Gautam Adani: 5,800 మీటర్ల నుంచి పడిపోయిన పర్వతారోహకుడికి గౌతమ్ అదానీ సహాయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gautam Adani: గత నెల నేపాల్ లోని అన్నపూర్ణ పర్వతాన్ని అధిరోహిస్తూ ప్రమాదవశాత్తు పర్వతాల్లోని లోతైన పగుళ్లలో పడిపోయిన పర్వతారోహకుడు అనురాగ్ మాలూను ఖాట్మాండ్ నుంచి న్యూఢిల్లీ తరలించేందు ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ సహాయం చేశారు. ఎయిర్ అంబులెన్స్ ఏర్పాటు చేసి ఢిల్లీకి తరలించారు. గాయపడిన తన తమ్ముడిని విమానంలో తరలించేందుకు సకాలంలో సాయం చేసిన గౌతమ్ అదానీకి అనురాగ్ మాలూ సోదరుడు ఆశిశ్ మాలూ ట్విట్టర్ ద్వారా కృతజ్ఞతలు తెలిపారు.
Read Also: Zomato UPI: యూపీఐ ద్వారా జొమాటో సేవలు.. ఇక సీఓడీకి ముగింపు పలుకనుందా..?
Also Read
- Nurse Murder Case: ఆపరేషన్ థియేటర్లో నర్సు హత్య.. విషం ఇంజెక్ట్ చేసి చంపిన ప్రియుడు..
- Home Guard: 5 నెలలుగా జీతం లేదు.. కన్నీటి పర్యంతమైన మహిళా హోంగార్డు
- Sonam Wangchuk: ‘‘ఇది రెండో స్వాతంత్య్ర ఉద్యమం’’ సోనమ్ వాంగ్చుక్ సందేశం
- Monsoon Returns: వాతావరణశాఖ గుడ్న్యూస్.. దేశాన్ని కమ్మేసిన వర్ష మేఘాలు..
రాజస్థాన్ కిషన్ గఢ్ లో నివసించే అనురాగ్ మాలూ ఏప్రిల్ 17న అన్నపూర్ణ పర్వతంపై క్యాంప్ 3 నుంచి దిగుతుండగా.. 5800 మీటర్ల ఎత్తు నుంచి పడిపోయి తప్పిపోయాడు. అతడిని ఏప్రిల్ 20న మూడు రోజుల తర్వాత రక్షించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో నేపాల్ లోని పోఖారాలోని మణిపాల్ ఆస్పత్రికి అక్కడ నుంచి ఖాట్మండులోని మెడిసిటీ ఆసుపత్రికి తరలించారు. ప్రపంచంలో ఎతైన పర్వతాల్లో అన్నపూర్ణ 10వది. ఇది ఉండే హిమాలయ ప్రాంతం ప్రమాదాలకు నెలవు.
#WATCH | Mountaineer Anurag Maloo who was rescued after he fell into a deep crevasse on Mount Annapurna in Nepal last month, airlifted to India from Kathmandu
He was airlifted in an air ambulance arranged by Adani Foundation. He is currently undergoing medical treatment at the… pic.twitter.com/cQy6qA9FdJ
— ANI (@ANI) May 16, 2023
నేపాల్ నుంచి భారతదేశానికి ఎయిర్ లిఫ్ట్ చేయడానికి తమ వద్ద అందుకు అవసరమయ్యే డబ్బు లేదని, ఆదుకోవాల్సిందిగా మాలూ కుటుంబం అదానీ ఫౌండేషన్ సహాయాన్ని అభ్యర్థించింది. అదానీ గ్రూప్ చైర్మన్, బిలియనీర్ గౌతమ్ అదానీ వెంటనే చర్యలు తీసుకున్నారు. అదానీ ఫౌండేషన్ ఎయిర్ అంబులెన్స్ ద్వారా మాలూను ఖాట్మాండు నుంచి ఢిల్లీకి తరలించారు. ప్రస్తుతం అతడిని న్యూ ఢిల్లీలోని ఆల్-ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS)కి తరలించారు. ప్రస్తుతం అతడికి చికిత్స అందిస్తున్నారు. అతడి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం. అదానీ ఫౌండేషన్ కు గౌతమ్ అదానీ భార్య ప్రీతీ చీఫ్ గా ఉన్నారు. గాయపడిన పర్వతారోహకుడికి సహాయం అందించడం తన భార్యకు దొరికిన గొప్ప అవకాశం అదానీ అని కొనియాడారు. అనురాగ్ మాలూ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని అన్నారు.
Priti and I are privileged to be of help. We are happy to learn that Anurag is safe and are praying for his speedy recovery. We are confident that he will soon be ready to conquer more of life's peaks. 🙏🏽
— Gautam Adani (@gautam_adani) May 16, 2023
తాజావార్తలు
-
Nurse Murder Case: ఆపరేషన్ థియేటర్లో నర్సు హత్య.. విషం ఇంజెక్ట్ చేసి చంపిన ప్రియుడు..
-
Donkey Wedding: వర్షాలు కురవాలని గాడిదలకు ఘనంగా పెళ్లి.. కళ్యాణదుర్గంలో వినూత్న సంప్రదాయం!
-
Horror Movie: మైత్రి మూవీ మేకర్స్ నుంచి తొలి హారర్ మూవీ.. ‘418’తో భయపెట్టేందుకు సిద్ధం!
-
Home Guard: 5 నెలలుగా జీతం లేదు.. కన్నీటి పర్యంతమైన మహిళా హోంగార్డు
-
CM Revanth Reddy: పదవుల కోసం గాంధీ భవన్కు రావొద్దు.. పార్టీ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్
ట్రెండింగ్
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!