Tech Layoffs: బిలియన్ డాలర్లు ఖర్చు చేసి ఉద్యోగులకు ఉద్వాసన.. ఐటీ కంపెనీల స్ట్రాటజీ..
- బిలియన్ డాలర్లు ఖర్చు పెట్టి ఉద్యోగులకు ఉద్వాసన..
- ఐటీ కంపెనీల స్ట్రాటజీ..
- లీగల్ రిస్క్ లేకుండా ప్యాకేజీలు..
- ఇప్పుడు ఖర్చయిన భవిష్యత్తులో లాభమే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tech Layoffs: గ్లోబల్ ఐటీ దిగ్గజ కంపెనీలు వరసగా లేఆఫ్స్ ప్రకటిస్తున్నాయి. తమ ఉద్యోగుల్ని తీసేస్తున్నాయి. దీంతో సాఫ్ట్రంగంలో ఉద్యోగులకు భద్రత కరువైంది. ఎప్పుడు ఎవరి ఉద్యోగం ఊడుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. ఇదిలా ఉంటే, ఇలా ఉద్యోగుల్ని తీసేయడానికి టెక్ కంపెనీలు బిలియన్ డాలర్లను ఖర్చు చేస్తున్నాయి. తీసేసిన ఉద్యోగులకు ప్యాకేజీలను అందిస్తున్నాయి. సెవరెన్స్ ప్యాకేజీలు, నోటిస్ పే, అవుట్ప్లేస్మెంట్ సపోర్ట్, వీసా సాయం, మానసిక ఆరోగ్య సహాయం వంటి వాటికి ఖర్చు చేస్తున్నాయి.
కంపెనీలు ఇలా చేయడానికి అనేక కారణాలు ఉన్నాయి. తొలగిస్తున్న ఉద్యోగులకు ప్యాకేజీలు ఇవ్వడం ద్వారా తమ కంపెనీల ‘‘ఎంప్లాయర్ బ్రాండ్’’ని కాపాడుకోవాలని అనుకుంటున్నాయి. ఉద్యోగులను గౌరవంగా పంపడం ద్వారా మానవీయ కోణాన్ని చూపాలనుకుంటున్నాయి. లీగర్ రిస్క్ తగ్గడం కోసం సెవరెన్స్ ప్యాకేజీలను ఇస్తున్నాయి. దీంతో న్యాయ వివాదాలు తగ్గుతాయని భావిస్తున్నాయి. ఇప్పుడు ఎక్కువగా ఖర్చుపెట్టినప్పటికీ, తర్వాతి కాలంలో జీతాల ఖర్చులు తగ్గిపోవడంతో కంపెనీలు లాభాలు మెరుగుపడుతాయని అనుకుంటున్నాయి. దీంతో పాటు వేగంగా విస్తరిస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI)కి కంపెనీలు ప్రాధాన్యత ఇస్తున్నాయి. మానవవనరుల్ని తగ్గించి ఆటోమేటెడ్ ప్రాసెస్లకు మారడాన్ని లక్ష్యంగా పెట్టుకున్నాయి.
Also Read
- Rahul Gandhi on NEET Paper Leak: "యువత భవిష్యత్తును ఎక్కువగా దెబ్బతీసింది మీరే".. ప్రధాని మోడీకి రాహుల్ గాంధీ కౌంటర్
- PM Modi on NEET Protest: నీట్ పేపర్ లీక్ వివాదంపై మౌనం వీడిన ప్రధాని మోడీ.. ఫాస్ట్ట్రాక్ కోర్టుల ఏర్పాటుకు ఆదేశం
- CJP Protest: విద్యార్థుల మాటున అసాంఘిక శక్తులు.. CJP నిరసనలపై పోలీసుల సంచలన ప్రకటన..
- Dharmendra Pradhan: కేంద్ర విద్యాశాఖ మంత్రిని తప్పించకపోవడానికి 5 బలమైన కారణాలివే..
Read Also: Kantara Chapter 1 : ‘కాంతార చాప్టర్ 1’ 1000 కోట్ల మార్క్ను అడ్డుకున్న నిర్మాతలు?
గ్లోబల్ ఐటీ కంపెనీలు భారీగా ఖర్చు పెట్టి ఉద్యోగుల్ని సాగనంపుతున్నాయి. ఉదాహరణకు దేశీయ టెక్ దిగ్గజం టీసీఎస్ 20,000 మంది ఉద్యోగులను తగ్గించడానికి రూ. 1135 కోట్లు ఖర్చు చేస్తోంది. యాక్సెంచర్ గత 3 ఏళ్లలో 2 బిలియన్ డాలర్ల కన్నా ఎక్కువ సెవరెన్స్ ఖర్చు చేసింది. గూగుల్ 12,000 మంది ఉద్యోగుల్ని తొలగించడానికి ఏకంగా 1 బిలియన్ డాలర్లను కేటాయించింది. ఫేస్బుక్ మాతృసంస్థ మెటా 2024-25లో 1 బిలియన్ డాలర్లను ఖర్చు చేసింది. అమెజాన్ 30,000 కార్పొరెట్ ఉద్యోగుల్ని తొలగించడానికి కూడా భారీగా ఖర్చు చేస్తోంది.
అయితే, దీనిపై పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇది కరుణ కాదని, రిస్క్ మేనేజ్మెంట్, కంపెనీలు ఇప్పుడు నష్టం భరిస్తే, భవిష్యత్తులో ఖర్చులు తగ్గుతాయని చెబుతున్నారు. ఏఐ కారణంగా పునర్వ్యవస్థీకరణ జరుగుతోందని, సెవరెన్స్ ప్యాకేజీ అనేది ఒక రకమైన ట్రాన్సిషన్ ఖర్చు మాత్రమే అని చెబుతున్నారు. మొత్తంగా చూస్తే, కంపెనీలు భారీగా ఖర్చు పెట్టడం కూడా వ్యాపార వ్యూహమే అని చెబుతున్నారు. ఇప్పుడు, ఐటీ రంగంలో ఉద్యోగుల్ని సాగనంపడం కూడా పెట్టుబడి లాంటిదే అని అభిప్రాయపడుతున్నారు.
తాజావార్తలు
-
Vivienne Pitt : బ్రాడ్ పిట్ ఇంటిపేరుకు మరో షాక్.. లీగల్గా తొలగించేందుకు ఏంజెలీనా కుమార్తె పిటిషన్!
-
Objection My Lord Trailer : మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ‘అబ్జెక్షన్ మై లార్డ్’ ట్రైలర్ విడుదల
-
Rahul Gandhi on NEET Paper Leak: “యువత భవిష్యత్తును ఎక్కువగా దెబ్బతీసింది మీరే”.. ప్రధాని మోడీకి రాహుల్ గాంధీ కౌంటర్
-
Dinesh Karthik vs Alastair Cook: ఐపీఎల్ గురించి వాడివేడి చర్చ.. ఇంటర్వ్యూలోనే కొట్టుకోబోయిన దినేష్ కార్తీక్, అలిస్టర్ కుక్!
-
AP Cabinet Meeting: కేబినెట్ ముందు 25కి పైగా కీలక ప్రతిపాదనలు.. నిరుద్యోగులకు గుడ్ న్యూస్..
ట్రెండింగ్
-
6 ఏళ్ల తర్వాత ‘S’ సిరీస్ కమ్బ్యాక్.. ప్రీమియం ఫీచర్లతో అతి త్వరలో రాబోతున్న Vivo S2 స్మార్ట్ ఫోన్.!
-
అల్ట్రా స్లిమ్ డిజైన్, 200MP కెమెరా, 5000mAh బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్ Samsung Galaxy Z Fold8 Ultra లాంచ్.!
-
Samsung కొత్త స్మార్ట్వాచ్లు వచ్చేశాయి.. AI హెల్త్ ట్రాకింగ్తో Samsung Galaxy Watch9, Ultra2 లాంచ్..!
-
IND vs ZIM 1st T20: నేడు జింబాబ్వేతో తొలి టీ20.. వైభవ్పై భారీ అంచనాలు.. ప్లేయింగ్ 11, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Samsung Intelligent Eyewear లాంచ్.. మెసేజ్లు చదవడం నుంచి లైవ్ ట్రాన్స్లేషన్ వరకు ఎన్నో ఫీచర్లు.!