Gujarat: ప్రధాని మోదీకి పాటిదార్ సంఘం షాక్.. స్టేడియం పేరు మార్చాలని డిమాండ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ ఏడాది డిసెంబర్ లో గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలు జరగబోతున్నాయి. మళ్లీ అధికారంలోకి రావాలని బీజేపీ భావిస్తోంది. ముఖ్యంగా ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్ లో మరోసారి అధికారం చేజిక్కించుకునేలా బీజేపీ ప్లాన్ చేస్తోంది. ఇందులో భాగంగానే ఇటీవల హార్దిక్ పటేల్ ను కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలోకి చేర్చుకుంది. ఎన్నికలకు సంబంధించి సన్నద్ధం అవుతోంది.
ఇదిలా ఉంటే ఎన్నికల ముందు బీజేపీకి కొత్త చిక్కు వచ్చిపడింది. పటేల్ సామాజిక వర్గం అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియం పేరు మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. పాటిదార్ సంఘం, వివిధ సంస్థలు ఆదివారం నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నాయి. గతంలో అహ్మదాబాద్ మొతేరా క్రికెట్ స్టేడియానికి సర్దార్ వల్లభాయ్ పటేల్ పేరు ఉండేది. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం నిర్మించిన తర్వాత దానికి నరేంద్రమోదీ పేరు పెట్టారు. ఇప్పుడిదే రచ్చకు కారణం అవుతోంది.
Also Read
- CM Vijay: "1967 నాటి తప్పు పునరావృతం కావొద్దు".. ప్రధాని మోడీకి సీఎం విజయ్ లేఖ..
- US Trade: చైనా ‘టారిఫ్ మోసం’ బయటపెట్టిన అమెరికా.. భారత్ పేరు ఎందుకు వచ్చింది?
- Woman Head Constable Mu*rd*er: మహిళా హెడ్ కానిస్టేబుల్ దారుణ హత్య.. భర్తపైనే అనుమానం..
- India Independence: భారత్కు అర్ధరాత్రే ఎందుకు స్వాతంత్య్రం వచ్చింది?.. ఆగస్టు 15 వెనుక ఉన్న జ్యోతిష్య రహస్యం..
‘సర్దార్ సన్మాన్ సంకల్ప్ ఆందోళన్ సమితి’ పేరుతో పాటిదార్ సంఘాల పేరు మార్చాలని డిమాండ్ చేస్తున్నాయి. ప్రపంచంలో అతిపెద్ద స్టేడియాల్లో ఒకటైన ఈ స్టేడియం ప్రస్తుతం ఎన్నికల ముందు గుజరాత్ లో హాట్ టాపిక్ గా మారింది. 2015లో పాటిదార్ అనామత్ ఆందోళన్ సమితి, హార్దిక్ పటేల్ ఆధ్వర్యంలో రిజర్వేషన్లు కోరుతూ ఆందోళనలు చేశాయి.ప్రస్తుతం ఈ గ్రూప్ కూడా స్టేడియం పేరు మార్చాలని డిమాండ్ చేస్తోంది. ఆందోళలు, నిరసనల్లో పాల్గొననుంది.
ఆదివారం బర్డోలి సూరత్ లోని స్వరాజ్ ఆశ్రమం నుంచి అహ్మదాబాద్ లోని స్టేడియం వరకు ర్యాలీ నిర్వహించ తలపెట్టారు. సోమవారం సాయంత్రం స్టేడియానికి చేరుకుని గేట్ నం 1 ముందు భారీ నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నారు. ప్రభుత్వం పేరు మార్చకుంటే నిరసనలు తీవ్రతరం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఎన్నికల ముందు పటేల్ భారీ విగ్రహం నిర్మించారు.. అనంతరం స్టేడియం పేరు మార్చారని బీజేపీని విమర్శించారు. అయితే ఈ ఉద్యమంలో రాజకీయ పార్టీలను అనుమతించమని పాటీదార్ సంఘాలు చెబుతున్నాయి. ఈనేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు అప్రమత్తం అయ్యారు.
తాజావార్తలు
-
Sankranti Box Office Clash : అందరికీ సంక్రాంతే కావాలి.. సినిమా పట్టాలెక్కకముందే పండగ రేసుపై కర్చీఫ్
-
విరాట్ కోహ్లీ వాడే ‘హూప్’ కి పోటీగా Google Fitbit Air.. ఇక మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే..
-
RRB JE Recruitment 2026: 4,098 పోస్టులకు దరఖాస్తులు ప్రారంభం.. అర్హత, ఫీజు, దరఖాస్తు విధానం ఇవే
-
Realme P4s Lite: రియల్మీ P4s లైట్.. 7000mAh బ్యాటరీతో చౌకైన ఫోన్.. ఫీచర్లు అదిరిపోయేలా!
-
Hyderabad: పెద్ద కొడుకు జైల్లో.. చిన్న కుమారుడు గంజాయి బానిస.. మనస్తాపంతో తల్లి ఆత్మహత్య
ట్రెండింగ్
-
IND vs SL 1st Test: తుది జట్టులో చోటు ఉండదు.. స్టార్ బ్యాటర్కు హెడ్ కోచ్ గంభీర్ వార్నింగ్!
-
BSNL బంపర్ ఆఫర్.. 365 రోజులకు బదులుగా 412 రోజుల వ్యాలిడిటీ.! రోజుకు 2GB హై-స్పీడ్ డేటా కూడా..
-
IND vs SL: గిల్, రాహుల్, పంత్ కాదు.. అతడే సబ్ కాంటినెంట్కు కింగ్.. మొదటి టెస్టులో ఆడించాలి!
-
BSNL రూ.1 ప్లాన్ మళ్లీ వచ్చేసింది.. అన్లిమిటెడ్ కాలింగ్, 24 రోజుల వ్యాలిడిటీ..!
-
200MP కెమెరా, 8,000mAh బ్యాటరీతో Honor Magic 9 సిరీస్ లాంచ్ కు ముహూర్తం ఫిక్స్.!