Gujarat Cable Bridge Collapse: కేబుల్ బ్రిడ్జ్ కూలిన ఘటనలో 60 చేరిన మృతుల సంఖ్య.. సిట్ విచారణకు ప్రభుత్వం ఆదేశం
Gujarat Cable Bridge Collapse..Death toll rises to 60: గుజరాత్ మోర్బీ కేబుల్ వంతెన కూలిన ఘటనలో మృతుల సంఖ్య 60కి చేరింది. అనధికారికంగా 100 మంది వరకు మరణించినట్లు సమాచారం. సమయం గడుస్తున్నా కొద్దీ మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఆదివారం సాయంత్ర మోర్బీ జిల్లాలో మచ్చు నదిపై ఉన్న కేబుల్ వంతెన కూలిపోవడంతో ఒక్కసారిగా 500 మంది వరకు సందర్శకులు నదిలో పడిపోయారు. 400 మంది ప్రాణాలు దక్కించుకోగా.. 100కు పైగా మంది గల్లంతు అయినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు 60 మంది మరణించినట్లు గుజరాత్ పంచాయితీ మంత్రి బ్రిజేష్ మెర్జా వెల్లడించారు. దీపావళి సెలవులు, వారాంతం కావడంతో ఎక్కువ మంది సందర్శకులు వచ్చినట్లు తెలుస్తోంది.
Read Also: Adipurush: టీజర్ ఎఫెక్ట్.. ఆదిపురుష్ వాయిదా
Also Read
మృతుల్లో ఎక్కువగా పిల్లలు, మహిళలే ఉన్నారు. ఇది బాధకరమైన సంఘటన అని బీజేపీ ఎంపీ మోహన్ భాయ్ కళ్యాన్ జీ కుందారియా అన్నారు. నది నుంచి నీటిని పంప్ చేసేందుకు పెద్ద ఎత్తున యంత్ర సామాగ్రిని సంఘటన స్థలానికి చేర్చారు. వంతెన సామర్థ్యాన్ని మించి ఒక్కసారిగా జనాలు రావడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంపై గుజరాత్ ప్రభుత్వం సిట్ ను ఏర్పాటు చేసి విచారణకు ఆదేశించింది.
అయితే ఇటీవల ఈ బ్రిడ్జికి రీపేర్లు చేసి అక్టోబర్ 26 నుంచి ప్రజలను తిరిగి అనుమతిస్తున్నారు. ఈ క్రమంలోనే తిరిగి ప్రారంభించిన ఐదు రోజుల్లోనే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో మరణించిన వారికి ప్రధాని మోదీ రూ. 2 లక్షల పరిహారంతో పాటు గాయపడిన వారికి రూ. 50,000 పరిహారాన్ని ప్రకటించారు. ఈ గుజరాత్ ప్రభుత్వం మరణించిన వారికి రూ.4 లక్షలు, గాయపడిన వారికి రూ.50,000 పరిహారాన్ని ప్రకటించింది. గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ సహాయచర్యలను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.
Morbi cable bridge collapse incident | "More than 60 people have died," says Gujarat Panchayat Minister Brijesh Merja, who is present at the incident spot pic.twitter.com/Nc6x7mjazv
— ANI (@ANI) October 30, 2022
తాజావార్తలు
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో