ఓవైపు కరోనా మహమ్మారి.. మరో వైపు లాక్డౌన్లు, కర్ఫ్యూల నేపథ్యంలో.. వాహనదారులకు గుడ్న్యూస్ చెప్పింది కేంద్రం.. డ్రైవింగ్ లైసెన్స్(డీఎల్), రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్(ఆర్సీ) వంటి డాక్యుమెంట్ల వ్యాలిడిటీని పొడిగించింది.. గత ఏడాది ఫిబ్రవరి 1వ తేదీ నాటికి ముగిసిన అన్ని వాహన పత్రాల గడువును గతంలో ఈ నెల 30వ తేదీ వరకు పొడిగించిన కేంద్రం.. ఇవాళ వ్యాలిడిటీని ఈ ఏడాది సెప్టెంబర్ 30వ తేదీ వరకు పొడిగిస్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు రోడ్డు మరియు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నిర్ణయంతో వాహనానికి చెందిన ఫిట్నెస్, పర్మిట్లు, లైసెన్స్, రిజిస్ట్రేషన్, ఇతరత్రా డాక్యుమెంట్లు అన్నీ ఈ ఏడాది సెప్టెంబర్ 30వ తేదీ వరకు చెల్లుబాటు కానున్నాయి. కరోనా క్లిష్ట సమయంలో పనిచేస్తున్న పౌరులు, వాహనదారులు మరియు అనేక ఇతర సంస్థలకు సంబంధించిన వ్యక్తులను వేధింపులకు గురిచేయొద్దని.. అన్ని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలకు సూచించింది కేంద్రం.