Sundar Pichai: గూగుల్ సీఈఓకి పద్మభూషణ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Google CEO Sundar Pichai Receives Padma Bhushan In California: టెక్ దిగ్గజం ఆల్ఫాబెట్, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ కు పద్మభూషణ్ అవార్డును ప్రధానం చేశారు అమెరికాలోని భారత రాయబారి. 2022లో ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ విభాగంలో ఆయనకు పద్మభూషణ్ అవార్డును ప్రకటించింది భారత ప్రభుత్వం. ఈ ఏడాది 17 మందికి అవార్డుల్లో ప్రకటిస్తే అందులో సుందర్ పిచాయ్ కూడా ఉన్నారు. శుక్రవారం శాన్ ఫ్రాన్సిస్కోతో తన సన్నిహితులు, కుటుంబసభ్యుల మధ్య భారతదేశ మూడో అత్యున్నత పురస్కారాన్ని అందుకున్నారు. అమెరికాలో భారత రాయబారి తరంజిత్ సింగ్ సంధు, సుందర్ పిచాయ్ కి ఈ పురస్కారాన్ని అందించారు.
Read Also: USA: భారత్కు అమెరికా అండగా ఉంటుంది.. మీకు సంబంధం లేదని చైనాకు వార్నింగ్
Also Read
- Nepal Floods: నేపాల్ విలయం.. కైలాస మానస సరోవర్ యాత్రకు వెళ్లిన 400 మంది గల్లంతు..
- LPG e-KYCపై కీలక అప్డేట్.. లాస్ట్ డెడ్లైన్ ఇదే..! గ్యాస్ కనెక్షన్కే ఎసరు..?
- UP: మహిళలపై అఖిలేష్ ఎన్నికల వరాలు.. ఏడాదికి రూ.40 వేలు సాయం ప్రకటన
- Nepal Floods: నేపాల్ ప్రధానికి నరేంద్రమోడీ ఫోన్.. సాయం అందిస్తామని హామీ..
ఈ అవార్డును అందించినందుకు భారత ప్రభుత్వానికి, భారత ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు సుందర్ పిచాయ్. ఈ విధంగా భారతదేశం తనను గౌరవించడంపై ఆనందం వ్యక్తం చేశారు. భారతదేశం నాలో భాగంగా ఉందని.. ఎక్కడికి వెళ్లినా ఇండియా నాతోనే ఉంటుందని ఆయన అన్నారు. ఈ క్రమంలో మంచి అవకాశాలను అందించిన తల్లిదండ్రులకు, తాను ఇలా ఎదగడంతో సహాయపడిన కుటుంబం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ కార్యక్రమంలో శాన్ ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సుల్ జనరల్ టీవీ నాగేంద్ర ప్రసాద్ కూడా పాల్గొన్నారు.
భారతదేశంలో సాంకేతిక మార్పులు వేగంగా జరుగుతున్నాయని ఆయన అన్నారు. భారతదేశం ఆవిష్కరించిన డిజిటల్ చెల్లింపుల విధానం ప్రపంచ ప్రజలకు ప్రయోజనం చేకూరుస్తుందని పిచాయ్ అన్నారు. భారత్, గూగుల్ భాగస్వామ్యం మరింతగా బలపడాలని ఆయన ఆకాంక్షించారు. భారతదేశంలో వ్యాపారాలు సాంకేతిక అవకాశాలను అందిపుచ్చుకున్నాయని.. గ్రామీణ ప్రాంతాలకు కూడా మునుపెన్నడూ లేనంత వేగంగా ప్రజలు ఇంటర్నెట్ పొందుతున్నారని పిచాయ్ అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ విజన్ ఇండియాలో టెక్నాలజీ వేగంగా పెరుగుతుందని ఆయన అన్నారు.
తాజావార్తలు
-
New Cyber Fraud : ఫోన్ పోయిందా.? ఖాతా ఖాళీ చేసే కొత్త మోసం.!
-
Nepal Floods: నేపాల్ విలయం.. కైలాస మానస సరోవర్ యాత్రకు వెళ్లిన 400 మంది గల్లంతు..
-
LPG e-KYCపై కీలక అప్డేట్.. లాస్ట్ డెడ్లైన్ ఇదే..! గ్యాస్ కనెక్షన్కే ఎసరు..?
-
King 100: బాక్సాఫీస్ షేక్ అయ్యేలా నాగ్ 100వ సినిమా.. మళ్లీ టబుతో రొమాన్స్!
-
Trump: ఇరాన్పై దాడికి తులసీ గబ్బార్డ్ చెప్పింది ఇదేనా! అయినా ట్రంప్ ఎందుకు ముందుకెళ్లారు?
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..