కొనసాగిస్తున్నప్పుడు మిగిలిన ముగ్గురు నిందితులు వీడియో తీస్తారు. తరువాత బాధితులను బ్లాక్మెయిల్ చేయడానికి ఫుటేజీని ఉపయోగిస్తారు. బాధితులను .. వారు మెహర్ను వివాహం చేసుకుని ఇస్లాం మతంలోకి మారాలని లేదా ఆమెకు డబ్బు చెల్లించాలని డిమాండ్ చేస్తారు. ఈ ముఠా బ్లాక్ మెయిల్ ద్వారా ఇప్పటి వరకు రూ.35 లక్షలకుపైగా వసూలు చేసినట్టు పోలీసులు తెలిపారు. ఈ దోపిడీ ఏడాదిన్నరకు పైగా కొనసాగిందని పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. నిందితుల్లో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేయగా.. మెహర్ ఆచూకీ ముంబైలో ఉన్నట్టు గుర్తించారు. వారి నుంచి ఇప్పటి వరకు రూ.60,000 రికవరీ చేశారు. ఈ ఉచ్చులో 50 మందికి పైగా పురుషులు బలైపోయారని భావిస్తున్నందున, బాధితులు ఎంత మంది ఉన్నారనేది విచారణ జరుపుతున్నట్టు పోలీసులు చెబుతున్నారు. బాధితుల్లో ఒకరు ముఠాపై అధికారికంగా ఫిర్యాదు చేయడంతో కేసు వెలుగులోకి వచ్చింది. నిందితులపై తప్పుడు నిర్బంధం మరియు మోసానికి సంబంధించిన భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 348 మరియు 420 కింద పుట్టెనహళ్లి పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేయబడింది.
తాజావార్తలు
-
Japan Lifestyle:100 ఏళ్లు దాటినా చురుకుగానే ఉంటారు.. జపాన్ ప్రజల జీవనశైలిలో ప్రత్యేకత ఏంటి?
-
ACB Raids: ఆర్అండ్బీ ఈఎన్సీ మోహన్ నాయక్పై ఏసీబీ దాడులు.. 11 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు.!
-
Supreme Court: పెళ్లికి ముందు శారీరక బంధంలో ఉంటే క్యారెక్టర్ను తప్పుపట్టలేం.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు!
-
Ben Stokes: బెన్ స్టోక్స్ నైట్క్లబ్ వివాదం.. అసలు ఏం జరిగింది?.. భద్రతా సిబ్బందికి కుట్లు పడటానికి కారణమేంటి?
-
West Nile Fever: డెంగ్యూ, మలేరియానే కాదు.. కేరళలో దోమ కాటుతో మరో ప్రాణాంతక వ్యాధి!
ట్రెండింగ్
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!