Mamata Banerjee: మమతా బెనర్జీ ఖేల్ ఖతం.. ఓటర్ జాబితాలో 58 లక్షల పేర్లు తొలగింపు..
- వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీకి బిగ్ షాక్..
- తొలి విడత ఓటర్ జాబితా నుంచి 58 లక్షల పేర్లు తొలగింపు..
- ఎస్ఐఆర్లో సంచలనం..
- మమతా ఖేల్ ఖతం అంటూ బీజేపీ ట్వీట్..
Mamata Banerjee: కేంద్రం ఎన్నికల సంఘం ఓట్ల ప్రక్షాళన కోసం నిర్వహిస్తున్న ‘‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR)’’ పశ్చిమ బెంగాల్లో సంచలనం సృష్టిస్తోంది. ముఖ్యంగా బెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీకి ఈ పరిణామం రుచించని విషయంగా ఉంది. ఎస్ఐఆర్ రాష్ట్ర ఓటర్ల జాబితాలో అవకతవకలను బహిర్గతం చేసిందని, రాష్ట్రంలో ఆమె పాలన అంతం కాబోతోందని బీజేపీ పేర్కొంది. తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) నాయకురాలు మమతా బెనర్జీ అక్రమ బంగ్లాదేశీయులు, రోహింగ్యాలు వేసిన ఓట్ల కారణంగానే అధికారంలో ఉన్నారని ఈ ప్రక్రియ వెల్లడించిందని బీజేపీ నాయకుడు అమిత్ మాల్వియా అన్నారు.
పశ్చిమ బెంగాల్ ఓటర్ల జాబితా నుంచి 58 లక్షల పేర్లను తొలగిస్తూ మొదటి జాబితా విడుదలైంది. తొలగించబడిన ఓట్లు ఎక్కువగా కోల్కతా ప్రాంతంలో జరిగాయి. ఇది సంప్రదాయకంగా టీఎంసీకి పట్టు ఉన్న ప్రాంతం అని మాల్వియా చెప్పారు. మమతకు అనుకూలంగా ఓటేయడానికి గతంలో గైర్హాజరు, బదిలీ చేయబడిన, మరణించిన, నకిలీ ఓటర్ ఎంట్రీలను ఎలా ఉపయోగించుకున్నారో ఇది స్పష్టం చేస్తుందని, ఇప్పుడు ఎస్ఐఆర్ ఈ మార్గాన్ని మూసేసిందని, ఈసారి నిజమైన పశ్చిమ బెంగాల్ ఓటర్లు భవిష్యత్తును నిర్ణయిస్తారని, మమతా బెనర్జీ పాలన అంతం చేయడానికి ఓటేస్తారని మాల్వియా ఎక్స్లో పోస్ట్ చేశారు.
Also Read
- PM Modi: ప్రధాని మోడీపై సంచలన వ్యాఖ్యలు.. మల్లికార్జున్ ఖర్గేకు ఎన్నికల సంఘం నోటీసులు
- Supreme Court: సీఎం మమత తీరుపై సుప్రీంకోర్టు ఫైర్.. 'మీ చర్య ప్రజాస్వామ్యానికే ప్రమాదం'.. అంటూ ఆగ్రహం!
- White Towel: ప్రభుత్వ కార్యాలయాల్లో కుర్చీలపై తెల్ల టవల్ ఎందుకు?.. దీని వెనుక ఉన్న స్టోరీ ఇదే!
- Affair Doubt: ఏడేళ్ల క్రితం లవ్ మ్యారేజ్.. భార్య వీడియో కాల్లో ఉండగా సడన్ గా ఎంట్రీ ఇచ్చిన భర్త.. అది చూసి..
దాదాపు 30 లక్షలు ట్రేస్ చేయలేని ఎంట్రీలు ఉన్నాయని, అదనంగా 1.70 కోట్ల పేర్లు స్పష్టమైన అసమానతలు ఉన్నందుకు నోటీసులు అందుకోవచ్చని మాల్వియా అన్నారు. ఈ సంఖ్యను చూస్తే అక్రమ బంగ్లాదేశీయులు, రోహింగ్యాలు వేసిన ఓట్లతోనే మమతా బెనర్జీ అధికారంలో కొనసాగుతున్నారని, ఎస్ఐఆర్ దీనిని మార్చుతుందని బీజేపీ నేత వెల్లడించారు.
ఎన్నికల కమిషన్ డేటా ప్రకారం, మొత్తం 58,20,898 ఓటర్ల పేర్లను తొలగింపు కొసం గుర్తించారు. ఇందులో మరణించినట్లుగా గుర్తించబడిన సుమారు 24,16,852 మంది ఓటర్లు ఉన్నారు. ఆ తర్వాత శాశ్వతంగా నివాసం మార్చిన లేదా వలస వెళ్లిన 19,88,076 మంది ఓటర్లు ఉన్నారు. అదనంగా, 12,20,038 మంది ఓటర్లను గల్లంతైనట్లుగా గుర్తించారు, అయితే 1,38,328 పేర్లను నకిలీ, తప్పుడు లేదా బోగస్ నమోదులుగా గుర్తించారు. “ఇతర కారణాల” వల్ల మరో 57,604 పేర్లను తొలగింపు కోసం ప్రతిపాదించారు. తుది ఓటర్ల జాబితా 2026 ఫిబ్రవరి 14న విడుదల కానుంది. తొలగింపులకు గురైనవారు అవసరమైన పత్రాలతో క్లెయిమ్స్ దాఖలు చేసుకునే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
PM Modi: ప్రధాని మోడీపై సంచలన వ్యాఖ్యలు.. మల్లికార్జున్ ఖర్గేకు ఎన్నికల సంఘం నోటీసులు
-
Donald Trump: గుడ్న్యూస్ చెప్పిన డొనాల్డ్ ట్రంప్.. ఈ శుక్రవారంతో అంతా ఫైనల్..
-
World Cup 2011: అందుకే 2011 వరల్డ్ కప్లో రోహిత్ శర్మను తీసుకోలేదు.. ‘నన్ను క్షమించు’: శ్రీకాంత్
-
Niharika Konidela: వరుణ్ – లావణ్యల ‘సీక్రెట్’ లవ్ స్టోరీ.. అసలు విషయం బయటపెట్టిన నిహారిక!
-
KTR: కాళేశ్వరంపై కాంగ్రెస్ అబద్ధాల కోటలు బద్దలయ్యాయి.. హైకోర్టు తీర్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?