BJP Bengal Win: పశ్చిమ బెంగాల్లో బీజేపీ విజయంపై మన దేశంలో మాత్రమే కాదు, ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాలు స్పెషల్ ఫోకస్ పెట్టాయి. ముఖ్యంగా మన సరిహద్దు దేశాలైన పాకిస్తాన్, బంగ్లాదేశ్తో పాటు అమెరికా, బ్రిటన్ వంటి దేశాలు ఆసక్తిని కనబరిచాయి. ఇక తమిళనాడులో యాక్టర్ విజయ్ విజయంపై కూడా ప్రపంచవ్యాప్తంగా చర్చ నడిచింది. పలు దేశాల మీడియాలు ప్రత్యేక కవరేజ్ ఇచ్చాయి.
బ్రిటన్కు చెందిన బీబీసీ తన కథనంలో.. బెంగాల్లో బీజేపీ విజయం ప్రధాని నరేంద్ర మోడీ రాజకీయ ప్రయాణంలో కీలక మైలురాయిగా పేర్కొంది. ఇది తూర్పు భారతదేశంలో బీజేపీకి పెద్ద విజయమని వ్యాఖ్యానించింది. మరో ప్రముఖ పత్రిక ‘‘గార్డియన్’’ కూడా బెంగాల్లో బీజేపీ గెలుపు దేశ రాజకీయాల్లో పెద్ద మార్పుకు దారి తీస్తుందని చెప్పింది.
Read Also: Ragi Burfi Recipe: ఎముకలకు బలం.. రక్తహీనతకు చెక్.. వంటరాని వాళ్లు కూడా ఈజీగా చేసుకునే హెల్తీ స్వీట్!
అమెరికాకు చెందిన ‘‘ది న్యూయార్క్ టైమ్స్’’ బీజేపీ విజయాన్ని ‘‘హిస్టారిక్’’ అని అభివర్ణించింది. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో బీజేపీ తన ప్రభావాన్ని విస్తరించుకుంటూ వెళ్తోందని పేర్కొంది. ఇదే సమయంలో తమిళనాడులో విజయ్ విజయం కూడా పెద్ద సర్ప్రైజ్ అని పేర్కొంది. ‘‘వాషింగ్టన్ పోస్ట్’’ తన కథనంలో, ఈ ఫలితాలు ప్రధాని మోడీ స్థాయిని మరింత బలపరుస్తుందని తెలిపింది. రాబోయే 2029 లోక్సభ ఎన్నికలపై ఇది కీలక ప్రభావం చూపుతుందని చెప్పింది.
ఇదిలా ఉంటే, పాకిస్తాన్కు చెందిన ప్రముఖ మీడియా ‘‘డాన్’’ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. బీజేపీ విజయాన్ని హైలెట్ చేస్తూ, మోడీ ప్రభుత్వానికి ఇది మరింత బలాన్ని పెంచుతుందని చెప్పింది. బంగ్లాదేశ్కు చెందిన ఢాకా ట్రిబ్యూన్, బెంగాల్లో బీజేపీ గెలుపుతో పాటు తమిళనాడులో విజయ్ గెలుపును ప్రధానంగా ప్రస్తావించింది.
