Kerala: విషాదం.. రైలు ఢీకొని నలుగురు మృతి
- కేరళలో విషాదం
- రైలు ఢీకొని నలుగురు మృతి
- ట్రైన్ను గమనించకపోవడంతోనే ప్రమాదం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేరళలో విషాదం చోటుచేసుకుంది. షోరనూర్ రైల్వే స్టేషన్ సమీపంలో రైలు ఢీకొని నలుగురు మృతిచెందారు. శనివారం తిరువనంతపురం వెళ్తున్న కేరళ ఎక్స్ప్రెస్ ఢీకొనడంతో తమిళనాడుకు చెందిన ఇద్దరు మహిళలు సహా నలుగురు పారిశుధ్య కార్మికులు మృతి చెందినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. రైల్వే స్టేషన్కు కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న షోరనూర్ వంతెన సమీపంలోని రైల్వే ట్రాక్పై ఉన్న చెత్తను తొలగిస్తున్న సమయంలో న్యూఢిల్లీ-తిరువనంతపురం రైలు మధ్యాహ్నం 3.05 గంటలకు కార్మికులను ఢీకొట్టినట్లు వెల్లడించారు. సమాచారం అందుకున్న పోలీసులు.. అధికారులు సంఘటనాస్థలికి వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. అయితే కార్మికులు.. రైలును గమనించి ఉండకపోవచ్చని అధికారులు తెలిపారు. అయితే తదుపరి విచారణ జరుగుతోందని షోరనూర్ రైల్వే పోలీసు అధికారి తెలిపారు. ఈ ఘటనలో ముగ్గురి మృతదేహాలు లభ్యం కాగా..నాలుగో వ్యక్తి మృతదేహం నదిలో పడిపోయింది. దాన్ని వెలికితీసేందుకు సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు.
ఇది కూడా చదవండి: Tirupati Crime: లాడ్జిలో మైనర్ బాలికపై అత్యాచారయత్నం.. యువకుడు అరెస్ట్
Also Read
- Mehbooba Mufti: 'దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం'.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
- Salman Khan: విద్యార్థులు ఇంటికెళ్లిపోండి.. సోనమ్కు ఇంటి భోజనం పంపిస్తా.. సల్మాన్ ఖాన్ ఆసక్తికర ట్వీట్
- Kusha Missile: కుశ మిస్సైల్ సక్సెస్.. భారత అమ్ములపొదిలో మరో అస్త్రం..
- Delhi: జంతర్మంతర్ దగ్గర ఇంటర్నెట్, మొబైల్ సేవలు నిలిపివేత.. భారీగా పోలీసులు మోహరింపు
#WATCH | Palakkad, Kerala: Four sanitation workers were killed today after being hit by an express train near Shoranur in Palakkad district. The incident occurred when they were clearing garbage from the railway track near Shoranur bridge.
(visuals from the spot) pic.twitter.com/Ooo1PTCnql
— ANI (@ANI) November 2, 2024
తాజావార్తలు
-
CM Revanth Reddy : విద్యార్థుల యూనిఫాంల నాణ్యతపై రాజీపడేది లేదు
-
OTR : విశ్వేశ్వర్ రెడ్డి ఒక్క మాటతో వైసీపీ ఇరుక్కుందా?
-
Covid 19: కోవిడ్పై కేంద్రం క్లారిటీ.. భయపడాల్సిన అవసరం లేదట..!
-
Mehbooba Mufti: ‘దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం’.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
-
Story Board : ఎల్నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?