Murshidabad Violence: బెంగాల్ ముర్షిదాబాద్లో అల్లర్లు.. వలసకూలీ హత్యతో హింస..
- అల్లర్లతో అట్టుడుకుతున్న బెంగాల్ ముర్షిదాబాద్..
- వలస కూలీ హత్యతో నిరసనకారుల హింస..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Murshidabad Violence: వలస కూలీ హత్యతో పశ్చిమ బెంగాల్ ముర్షిదాబాద్లో అల్లర్లు చెలరేగాయి. నిరసనకారులు బెల్దంగాలో జాతీయ రహదారి 12ను దిగ్భందించడంతో మళ్లీ అశాంతి నెలకొంది. బెల్దంగాలోని బరువా మోర్ వద్ద వందలాది మంది స్థానికులు రహదారిపై చేరి, ట్రాఫిక్ను స్తంభింపచేశారు. అల్లరి మూకలు ఒక రైల్వే గేటును ధ్వంసం చేశారు. తూర్పు రైల్వేలోని సీల్దా-లాల్గోలా రైల్వే సెక్షన్లో రైలు సర్వీసులకు అంతరాయం ఏర్పడింది.
Read Also: Flipkart Republic Day Sale: మీ ఇంట్లోనే థియేటర్.. 50 ఇంచుల స్మార్ట్ టీవీలపై కళ్లు చెదిరే ఆఫర్లు!
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
- UP: ఏం త్యాగం.. ఐదుగురు పిల్లల తల్లిని ప్రియుడికిచ్చి పెళ్లి చేసిన భర్త.. ఏం జరిగిందంటే..!
- Rahul Gandhi vs BJP: విద్యార్థులతో రాజకీయాలెందుకు? రాహుల్గాంధీని ప్రశ్నించిన బీజేపీ
రంగంలోకి దిగిన పోలీసులు గుంపును చెదరగొట్టడానికి, దిగ్భందాన్ని ఎత్తివేయడానికి బలప్రయోగం చేయాల్సి వచ్చింది. పెద్ద ఎత్తున పోలీసులు రూట్ మార్చ్ నిర్వహించారు. లాఠీఛార్జ్ చేసి రోడ్లను క్లియర్ చేయాల్సి వచ్చిందని ముర్షిదాబాద్ ఎస్పీ కుమార్ సన్నీ రాజ్ తెలిపారు. గత రెండు రోజులుగా జరిగిన హింసలో 15 నుంచి 20 మందిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్పీ తెలిపారు.
ఈ ప్రాంతానికి చెందిన 36 ఏళ్ల వలస కూలీ అలావుద్దీన్ షేక్ జార్ఖండ్ రాష్ట్రంలో హత్యకు గురయ్యాడు. దీంతో ముర్షిదాబాద్లో హింస చెలరేగింది. అతడిని కొట్టి చంపి, ఆత్మహత్యగా చిత్రీకరించారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ పరిణామాల గురించి బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మాట్లాడుతూ.. ఇతర రాష్ట్రాల్లో వలస కార్మికుల్ని టార్గెట్ చేస్తున్నారని, మైనారిటీల కోపం సమర్థనీయమే అని అన్నారు. అయితే, తాను ఇలాంటి హింసను సమర్థించనని, కానీ అన్నీ తన చేతుల్లో లేవని అన్నారు.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!