Narayana Swamy: లెఫ్టినెంట్ గవర్నర్ పదవికి రాజీనామా చేసి తమిళిసై రాజకీయాలు చేయాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Narayana Swamy: కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రపై పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ మాజీ ముఖ్యమంత్రి వి.నారాయణస్వామి మండిపడ్డారు. ఆయన మాట్లాడుతూ రాజ్యాంగ పదవుల్లో ఉన్న వ్యక్తులు రోజువారీ రాజకీయ పరిణామాలపై వ్యాఖ్యానించే ముందు పదవీ విరమణ చేయాలని అన్నారు. పార్టీ రాజకీయాలపై లెఫ్టినెంట్ గవర్నర్ వ్యాఖ్యానించడం తగదన్నారు. ‘రోజువారీ రాజకీయ పరిణామాలపై గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లు వ్యాఖ్యానించకూడదు. రాజకీయాల్లో చురుకుగా పాల్గొనాలంటే లెఫ్టినెంట్ గవర్నర్ తన పదవికి రాజీనామా చేయాలి’ అని కాంగ్రెస్ సీనియర్ నేత ఇక్కడ విలేకరుల సమావేశంలో అన్నారు. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రను తమిళిసై విమర్శించారని… రాజకీయాలు చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. లెఫ్టినెంట్ గవర్నర్ పదవికి రాజీనామా చేసి తమిళిసై రాజకీయాలు చేయాలని ఆయన అన్నారు. రాజ్యాంగ పదవిలో ఉండి రాజకీయాలు చేయకూడదంటూ ఆయన ధ్వజమెత్తారు.
పాదయాత్ర చేయడానికి గాంధీ హఠాత్తుగా నిద్ర నుండి మేల్కొన్నారని డాక్టర్ తమిళిసై వ్యాఖ్యానించారు. ఆమె తెలంగాణ గవర్నర్, పుదుచ్చేరికి లెఫ్టినెంట్ గవర్నర్గా అదనపు బాధ్యతలు మాత్రమే కలిగి ఉన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి, మంత్రులు తనను పట్టించుకోకపోవడంతో తమిళిసై ఎక్కువ సమయం పుదుచ్చేరిలోనే గడుపుతున్నట్లు సమాచారం.
Also Read
- Kejriwal: కేజ్రీవాల్, సిసోడియాకు ఢిల్లీ హైకోర్టు షాక్.. ధిక్కార కేసు నమోదు చేయాలని ఆదేశం
- Modi-Putin: మోడీ, రాష్ట్రపతికి పుతిన్ సందేశం.. యూపీ తుఫాన్ మృతులకు సంతాపం
- PM Modi: రష్యా, ఇరాన్ విదేశాంగ మంత్రులతో మోడీ భేటీ.. ఇంధన సంక్షోభంపై చర్చ
- Pakistan: ఢిల్లీని టార్గెట్ చేసే మిస్సైల్ను పరీక్షించిన పాకిస్తాన్..
Manickam Tagore : అందరిని కంట్రోల్ లో పెట్టాల్సిన ఆయనే నోరు పారేసుకుంటున్నారా.?
కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రౌడీయిజం, గంజాయి రవాణా పెరిగిపోయాయని నారాయణస్వామి ఆరోపించారు. . ఫ్రాన్స్లో నివసిస్తున్న పుదుచ్చేరి మూలానికి చెందిన ప్రజలు ఇటీవల చేపట్టిన నిరసనతో భూకబ్జాలు పెరుగుతున్న ఘటనలు వెలుగులోకి వచ్చాయి. పుదుచ్చేరిలో ఫ్రెంచ్ పౌరులకు చెందిన ఇళ్లను సామాజిక వ్యతిరేక శక్తులు టార్గెట్ చేయడం ప్రారంభించాయని ఆయన తెలిపారు. ఫ్రెంచ్ పౌరుల ఆస్తులను లాక్కునే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. భూకబ్జాపై పలు పోలీసు స్టేషన్లలో ఫిర్యాదులు నమోదయ్యాయి. అయితే ఆ ఫిర్యాదులపై చర్యలు తీసుకునేలా పోలీసులకు అవసరమైన ఆదేశాలు ఇవ్వడంలో ముఖ్యమంత్రి విఫలమయ్యారన్నారు. డిస్టిలరీలను ప్రారంభించేందుకు కొత్త అనుమతులు ఇవ్వాలన్న ప్రభుత్వ నిర్ణయంపై సీబీఐ విచారణ జరిపించాలన్న డిమాండ్ను పునరుద్ఘాటించారు.
తాజావార్తలు
-
Kejriwal: కేజ్రీవాల్, సిసోడియాకు ఢిల్లీ హైకోర్టు షాక్.. ధిక్కార కేసు నమోదు చేయాలని ఆదేశం
-
Trigun: ప్రధాని మాటే మా సినిమాకు బలం.. ‘మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్’ టీమ్!
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
Marksheet Cake: ముంబై టు సోషల్ మీడియా.. నెట్టింట వైరల్ అవుతున్న ‘మార్క్షీట్’ సెలబ్రేషన్!
-
LayOffs: మరో దిగ్గజ కంపెనీలో భారీగా లే ఆఫ్స్.. 4000 మంది ఉద్యోగుల తొలగింపు..
ట్రెండింగ్
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?