H3N2 virus: హెచ్3ఎన్2 వైరస్ వ్యాప్తి.. పుదుచ్చేరిలో స్కూళ్ల మూసివేత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
H3N2 virus Cases: హెచ్3ఎన్2 ఇన్ఫ్లుఎంజా కేసులు ప్రజలను భయపెడుతున్నాయి. కరోనా లక్షణాలు కలిగి ఉన్న ఈ వ్యాధి వల్ల ప్రజలు తీవ్ర అస్వస్థతలకు గురవుతున్నారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, దీర్ఘకాలిక రోగాలు ఉన్న వారిపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఈ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలో పలు రాష్ట్రాలు హెచ్3ఎన్2 వైరస్ కు సంబంధించి మార్గదర్శకాలను విడుదల చేస్తున్నాయి.
ఇదిలా ఉంటే పెరుగుతున్న కేసుల నేపథ్యంలో పుదుచ్చేరి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 1 నుంచి 8వ తరగతి వరకు పాఠశాలలను 10 రోజుల పాటు మూసేస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు పుదుచ్చేరి విద్యాశాఖ మంత్రి నమశ్శివాయం ఈ నిర్ణయాన్ని వెల్లడించారు. హెచ్3ఎన్2 వైరస్ ఇన్ఫెక్షన్లు పెరగడంతో పుదుచ్చేరి మార్చి 16 నుండి 10 రోజుల పాటు 1 నుండి 8 తరగతులకు పాఠశాలలను మూసివేయనుంది.
Also Read
Read Also: Pawan Kalyan: ఒక్కరోజుకు పవన్ కళ్యాణ్ రెమ్యూనరేషన్ ఎంతంటే..?
ఇన్ఫ్లుఎంజా ఏ వైరస్ సబ్ వేరియంట్ హెచ్3ఎన్2 తీవ్ర శ్వాసకోశ సమస్యలకు దారి తీస్తోంది. దేశవ్యాప్తంగా ఫ్లూ కారణంగా ఇప్పటి వరకు ఏడుగురు మరణించారు. నిన్న గుజరాత్ రాష్ట్రంలో ఓ మహిళ హెచ్3ఎన్2 వైరస్ వల్ల మరణించింది. ఈ వైరస్ వల్ల దేశంతో తొలి మరణం కర్ణాటక హసన్ లో నమోదు అయింది. హర్యానాలో కూడా హెచ్3ఎన్2 వల్ల మరణించారు. శుక్రవారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం, జనవరి 2 మరియు మార్చి 5 మధ్య భారతదేశంలో 451 హెచ్3ఎన్2 వైరస్ కేసులు నమోదయ్యాయి.
ఈ కొత్త వేరియంట్ వల్ల శరీర నొప్పులు, జ్వరం, చలి, అలసట, డయేరియా, వాంతులు, దగ్గు , గొంతు నొప్పి, ముక్కు కారడం, తలనొప్పి వంటి లక్షణాలు ఉంటున్నాయి. ఇదిలా ఉంటే మార్చి చివరి నాటికి ఫ్లూ వ్యాధి తగ్గుతుందని కేంద్రం ప్రకటించింది. డాక్టర్ల సూచన లేకుండా సొంత మెడిసిన్స్ వాడొద్దని, యాంటీ బయాటిక్ మాత్రలు వాడొద్దని సూచించింది.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి అదిరే శుభవార్త.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మతో జతకట్టనున్న వైభవ్..
-
Foreign Investors: విదేశీ పెట్టుబడిదారులకు శుభవార్త.. పన్ను నిబంధనల సడలింపునకు కేంద్రం గ్రీన్ సిగ్నల్!
-
TMC Crisis: మమతకు మరో షాక్.. బీజేపీలోకి 20 మంది టీఎంసీ ఎంపీలు..
-
Kala Chana Pulao Recipe: 4 స్టెప్స్లో కాలా చనా పులావ్.. టేస్ట్తో పాటు ప్రోటీన్ డబుల్.!
-
CM Chandrababu: మంత్రులను అలర్ట్ చేసిన సీఎం చంద్రబాబు.. అధికారులకు సీరియస్ క్లాస్..!
ట్రెండింగ్
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!