Gautam Adani: 5,800 మీటర్ల నుంచి పడిపోయిన పర్వతారోహకుడికి గౌతమ్ అదానీ సహాయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gautam Adani: గత నెల నేపాల్ లోని అన్నపూర్ణ పర్వతాన్ని అధిరోహిస్తూ ప్రమాదవశాత్తు పర్వతాల్లోని లోతైన పగుళ్లలో పడిపోయిన పర్వతారోహకుడు అనురాగ్ మాలూను ఖాట్మాండ్ నుంచి న్యూఢిల్లీ తరలించేందు ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ సహాయం చేశారు. ఎయిర్ అంబులెన్స్ ఏర్పాటు చేసి ఢిల్లీకి తరలించారు. గాయపడిన తన తమ్ముడిని విమానంలో తరలించేందుకు సకాలంలో సాయం చేసిన గౌతమ్ అదానీకి అనురాగ్ మాలూ సోదరుడు ఆశిశ్ మాలూ ట్విట్టర్ ద్వారా కృతజ్ఞతలు తెలిపారు.
Read Also: Zomato UPI: యూపీఐ ద్వారా జొమాటో సేవలు.. ఇక సీఓడీకి ముగింపు పలుకనుందా..?
Also Read
- Ketan Agarwal Case: కేతన్ హత్యకు ముందు, తర్వాత చాట్స్ డిలీట్.. సియా-చేతన్ ఫోన్లలో కీలక ఆధారాలు
- Ketan Agarwal Case: మద్యం మత్తులో సియా గోయల్.. వీడియో వైరల్
- Congress: కాంగ్రెస్లో భారీ ప్రక్షాళన.. యూపీతో సహా కీలక రాష్ట్రాల ఇన్ఛార్జ్ల మార్పు! కారణం ఇదేనా
- Monsoon: శాటిలైట్ చిత్రాల్లో షాకింగ్ దృశ్యాలు.. దేశంలో కనిపించని వర్ష మేఘాలు
రాజస్థాన్ కిషన్ గఢ్ లో నివసించే అనురాగ్ మాలూ ఏప్రిల్ 17న అన్నపూర్ణ పర్వతంపై క్యాంప్ 3 నుంచి దిగుతుండగా.. 5800 మీటర్ల ఎత్తు నుంచి పడిపోయి తప్పిపోయాడు. అతడిని ఏప్రిల్ 20న మూడు రోజుల తర్వాత రక్షించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో నేపాల్ లోని పోఖారాలోని మణిపాల్ ఆస్పత్రికి అక్కడ నుంచి ఖాట్మండులోని మెడిసిటీ ఆసుపత్రికి తరలించారు. ప్రపంచంలో ఎతైన పర్వతాల్లో అన్నపూర్ణ 10వది. ఇది ఉండే హిమాలయ ప్రాంతం ప్రమాదాలకు నెలవు.
#WATCH | Mountaineer Anurag Maloo who was rescued after he fell into a deep crevasse on Mount Annapurna in Nepal last month, airlifted to India from Kathmandu
He was airlifted in an air ambulance arranged by Adani Foundation. He is currently undergoing medical treatment at the… pic.twitter.com/cQy6qA9FdJ
— ANI (@ANI) May 16, 2023
నేపాల్ నుంచి భారతదేశానికి ఎయిర్ లిఫ్ట్ చేయడానికి తమ వద్ద అందుకు అవసరమయ్యే డబ్బు లేదని, ఆదుకోవాల్సిందిగా మాలూ కుటుంబం అదానీ ఫౌండేషన్ సహాయాన్ని అభ్యర్థించింది. అదానీ గ్రూప్ చైర్మన్, బిలియనీర్ గౌతమ్ అదానీ వెంటనే చర్యలు తీసుకున్నారు. అదానీ ఫౌండేషన్ ఎయిర్ అంబులెన్స్ ద్వారా మాలూను ఖాట్మాండు నుంచి ఢిల్లీకి తరలించారు. ప్రస్తుతం అతడిని న్యూ ఢిల్లీలోని ఆల్-ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS)కి తరలించారు. ప్రస్తుతం అతడికి చికిత్స అందిస్తున్నారు. అతడి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం. అదానీ ఫౌండేషన్ కు గౌతమ్ అదానీ భార్య ప్రీతీ చీఫ్ గా ఉన్నారు. గాయపడిన పర్వతారోహకుడికి సహాయం అందించడం తన భార్యకు దొరికిన గొప్ప అవకాశం అదానీ అని కొనియాడారు. అనురాగ్ మాలూ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని అన్నారు.
Priti and I are privileged to be of help. We are happy to learn that Anurag is safe and are praying for his speedy recovery. We are confident that he will soon be ready to conquer more of life's peaks. 🙏🏽
— Gautam Adani (@gautam_adani) May 16, 2023
తాజావార్తలు
-
Ireland: ఐర్లాండ్ చేతిలో ఓడిన 8వ దేశంగా భారత్.. ఇక మిగిలింది ఆ మూడే..
-
Off The Record: కందుకూరు టీడీపీలో సిట్టింగ్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే
-
Shreyas Iyer: ఐర్లాండ్ చేతిలో ఓటమికి కారణం ఇదే.. నిజాన్ని అంగీకరించిన శ్రేయాస్ అయ్యర్..
-
Pulse Polio: 28న పల్స్ పోలియోకు తెలంగాణ రెడీ.!
-
India Lose: ప్రపంచ ఛాంపియన్ల పరువు ఐర్లాండ్ వీధుల్లో పారేశారు.. శ్రేయాస్ అయ్యర్పై ఆగ్రహం..
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!