Sundar Pichai: గూగుల్ సీఈఓకి పద్మభూషణ్..
Google CEO Sundar Pichai Receives Padma Bhushan In California: టెక్ దిగ్గజం ఆల్ఫాబెట్, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ కు పద్మభూషణ్ అవార్డును ప్రధానం చేశారు అమెరికాలోని భారత రాయబారి. 2022లో ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ విభాగంలో ఆయనకు పద్మభూషణ్ అవార్డును ప్రకటించింది భారత ప్రభుత్వం. ఈ ఏడాది 17 మందికి అవార్డుల్లో ప్రకటిస్తే అందులో సుందర్ పిచాయ్ కూడా ఉన్నారు. శుక్రవారం శాన్ ఫ్రాన్సిస్కోతో తన సన్నిహితులు, కుటుంబసభ్యుల మధ్య భారతదేశ మూడో అత్యున్నత పురస్కారాన్ని అందుకున్నారు. అమెరికాలో భారత రాయబారి తరంజిత్ సింగ్ సంధు, సుందర్ పిచాయ్ కి ఈ పురస్కారాన్ని అందించారు.
Read Also: USA: భారత్కు అమెరికా అండగా ఉంటుంది.. మీకు సంబంధం లేదని చైనాకు వార్నింగ్
Also Read
- Navjot Kaur Sidhu: రాఘవ్ చద్దా బీజేపీలో చేరడానికి ప్రియాంక చోప్రానే కారణం.. అసలు కథ ఇదేనా?
- Mumbai: దారుణం.. కల్మా పఠించలేదని ఇద్దరు సెక్యూరిటీ గార్డులపై దాడి.. రంగంలోకి ఏటీఎస్
- Crime: ఇదేం దారుణం రా నాయనా.. బస్సు ఎక్కడికి వెళ్తుందని అడిగినందుకు వృద్ధుడి హత్య..
- Bengal Elections: రేపు తృణమూల్ కంచుకోటలో పోలింగ్.. ఈసారి ఎవరిది పైచేయి!
ఈ అవార్డును అందించినందుకు భారత ప్రభుత్వానికి, భారత ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు సుందర్ పిచాయ్. ఈ విధంగా భారతదేశం తనను గౌరవించడంపై ఆనందం వ్యక్తం చేశారు. భారతదేశం నాలో భాగంగా ఉందని.. ఎక్కడికి వెళ్లినా ఇండియా నాతోనే ఉంటుందని ఆయన అన్నారు. ఈ క్రమంలో మంచి అవకాశాలను అందించిన తల్లిదండ్రులకు, తాను ఇలా ఎదగడంతో సహాయపడిన కుటుంబం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ కార్యక్రమంలో శాన్ ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సుల్ జనరల్ టీవీ నాగేంద్ర ప్రసాద్ కూడా పాల్గొన్నారు.
భారతదేశంలో సాంకేతిక మార్పులు వేగంగా జరుగుతున్నాయని ఆయన అన్నారు. భారతదేశం ఆవిష్కరించిన డిజిటల్ చెల్లింపుల విధానం ప్రపంచ ప్రజలకు ప్రయోజనం చేకూరుస్తుందని పిచాయ్ అన్నారు. భారత్, గూగుల్ భాగస్వామ్యం మరింతగా బలపడాలని ఆయన ఆకాంక్షించారు. భారతదేశంలో వ్యాపారాలు సాంకేతిక అవకాశాలను అందిపుచ్చుకున్నాయని.. గ్రామీణ ప్రాంతాలకు కూడా మునుపెన్నడూ లేనంత వేగంగా ప్రజలు ఇంటర్నెట్ పొందుతున్నారని పిచాయ్ అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ విజన్ ఇండియాలో టెక్నాలజీ వేగంగా పెరుగుతుందని ఆయన అన్నారు.
తాజావార్తలు
-
Navjot Kaur Sidhu: రాఘవ్ చద్దా బీజేపీలో చేరడానికి ప్రియాంక చోప్రానే కారణం.. అసలు కథ ఇదేనా?
-
యష్ ‘టాక్సిక్’కు ఓటీటీ టెన్షన్..
-
Mahabubabad: దారుణం.. ఇద్దరు కుమారులకు ఉరేసి, తానూ ఆత్మహత్య చేసుకున్న తండ్రి..
-
Ashwini Vaishnaw: విశాఖపట్నం ఇక ఏఐపట్నం.. దక్షిణాది రాష్ట్రాలకు పూర్తి న్యాయం.. అమరావతి నుంచి త్వరలోనే బుల్లెట్ ట్రైన్..
-
Mumbai: దారుణం.. కల్మా పఠించలేదని ఇద్దరు సెక్యూరిటీ గార్డులపై దాడి.. రంగంలోకి ఏటీఎస్
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!