Tech Layoffs: బిలియన్ డాలర్లు ఖర్చు చేసి ఉద్యోగులకు ఉద్వాసన.. ఐటీ కంపెనీల స్ట్రాటజీ..
- బిలియన్ డాలర్లు ఖర్చు పెట్టి ఉద్యోగులకు ఉద్వాసన..
- ఐటీ కంపెనీల స్ట్రాటజీ..
- లీగల్ రిస్క్ లేకుండా ప్యాకేజీలు..
- ఇప్పుడు ఖర్చయిన భవిష్యత్తులో లాభమే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tech Layoffs: గ్లోబల్ ఐటీ దిగ్గజ కంపెనీలు వరసగా లేఆఫ్స్ ప్రకటిస్తున్నాయి. తమ ఉద్యోగుల్ని తీసేస్తున్నాయి. దీంతో సాఫ్ట్రంగంలో ఉద్యోగులకు భద్రత కరువైంది. ఎప్పుడు ఎవరి ఉద్యోగం ఊడుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. ఇదిలా ఉంటే, ఇలా ఉద్యోగుల్ని తీసేయడానికి టెక్ కంపెనీలు బిలియన్ డాలర్లను ఖర్చు చేస్తున్నాయి. తీసేసిన ఉద్యోగులకు ప్యాకేజీలను అందిస్తున్నాయి. సెవరెన్స్ ప్యాకేజీలు, నోటిస్ పే, అవుట్ప్లేస్మెంట్ సపోర్ట్, వీసా సాయం, మానసిక ఆరోగ్య సహాయం వంటి వాటికి ఖర్చు చేస్తున్నాయి.
కంపెనీలు ఇలా చేయడానికి అనేక కారణాలు ఉన్నాయి. తొలగిస్తున్న ఉద్యోగులకు ప్యాకేజీలు ఇవ్వడం ద్వారా తమ కంపెనీల ‘‘ఎంప్లాయర్ బ్రాండ్’’ని కాపాడుకోవాలని అనుకుంటున్నాయి. ఉద్యోగులను గౌరవంగా పంపడం ద్వారా మానవీయ కోణాన్ని చూపాలనుకుంటున్నాయి. లీగర్ రిస్క్ తగ్గడం కోసం సెవరెన్స్ ప్యాకేజీలను ఇస్తున్నాయి. దీంతో న్యాయ వివాదాలు తగ్గుతాయని భావిస్తున్నాయి. ఇప్పుడు ఎక్కువగా ఖర్చుపెట్టినప్పటికీ, తర్వాతి కాలంలో జీతాల ఖర్చులు తగ్గిపోవడంతో కంపెనీలు లాభాలు మెరుగుపడుతాయని అనుకుంటున్నాయి. దీంతో పాటు వేగంగా విస్తరిస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI)కి కంపెనీలు ప్రాధాన్యత ఇస్తున్నాయి. మానవవనరుల్ని తగ్గించి ఆటోమేటెడ్ ప్రాసెస్లకు మారడాన్ని లక్ష్యంగా పెట్టుకున్నాయి.
Also Read
- IRCTC: తత్కాల్ టికెట్ దొరకలేదని బాధపడొద్దు.. మీకు ఈ ఆప్షన్ ఉందని తెలుసా!
- Punjab Politics: నిన్న బాదల్, నేడు రాఘవ్ చద్దాలతో ప్రధాని మోడీ భేటీ.. రసవత్తరంగా పంజాబ్ పాలిటిక్స్..
- Renu Dhariyal: అయ్ బాబోయ్ ఎంతపొడుగో.. జుట్టు పెంచుకుంటూ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కొట్టేసిన మహిళ..
- PM Modi: భవిష్యత్ భారత్ నిర్మాతలు మీరే.. యువతకు ప్రధాని మోడీ స్ఫూర్తిదాయక సందేశం..
Read Also: Kantara Chapter 1 : ‘కాంతార చాప్టర్ 1’ 1000 కోట్ల మార్క్ను అడ్డుకున్న నిర్మాతలు?
గ్లోబల్ ఐటీ కంపెనీలు భారీగా ఖర్చు పెట్టి ఉద్యోగుల్ని సాగనంపుతున్నాయి. ఉదాహరణకు దేశీయ టెక్ దిగ్గజం టీసీఎస్ 20,000 మంది ఉద్యోగులను తగ్గించడానికి రూ. 1135 కోట్లు ఖర్చు చేస్తోంది. యాక్సెంచర్ గత 3 ఏళ్లలో 2 బిలియన్ డాలర్ల కన్నా ఎక్కువ సెవరెన్స్ ఖర్చు చేసింది. గూగుల్ 12,000 మంది ఉద్యోగుల్ని తొలగించడానికి ఏకంగా 1 బిలియన్ డాలర్లను కేటాయించింది. ఫేస్బుక్ మాతృసంస్థ మెటా 2024-25లో 1 బిలియన్ డాలర్లను ఖర్చు చేసింది. అమెజాన్ 30,000 కార్పొరెట్ ఉద్యోగుల్ని తొలగించడానికి కూడా భారీగా ఖర్చు చేస్తోంది.
అయితే, దీనిపై పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇది కరుణ కాదని, రిస్క్ మేనేజ్మెంట్, కంపెనీలు ఇప్పుడు నష్టం భరిస్తే, భవిష్యత్తులో ఖర్చులు తగ్గుతాయని చెబుతున్నారు. ఏఐ కారణంగా పునర్వ్యవస్థీకరణ జరుగుతోందని, సెవరెన్స్ ప్యాకేజీ అనేది ఒక రకమైన ట్రాన్సిషన్ ఖర్చు మాత్రమే అని చెబుతున్నారు. మొత్తంగా చూస్తే, కంపెనీలు భారీగా ఖర్చు పెట్టడం కూడా వ్యాపార వ్యూహమే అని చెబుతున్నారు. ఇప్పుడు, ఐటీ రంగంలో ఉద్యోగుల్ని సాగనంపడం కూడా పెట్టుబడి లాంటిదే అని అభిప్రాయపడుతున్నారు.
తాజావార్తలు
-
North Korea: కిమ్ జోంగ్ ఉన్ ఎక్కడ? రెండు నెలలుగా కనిపించని ఉత్తర కొరియా అధినేత
-
Medico Priyanka : కిమ్స్లో కూతురు మృత్యుపోరాటం.. తండ్రి కన్నీటి వేడుకోలు.!
-
Mrunal Thakur-Yashasvi Jaiswal Dating: యశస్వితో రిలేషన్షిప్.. మృణాల్ ఠాకూర్ కామెంట్స్ వైరల్.. నిజమెంత?
-
Uday Krishna Reddy : ట్రైనీ ఐపీఎస్ ఉదయ్కృష్ణారెడ్డి కేసులో సంచలన మలుపు
-
PAKISTAN: పెట్రోల్ ధరల మంట.. పాకిస్థాన్లో రోడ్డెక్కిన వేలాది మంది
ట్రెండింగ్
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్కు ముందే ధరలు లీక్.!
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!