ఫేక్ న్యూస్.. గూగుల్, ట్విట్టర్, ఫేస్బుక్పై కేంద్రం సీరియస్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సోషల్ మీడియాలో ఎప్పుడు ఏదోఒకటి ఫేక్ న్యూస్ తెగ రచ్చ చేస్తోంది.. అసలు ఏది వైరల్, ఏ రియల్ అని కనిపెట్టడమే కష్టంగా మారింది… అది ఫేక్ అని తెలిసేలోపే.. వైరల్గా మారి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.. అయితే, ఈ వ్యవహారంలో గూగుల్, ట్విట్టర్, ఫేస్బుక్ లాంటి సంస్థలపై కేంద్ర సర్కార్ సీరియస్ అయినట్టుగా తెలుస్తోంది.. ఫేక్ న్యూస్ అరికట్టడంలో తగినన్ని చర్యలు చేపట్టక పోవడంలో కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా సమాచారం. అయితే, సామాజిక మాద్యమాల్లో వచ్చే నకిలీ వార్తలను రిమూవ్ చేసేందుకు ఇటీవల గూగుల్, ట్విట్టర్, ఫేస్బుక్ వంటి సంస్థలతో కేంద్ర ప్రభుత్వ అధికారులు సమావేశం నిర్వహించగారు.. జనవరి 31వ తేదీన వర్చువల్ గా జరిగిన ఈ సమావేశంలో ఆయా సంస్థలు, సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ అధికారులు మధ్య చర్చ తీవ్రంగా జరిగినట్టు నేషనల్ మీడియా పేర్కొంది.
Read Also: తెలంగాణలో ఈ రోజు ఎన్ని కోవిడ్ కేసులంటే..
Also Read
- Britain Heatwave: భారత్లో 45°C ఉన్నా ఏం కాదు.. బ్రిటన్లో 35°Cకే ప్రజలు ఎందుకు అల్లాడుతున్నారు?
- Prashant Kishor: తొలిసారి ఎన్నికల బరిలోకి ప్రశాంత్ కిశోర్.. పోటీ ఎక్కడ్నుంచంటే..!
- Yogi Adityanath: ‘‘దోషుల్ని వదిలే ప్రసక్తే లేదు’’.. రామ మందిర విరాళాల చోరీపై యోగి వార్నింగ్..
- Rahul Gandhi vs BJP: రాహుల్ గాంధీ విదేశీ టూర్లపై బీజేపీ సెటైర్లు.. పోస్టర్లపై దుమారం
కాగా, గత రెండు నెలల్లోనే భారత ప్రభుత్వం 55 యూట్యూబ్ ఛానెళ్లు, 2 ట్విట్టర్ ఖాతాలు, 2 ఇన్స్టాగ్రామ్ అకౌంట్లు, 2 వెబ్సైట్లను నిషేధించిన విషయం తెలిసిందే.. అదే పనిగా కొన్ని చానెళ్లు ఫేక్ వార్తలు కానీ లేదా భారత వ్యతిరేక వార్తలను ప్రోత్సహిస్తున్నాయన్న కారణంతో ఈ చర్యలు తీసుకోంది కేంద్రం.. పాకిస్థాన్ కేంద్రంగా ఉన్న ఖాతాల ద్వారా తప్పుడు సమాచారాన్ని భారత్లో ప్రచారం చేస్తున్నాయని కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది.. ఇక, మిలియన్ల మంది వినియోగదారులను కలిగి దేశీయ కంటెంట్-భాగస్వామ్య వేదికలుగా ఉన్న షేర్ చాట్ లాంటి సంస్థ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నాయి.. ఈ భేటీలో.. స్థానిక చట్టాలకు లోబడి ఉన్న కంటెంట్ను మాత్రమే పరిమితం చేస్తామని.. మిగతా కంటెంట్ను తొలగిస్తామని కొన్ని సంస్థలు కేంద్రానికి హామీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది.. గూగుల్, ట్విట్టర్, ఫేస్బుక్ వంటి పెద్ద సంస్థలే ఫేక్ న్యూస్ను కట్టడి చేయడంలో విఫలం అవుతున్నారని.. ఆయా సంస్థల విషయంలో సర్కార్ నిరాశకు గురైనట్టు అధికారులు తెలిపారు.
తాజావార్తలు
-
Tobacco Farmers: పొగాకు రైతులకు ప్రభుత్వం అండ.. కిలో రూ.200 కంటే తక్కువకు కొనొద్దు..
-
Telangana Govt: కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం.. ఈ నెల 28 నుంచే ప్రారంభం..
-
France: ఫ్రాన్స్లో ఎండలు భగభగ.. ఏసీల కోసం ఎగబడ్డ జనాలు
-
Maa Inti Bangaram : సమంత ‘గోల్డెన్ రన్’.. 17 లక్షలకు పైగా టికెట్లతో ‘మా ఇంటి బంగారం’ సరికొత్త రికార్డ్!
-
Chilli Garlic Egg Salad Recipe: ఉదయాన్నే ఎనర్జీ కావాలా? 5 నిమిషాల్లో రెడీ.. రుచికరమైన హై-ప్రోటీన్ ఎగ్ సలాడ్
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!