Gujarat riots case: తీస్తా సెతల్వాడ్ కు బెయిల్ మంజూరు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gujarat riots case.. SC grants interim bail to Teesta Setalvad: 2002లో జరిగిన గుజరాత్ అల్లర్ల కేసులో అమాయకులను ఇరికించేందుకు ప్రయత్నించేందుకు కల్పిత పత్రాలు, ఆరోపణలు చేశారనే కేసులో ప్రముఖ ఉద్యమకారిణి తీస్తా సెతల్వాడ్ ను గుజరాత్ పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా ఆమెకు సుప్రీంకోర్టు శుక్రవారం మధ్యంతర బెయిల్ ను మంజూరు చేసింది. మా దృష్టిలో తీస్తా సెతల్వాడ్ బెయిల్ కు అర్హురాలు అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అయితే తీస్తా సెతల్వాడ్ విచారణకు సహకరించాలని.. పాస్పోర్ట్ను అప్పగించాలని కోరింది.
2002 గుజరాత్ అల్లర్ల కేసులో అమాయకులను ఇరికించేందుకు తీస్తా సెతల్వాడ్ కుట్ర పన్నినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆమెను అరెస్ట్ చేసి జైలుకు తరలించింది గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ వింగ్. జూన్ 25న తీస్తా సెతల్వాడ్ అరెస్ట్ జరిగింది. తాజాగా ఆమె బెయిల్ కోసం అభ్యర్థిస్తూ.. సుప్రీంకోర్టులో పటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ ను సీజేఐ యూయూ లలిత్ తో కూడిన ధర్మాసనం విచారించి బెయిల్ మంజూరు చేసింది.
Also Read
- Haryana: ఛీ.. ఛీ.. ఇంత దారుణమా? కూతుళ్ల కోసం జీవితాన్ని ధారబోసిన తండ్రి.. వీడియో కాల్లో అంత్యక్రియలు వీక్షించిన కూతుళ్లు!
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
- UP: ఏం త్యాగం.. ఐదుగురు పిల్లల తల్లిని ప్రియుడికిచ్చి పెళ్లి చేసిన భర్త.. ఏం జరిగిందంటే..!
Read Also: K. A. Paul: హైదరాబాద్లో ప్రపంచ శాంతి సమావేశాలు.. 28 మంది ప్రధానులకు ఆహ్వానం
సెతల్వాడ్ తో పాటు ఈ కేసులో అప్పటి గుజరాత్ డీజీపీ ఆర్బీ శ్రీ కుమార్, మాజీ ఐపీఎస్ అధికారి సంజీవ్ భట్ కూడా నిందితుడిగా ఉన్నారు. తీస్తా సెతల్వాడ్ తో పాటు శ్రీకుమార్ కూడా బెయిల్ కోసం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే వీరు బయటకు వస్తే సాక్ష్యాలు తారుమారు చేసే అవకాశం ఉందని గుజరాత్ ప్రభుత్వం వాదిస్తోంది.
అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోదీని కేసులో ఇరికించడంతో పాటు బీజేపీ ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు తీస్తా సెతల్వాడ్ తో పాటు దివంగత కాంగ్రెస్ నేత అహ్మద్ పటేల్ కుట్రకు తెర తీశారు. ఈ మొత్తం కుట్రలో తీస్తా సెతల్వాడ్, డీజీపీ ఆర్బీ శ్రీకుమార్, మాజీ ఐపీఎస్ అధికారి సంజీవ్ భట్ నిందితులుగా ఉన్నారు. అయితే ఈ గుజరాత్ అల్లర్లపై ఏర్పాటు చేసిన సిట్.. నరేంద్రమోదీకి క్లిన్ చిట్ ఇచ్చింది. సిట్ ఇచ్చిన క్లీన్ చిట్ ను సవాల్ చేస్తూ.. కాంగ్రెస్ మాజీ ఎంపీ ఎహసాన్ జాఫ్రీ భార్య జకియా జాఫ్రీ దాఖలు చేసిన పిటిషన్ ను జూన్ 24న సుప్రీంకోర్టు కొట్టేసింది. దీని తర్వాత తీస్తా సెతల్వాడ్, ఇతర నిందితులపై ఎఫ్ఐఆర్ నమోదు అయింది. అల్లర్ల సమయంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్రమోదీతో పాటు 64 మందికి సిట్ క్లీన్ చిట్ ఇచ్చింది.
తాజావార్తలు
-
Ramayana Release Date : రామాయణ రిలీజ్ డేట్ ప్రకటించిన మేకర్స్..
-
8,000 నిట్స్ OLED డిస్ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్తో Huawei Nova 16 SE లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఎగిరెగిరిపడొద్దు.. ఆ ఇద్దరి కెరీర్ ఏమైందో తెలుసుకో!
-
Donald Trump: ట్రంప్ సంచలన ప్రకటన.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జరగబోయే అతిపెద్ద దాడికి మేము సిద్ధంగా ఉన్నాం
-
Lock Upp 2 Winner: ‘లాక్ అప్ 2’ విజేతగా శ్రేయా కల్రా.. రూ.1 కోటి బహుమతితో గ్రాండ్ విక్టరీ!
ట్రెండింగ్
-
LDAC సపోర్ట్, 32.5 గంటల బ్యాటరీ, స్మార్ట్ డయల్తో CMF Clip Pro ఓపెన్-ఇయర్ ఇయర్బడ్స్ లాంచ్..!
-
Haryana: ఛీ.. ఛీ.. ఇంత దారుణమా? కూతుళ్ల కోసం జీవితాన్ని ధారబోసిన తండ్రి.. వీడియో కాల్లో అంత్యక్రియలు వీక్షించిన కూతుళ్లు!
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!