G20: ప్రతీకారం కోసం పాశ్చాత్య దేశాల ప్రయత్నం.. రష్యా ఘాటు వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Russia: భారత్ ప్రతీష్టాత్మకంగా జీ20 సమావేశాలను నిర్వహిస్తోంది. ఈ ఏడాది భారత్ జీ20కి అధ్యక్షత వహిస్తోంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, చైనా- అమెరికాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ సమావేశాలు జరుగుతున్నాయి. మరోవైపు భారత్ పేదరిక నిర్మూలన, ఆహార, ఇంధన భద్రత, ఉగ్రవాదంపై పోరుపై చర్చించాలని అనుకుంటోంది. ఇదిలా ఉంటే పాశ్చాత్య దేశాలు మాత్రం రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని సమావేశాల్లో లేవనెత్తాలని చూస్తున్నాయి. ఇటీవల బెంగళూర్ వేదికగా జరిగి జీ20 ఆర్థిక మంత్రుల సమావేశంలో కూడా యుద్ధంపై ఏకాభిప్రాయం కోసం పలుదేశాలు ఒత్తడి తీసుకువచ్చాయి. అయితే రష్యా, చైనాలు ఇందుకు అంగీకరించకపోవడంతో ఏకాభ్రియం కుదరలేదు.
Read Also: Iran: బాలికల పాఠశాలలపై గ్యాస్ దాడులు.. 100 మందికి పైగా ఆస్పత్రికి తరలింపు
Also Read
- Supreme Court: టెట్పై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. ఇకపై ఆ అర్హతలు తప్పనిసరి!
- Air India: ఎయిరిండియా కొత్త సీఈవో ముందు సవాలు.. కోలుకోవడానికి దశాబ్దం పట్టే ఛాన్స్
- PMO Fake ID Case: ప్రధాని భద్రతలో కలకలం.. ఫేక్ PMO ఐడీ కేసులో ట్విస్ట్..
- Mallikarjun Kharge: ఫలించిన కాంగ్రెస్ పోరాటం.. ఖర్గే ర్యాలీ తర్వాత శుద్ధి చేసిన ఘటనపై ఎఫ్ఐఆర్
ఇదిలా ఉంటే భారత్ జీ20 విదేశాంగ మంత్రుల సమావేశానికి అతిథ్యం ఇస్తోంది. ఇప్పటికే రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ ఇండియాకు చేరుకున్నారు. ఈ క్రమంలో రష్యా విదేశాంగ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. రష్యాపై ప్రతీకారం తీర్చుకునేందుకు జీ20 వేదికను పాశ్చాత్య దేశాలు ఉపయోగించుకోవాలని చూస్తున్నాయని విమర్శించింది. యూఎస్, దాని మిత్రపక్షాల విధ్వంసక విధానాల వల్ల ప్రపంచం ఇప్పటికే విపత్తు అంచున ఉందని, వెస్ట్రన్ దేశాల తీరు సామాజిక-ఆర్థికాభివృద్ధిని వెనక్కి నెట్టిందని, పేదదేశాల కష్టాలను మరింత తీవ్రం చేసిందని ప్రకటనలో పేర్కొంది.
విదేశాంగ మంత్రుల సమావేశం నేపథ్యంలో రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్, అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ మధ్య చర్చలు జరిగే అవకాశం లేదు. గతేడాది ఇండోనేషియా బాలి వేదికగా జరిగిన సమావేశంలో కూడా వీరిద్దరు మాట్లాడుకోలేదు. ఇక చైనీస్ స్పైబెలూన్ ఘటనపై అమెరికా ఆగ్రహంతో ఉంది. దీంతో చైనా మంత్రి క్విన్ గాంగ్ తో కూడా ఆంటోనీ బ్లింకెన్ సమావేశం ఉండకపోవచ్చు. బుధవారం సాయంత్రం నుంచి విదేశాంగ మంత్రుల సమావేశం ప్రారంభం అయింది. మంగళవారం ప్రధాన చర్చలు జరుగనున్నాయి.
తాజావార్తలు
-
Mojtaba Khamenei: ఇజ్రాయిల్ ఎంబసీ పక్కనే ఇరాన్ సుప్రీంలీడర్ ఫ్లాట్లు..? స్పందించిన ఇరాన్..
-
Supreme Court: టెట్పై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. ఇకపై ఆ అర్హతలు తప్పనిసరి!
-
Irumudi : పవిత్ర దీక్షను తాగుబోతులకు ఆపాదిస్తారా? ‘ఇరుముడి’పై భగ్గుమన్న అయ్యప్ప భక్తులు..
-
Viswanadh & Sons : ఈ వారమే OTTలోకి ‘విశ్వనాథ్ అండ్ సన్స్’.. ఎక్కడ చూడాలంటే?
-
Air India: ఎయిరిండియా కొత్త సీఈవో ముందు సవాలు.. కోలుకోవడానికి దశాబ్దం పట్టే ఛాన్స్
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైస్ కెప్టెన్ ఎందుకు చేశారన్నారు.. కెప్టెన్కే సలహాలు ఇస్తున్న వైభవ్.. వీడియో వైరల్!
-
Harry Potter అభిమానులకు గుడ్ న్యూస్.. Realme కొత్త స్పెషల్ ఎడిషన్ లాంచ్.!
-
Homemade Pani Puri: పానీపూరి అంటే ఇష్టమా? బయట బండి దగ్గర ఉండే టేస్ట్.. ఇంట్లోనే సులువుగా ఇలా చేసుకోండి ఇలా.!
-
Pigeons Problem: పావురాల బెడదతో విసిగిపోయారా..? ఈ చిట్కాలతో సింపుల్ గా సమస్యకు చెక్ పెట్టండి ఇలా.!
-
200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Huawei Pura X View లాంచ్..!