Korean youtuber harassed: లైంగిక వేధింపులకు గురైన కొరియా యూట్యూబర్ భద్రతకు విదేశాంగశాఖ హామీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Korean youtuber harassed: ముంబైలో ఇద్దరు ఆకతాయిలు దక్షిణ కొరియా యూట్యూబర్ హ్యోజియాంగ్ పార్క్ పై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. నడిరోడ్డుపై యువతిపై అసభ్యంగా ప్రవర్తించారు. ముంబైలో లైవ్ స్ట్రీమింగ్ చేస్తున్న సమయంలో కొరియా యువతికి ఈ పరిణామం ఎదురైంది. ఇది దేశవ్యాప్తంగా వైరల్ కావడంతో ముంబై పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. సుమోటోగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు వారిద్దరిని అరెస్ట్ చేసి ఒక రోజు కస్టడీకి తరలించారు. ఈ వీడియో బుధవారం బయటకు వచ్చింది. ఇదిలా ఉంటే ముంబైలో వేధింపుకు గురైన దక్షిణ కొరియా వ్లాగర్ కు రక్షణ, భద్రత కల్పిస్తామని భారత విదేశాంగ శాఖ తెలిపింది. స్థానిక అధికారులు ఆమెకు అవసరమైన రక్షణ కల్పించారని అనుకుంటున్నట్లు విదేశాంగ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి అన్నారు.
Breaking News: In a viral video, Mobeen Chand Mohammad Shaikh and Mohammad Naqeeb Sadrealam Ansari – arrested for molesting a Korean woman YouTuber during a live streaming.
Also Read
- Ketan Agarwal Case: కేతన్ హత్యకు ముందు, తర్వాత చాట్స్ డిలీట్.. సియా-చేతన్ ఫోన్లలో కీలక ఆధారాలు
- Ketan Agarwal Case: మద్యం మత్తులో సియా గోయల్.. వీడియో వైరల్
- Congress: కాంగ్రెస్లో భారీ ప్రక్షాళన.. యూపీతో సహా కీలక రాష్ట్రాల ఇన్ఛార్జ్ల మార్పు! కారణం ఇదేనా
- Monsoon: శాటిలైట్ చిత్రాల్లో షాకింగ్ దృశ్యాలు.. దేశంలో కనిపించని వర్ష మేఘాలు
Khar Police (Mumbai) registered an FIR u/s 354 IPC and arrested both of them.
+ pic.twitter.com/wSkne3GMLH— Ashwini Shrivastava (@AshwiniSahaya) December 1, 2022
దక్షిణ కొరియా జాతీయురాలు అయిన యూట్యబూర్ మంగళవారం రాత్రి ముంబై లోని ఖార్ ప్రాంతం నుంచి లైవ్ స్ట్రీమింగ్ చేస్తున్న సమయంలో ఇద్దరు వ్యక్తుల ఆమెను వేధించారు. బలవంతంగా తమ కారులో ఎక్కించే ప్రయత్నం చేశారు. నిందితులు మోబీన్ చంద్ మహ్మద్ షేక్(18), మహ్మద్ నకీబ్ సదరియాలం అన్సారీ(20)గా నిందితులను గుర్తించారు. ఈ వీడియో వైరల్ కావడంతో ఐపీసీ సెక్షన్ 354 ప్రకారం కేసు నమోదు చేశారు. ఇందులో ఓ యువకుడు మహిళపై చేయి వేసి ముద్దు పెట్టుకునే ప్రయత్నం చేశారు. నిందితులు ఇద్దర్ని పోలీసులు అరెస్ట్ చేశారు.
అయితే ఈ ఘటనపై కొరియన్ యూట్యూబర్ స్పందించారు. నాకు వేరే దేశంలో కూడా ఇలాగే జరిగాయి కానీ ఆ సమయంలో నేను ఏం చేయలేకపోయాను. అయితే ఈసారి మాత్రం భారతదేశంలో వేగంగా చర్యలు తీసుకున్నారని.. నేను మూడు వారాలకు పైగా ముంబైలోనే ఉన్నాను.. ఎక్కువ కాలం ఉండాలని అనుకుంటున్నానని యూట్యూబర్ హ్యోజియాంగ్ పార్క్ అన్నారు. ఇటువంటి చర్యలు నాపై ప్రభావం చూపించవని.. అద్భుతమైన భారతదేశాన్ని ప్రపంచానికి చూపిస్తానని తెలిపింది.
తాజావార్తలు
-
Venezuela Earthquake: వెనెజువెలాను మళ్లీ వణికించిన భూకంపం.. ప్రజల్లో భయాందోళనలు
-
Vivo X Fold 6: 200MP కెమెరా, 7000mAh బ్యాటరీతో వివో ఎక్స్ ఫోల్డ్ 6 విడుదల.. ఫోల్డబుల్ ఫోన్లలో కొత్త బెంచ్మార్క్
-
TTD: రామ మందిరం విరాళాల వివాదం ఎఫెక్ట్.. టీటీడీ ఖాతాలకు టెక్నాలజీ అప్గ్రేడ్.! ఖాతాలకు టెక్నాలజీ అప్గ్రేడ్..
-
CM Chandrababu Markapuram Tour: రూ.300 కోట్ల పరిహారం పంపిణీకి సీఎం.. మార్కాపురం జిల్లాలో నేడు విస్తృత పర్యటన
-
Maa Inti Bangaram: వైజాగ్ సక్సెస్ మీట్లో బిగ్ సర్ప్రైజ్.. ‘మా ఇంటి బంగారం 2’ అధికారికంగా ప్రకటించిన రాజ్
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!