Jeet Adani Wedding: మూడు ముళ్లతో ఒక్కటైన జీత్, దివా షా.. ఫొటోలు వైరల్
- మూడు ముళ్లతో ఒక్కటైన జీత్, దివా షా
- ఫొటోలు సోషల్ మీడియాలో పంచుకున్న అదానీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అదానీ కుమారుడు జీత్ అదానీ, దివా షా వివాహం ఘనంగా జరిగింది. అతిరథ మహరథుల సమక్షంలో అంగరంగ వైభవంగా పెళ్లి జరిగింది. శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు వివాహ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. గుజరాత్లోని అహ్మదాబాద్లోని శాంతిగ్రామ్ అనే అదానీ టౌన్షిప్లో గుజరాతీ సంస్కృతి ఆచారాల ప్రకారం వివాహం జరిగింది. జీత్ అదానీ… వజ్రాల వ్యాపారి జైమిన్ షా కుమార్తె దివా జైమిన్ షాను వివాహం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన పెళ్లి ఫొటోలను గౌతమ్ అదానీ సోషల్ మీడియాలో పంచుకున్నారు. ప్రస్తుతం పెళ్లి ఫొటోలు వైరల్గా మారాయి.
ఇది కూడా చదవండి: Relationships: తియ్యగా ఉన్నాయని ఇలాంటి వాళ్ల మాటలు వింటున్నారా? మొదటికే మోసం
Also Read
- Supreme Court : ప్రైవేట్ వర్సిటీల ఇష్టారాజ్యంపై సుప్రీంకోర్టు సీరియస్.!
- Geetanjali Angmo: సుప్రీంకోర్టు మెట్లెక్కిన సోనమ్ వాంగ్చుక్ భార్య.. హైకోర్టు తీర్పుపై సవాల్!
- Sonam Wangchuk: సోనమ్ వాంగ్చుక్ను ఆస్పత్రికి తరలించడం సరైనదే: ఢిల్లీ హైకోర్టు
- Congress: డీలిమిటేషన్కు కాంగ్రెస్ మద్దతు ఇస్తుందా? క్లారిటీ ఇచ్చిన జైరాం రమేష్.
‘‘సర్వశక్తిమంతుడైన దేవుని ఆశీర్వాదంతో జీత్ మరియు దివా ఈరోజు వివాహం అనే పవిత్రమైన బంధంతో ఒక్కటయ్యారు. అహ్మదాబాద్లో సాంప్రదాయ ఆచారాలు మరియు శుభ్ మంగళ్ భావ్తో ప్రియమైనవారి మధ్య వివాహం జరిగింది. ఇది చాలా ప్రైవేట్ కార్యక్రమం. కాబట్టి మేము శ్రేయోభిలాషులను ఆహ్వానించలేకపోయాము. దీనికి నేను క్షమాపణలు కోరుతున్నాను. నా కుమార్తె దివా మరియు జీత్ కోసం మీ అందరి నుంచి నేను హృదయపూర్వకంగా ఆశీర్వాదాలు మరియు ప్రేమను కోరుకుంటున్నాను.’’ అని పారిశ్రామికవేత్త అదానీ ఎక్స్ ట్విట్టర్ పోస్ట్లో రాశారు.
ఇది కూడా చదవండి: Tirumala: తిరుమలలో దంపతుల ఆత్మహత్య కలకలం..
గౌతమ్ అదానీ రూ. 10,000 కోట్లు విరాళంగా ఇచ్చారు. వివిధ సామాజిక కార్యక్రమాలకు ఇస్తున్నట్లు కుమారుడి వివాహం సందర్భంగా అదానీ ప్రకటన చేశారు. విరాళంలో ఎక్కువ భాగం ఆరోగ్య సంరక్షణ, విద్య మరియు నైపుణ్యాభివృద్ధిలో భారీ మౌలిక సదుపాయాల కార్యక్రమాలకు నిధులు ఉపయోగించినట్లు పేర్కొన్నారు.

ప్రతి సంవత్సరం 500 మంది వికలాంగ మహిళల వివాహానికి ఒక్కొక్కరికి రూ. 10 లక్షలు విరాళంగా ఇస్తామని కొత్త జంట కూడా ఇటీవల ప్రతిజ్ఞ చేసింది. వివాహానికి కొన్ని రోజుల ముందు జీత్ అదానీ ఈ చొరవ తీసుకున్నారు. 21 మంది నూతన వధూవరులు (వికలాంగ మహిళలు), వారి భర్తలను కలిశారు. జీత్ అదానీ పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయంలో స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ అప్లైడ్ సైన్సెస్లో చదివారు. 2019లో అదానీ గ్రూప్లో చేరారు. ప్రస్తుతం జీత్.. విమానాశ్రయాల వ్యాపారం, అదానీ డిజిటల్ ల్యాబ్స్కు నాయకత్వం వహిస్తున్నారు.
परमपिता परमेश्वर के आशीर्वाद से जीत और दिवा आज विवाह के पवित्र बंधन में बंध गए।
यह विवाह आज अहमदाबाद में प्रियजनों के बीच पारंपरिक रीति रिवाजों और शुभ मंगल भाव के साथ संपन्न हुआ।
यह एक छोटा और अत्यंत निजी समारोह था, इसलिए हम चाह कर भी सभी शुभचिंतकों को आमंत्रित नहीं कर सके,… pic.twitter.com/RKxpE5zUvs
— Gautam Adani (@gautam_adani) February 7, 2025
తాజావార్తలు
-
Missing Girls: హైదరాబాద్లో ముగ్గురు మైనర్ బాలికలు అదృశ్యం
-
Jagga Reddy : కేటీఆర్ రక్తంలో నిజాయితీ, కృతజ్ఞత లేదు
-
Rohit Sharma Century: హిట్ హిట్ మ్యాన్.. రోహిత్ శర్మ రికార్డు సెంచరీ.. గెలుపు దిశగా ఇండియా..
-
Pregnancy Tips : నువ్వులు తినడం వల్ల గర్భస్రావం అవుతుందా.?
-
Supreme Court : ప్రైవేట్ వర్సిటీల ఇష్టారాజ్యంపై సుప్రీంకోర్టు సీరియస్.!
ట్రెండింగ్
-
Jagannath Prasadam Recipe : జగన్నాథుడి ప్రసాదం మాల్పువా.. ఇంట్లోనే ఇలా చేస్తే రుచి అదుర్స్.!
-
Rainy Season Tips: వర్షాకాలంలో గోడలకు, మెట్లకు పాకురు పట్టిందా.? ఈ చిట్కా ట్రై చేయండి.!
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!