Shaheed Express: పొగ లేకుండానే మోగిన ఫైర్ అలారం.. ఉలిక్కిపడ్డ ప్రయాణికులు.. ఏం జరిగిందంటే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shaheed Express: షాహిద్ ఎక్స్ప్రెస్లో కాపేపు ఫైర్ అలారం అలజడి సృష్టించింది. నిప్పూ లేదు, పొగా లేదు.. కానీ ఫైర్ అలారం మోగింది. దీంతో ఆ భోగీలో ప్రయాణికులంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఈ ఫైర్ అలారం ఎక్కడి నుంచి వచ్చిందో అర్థం కాక కాసేపు బిక్కుబిక్కుమంటూ గడిపారు. దీంతో రైల్వే సిబ్బందిని అలర్ట్ చేయడం అసలు విషయం బయటపడింది. ఇంతకి అసలేం జరిగిందంటే.. ఉత్తరప్రదేశ్ డియోరియా జిల్లాలోని గౌరీబజార్ రైల్వే స్టేషన్లో ఆగి ఉన్న షాహిద్ ఎక్స్ప్రెస్లోని ఏసీ కోచ్ ఎం6 అలారం మోగింది. ఒక్కసారిగా ఫైర్ అలారం శబ్దం వినిపించడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు.
Also Read: Central Government: జైల్లో నిషేధిత వస్తువులను వాడితే మూడేళ్లు శిక్ష..
Also Read
- PM Modi: నార్వే నుంచి ఇటలీకి బయల్దేరిన మోడీ.. జార్జియా మెలోనితో భేటీకానున్న ప్రధాని
- EPFO: పీఎఫ్ ఖాతాదారులకు పండగలాంటి న్యూస్.. ఇకపై నిమిషాల్లోనే జేబుల్లోకి క్యాష్!
- PM Modi: భారత్-నార్వే ప్రపంచ శాంతిని కోరుకుంటున్నాయి.. ఉగ్రవాదం విషయంలో రాజీపడబోమన్న మోడీ
- CM Vijay: రాజీవ్గాంధీ హంతకుడికి సీఎం విజయ్ నివాళి.. రాజకీయ దుమారం రేపుతోన్న వ్యవహారం
మంగళవారం సాయంత్రం 5 గంటల సమయంలో ఈ షాహిద్ ఎక్స్ప్రెస్ రైలు అమృత్సర్ నుంచి జయనగర్కు వెళుతోంది. అలారం మోగిన దాదాపు 45 నిమిషాల తర్వాత రైలు డియోరియా స్టేషన్కు చేరుకుంది. ఇక్కడ రైలును ఆర్పీఎఫ్, GRP తనిఖీ చేయగా రైలులో ఎక్కడా మంటలు లేవని గుర్తించారు. ఇక ఇది విని ప్రయాణీకులంతా ఊపిరి పీల్చుకున్నారు. కానీ అలారం ఎందుకు మోగిందనేది వారికి అర్థం కాలేదు. ఈ రైలు గౌరీబజార్ స్టేషన్కు చేరుకునే సమయానికి పట్టాలపై గూడ్స్ రైలు ఉండటంతో ట్రైయిన్ను కాసేపు మెయిన్లైన్లోనే నిలిపివేశారు. అదే సమయంలో అక్కడ రైల్వేస్టేషన్ సమీపంలో చెత్తను తగులబెడుతున్నారు.
Also Read: Threat Call: టీసీఎస్ ఆఫీస్ కు బాంబు బెదిరింపు.. భయాందోళనలో ఉద్యోగులు
అందులో నుంచి పొగలు రావడంతో.. ఆ పొగలకు రైలులోని ఫైర్ అలారం యాక్టివేట్ అయిందని అధికారులు వెల్లడించారు. ఈ సంఘటనపై గౌరీబజార్ రైల్వేస్టేషన్ సూపరింటెండెంట్ మాట్లాడుతూ.. టౌన్ ప్రాంతంలోని రైల్వే లైన్ సమీపాని దగ్గరగా పెద్ద ఎత్తున చెత్తను తగులబెట్టారు. దీంతో విపరీతంగా మంటలు ఎగిసిపడటంతో ఆ ప్రాంతమంత పోగ కమ్ముకుపోయింది. ఆ పోగకు ఏసీ కోచ్లోని అలారం యాక్టివేట్ అయ్యి మోగిందని చెప్పారు. ఇక ఈ ఘటనపై స్టేషన్ సూపరింటెండెంట్ వారణాసి డివిజన్కు సమాచారం అందించారు. దాదాపు 17 నిమిషాల పాటు ఆగిపోయిన ట్రైన్ ఆ తరువాత జైపూర్ వైపు వెళ్లింది.
తాజావార్తలు
-
Dragon Glimpse: ‘డ్రాగన్’ బాక్సాఫీస్ ఊచకోత ఖాయం.. ప్రశాంత్ నీల్ మైండ్ బ్లాకింగ్ గ్లింప్స్!
-
CI: సహాయం కోరితే సహజీవనం చేశాడు.. మహిళ జీవితంతో ఆడుకున్న సీఐ..
-
Hyderabad: పెళ్లికి ముందే తల్లయింది.. చివరికి ప్రియుడిని పెళ్లాడేందుకు కన్నింగ్ ప్లాన్
-
Trump Warning: ‘వాళ్లకు మరో భారీ దెబ్బ ఇవ్వాల్సి రావచ్చు’.. ఇరాన్కు ట్రంప్ తాజా వార్నింగ్
-
Mitchell Marsh: సెంచరీ మిస్.. బ్యాటింగ్ ‘టార్చర్’ అనిపించింది.. మిచెల్ మార్ష్ ఆవేదన..
ట్రెండింగ్
-
Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!