G20: ప్రతీకారం కోసం పాశ్చాత్య దేశాల ప్రయత్నం.. రష్యా ఘాటు వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Russia: భారత్ ప్రతీష్టాత్మకంగా జీ20 సమావేశాలను నిర్వహిస్తోంది. ఈ ఏడాది భారత్ జీ20కి అధ్యక్షత వహిస్తోంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, చైనా- అమెరికాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ సమావేశాలు జరుగుతున్నాయి. మరోవైపు భారత్ పేదరిక నిర్మూలన, ఆహార, ఇంధన భద్రత, ఉగ్రవాదంపై పోరుపై చర్చించాలని అనుకుంటోంది. ఇదిలా ఉంటే పాశ్చాత్య దేశాలు మాత్రం రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని సమావేశాల్లో లేవనెత్తాలని చూస్తున్నాయి. ఇటీవల బెంగళూర్ వేదికగా జరిగి జీ20 ఆర్థిక మంత్రుల సమావేశంలో కూడా యుద్ధంపై ఏకాభిప్రాయం కోసం పలుదేశాలు ఒత్తడి తీసుకువచ్చాయి. అయితే రష్యా, చైనాలు ఇందుకు అంగీకరించకపోవడంతో ఏకాభ్రియం కుదరలేదు.
Read Also: Iran: బాలికల పాఠశాలలపై గ్యాస్ దాడులు.. 100 మందికి పైగా ఆస్పత్రికి తరలింపు
Also Read
- Kamal Haasan: కమల్హాసన్ సంచలన నిర్ణయం.. మోడీకి మద్దతు తెల్పుతూ వీడియో విడుదల
- Twisha Sharma: తెలుగు నటి మృతి కేసులో కీలక పరిణామం.. రెండో పోస్ట్మార్టానికి హైకోర్టు ఆదేశం
- Prakash Raj: కాక్రోచ్ జనతా పార్టీలో ప్రకాష్ రాజ్ ఎంట్రీ.. వైరల్ అవుతున్న వీడియో!
- West Bengal: ప్రధాని మోడీకి ఝల్మురి వడ్డించిన షాప్ ఓనర్కి ప్రాణ భయం..! పాక్ నుంచి బెదిరింపులు..
ఇదిలా ఉంటే భారత్ జీ20 విదేశాంగ మంత్రుల సమావేశానికి అతిథ్యం ఇస్తోంది. ఇప్పటికే రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ ఇండియాకు చేరుకున్నారు. ఈ క్రమంలో రష్యా విదేశాంగ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. రష్యాపై ప్రతీకారం తీర్చుకునేందుకు జీ20 వేదికను పాశ్చాత్య దేశాలు ఉపయోగించుకోవాలని చూస్తున్నాయని విమర్శించింది. యూఎస్, దాని మిత్రపక్షాల విధ్వంసక విధానాల వల్ల ప్రపంచం ఇప్పటికే విపత్తు అంచున ఉందని, వెస్ట్రన్ దేశాల తీరు సామాజిక-ఆర్థికాభివృద్ధిని వెనక్కి నెట్టిందని, పేదదేశాల కష్టాలను మరింత తీవ్రం చేసిందని ప్రకటనలో పేర్కొంది.
విదేశాంగ మంత్రుల సమావేశం నేపథ్యంలో రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్, అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ మధ్య చర్చలు జరిగే అవకాశం లేదు. గతేడాది ఇండోనేషియా బాలి వేదికగా జరిగిన సమావేశంలో కూడా వీరిద్దరు మాట్లాడుకోలేదు. ఇక చైనీస్ స్పైబెలూన్ ఘటనపై అమెరికా ఆగ్రహంతో ఉంది. దీంతో చైనా మంత్రి క్విన్ గాంగ్ తో కూడా ఆంటోనీ బ్లింకెన్ సమావేశం ఉండకపోవచ్చు. బుధవారం సాయంత్రం నుంచి విదేశాంగ మంత్రుల సమావేశం ప్రారంభం అయింది. మంగళవారం ప్రధాన చర్చలు జరుగనున్నాయి.
తాజావార్తలు
-
AP Weather Alert : ఏపీలో నిప్పుల కుంపటి.. 8 జిల్లాలకు ‘రెడ్ అలర్ట్’ జారీ!.
-
Mega Family : మెగా ఫ్యామిలీకి DSP దూరం ?
-
Kamal Haasan: కమల్హాసన్ సంచలన నిర్ణయం.. మోడీకి మద్దతు తెల్పుతూ వీడియో విడుదల
-
POCSO Case : బ్లాక్మెయిల్ నుంచి పోక్సో కేసు వరకు.. తిరుపతిలో కలకలం రేపిన ఘటన.!
-
Prashanth Neel: ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్ 2’ మాస్టర్ ప్లాన్ లీక్!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!