PM Modi: ఉగ్రవాదులపై కాంగ్రెస్ మెతక వైఖరి.. 26/11 తర్వాత పాక్పై దాడిని ఎవరు ఆపారు..?
- ముంబై దాడుల తర్వాత మిమ్నల్ని ఎవరు ఆపారు..?
- కాంగ్రెస్ తీరుపై విరుచుకుపడిన ప్రధాని మోడీ..
- నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం..
PM Modi: నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం మొదటి దశను ఈ రోజు ప్రధాని నరేంద్రమోడీ ప్రారంభించారు. ప్రారంభ కార్యక్రమంలో ఆయన కాంగ్రెస్ హయాంలోని యూపీఏ పాలనపై విమర్శలు గుప్పించారు. 2008 ముంబై ఉగ్రవాద దాడుల తర్వాత కాంగ్రెస్ పార్టీ తన ‘‘బలహీనత’’ను ప్రదర్శించిందని ఆరోపించారు. అప్పటి రాజకీయ నిర్ణయాలు మరో దేశం నుంచి వచ్చిన ఒత్తిడి ద్వారా ప్రభావితమయ్యాయని బుధవారం ఆరోపించారు. ముంబై దేశంలోని అత్యంత శక్తివంతమైన నగరాల్లో ఒకటి అని, అందుకే ఉగ్రవాదులు 26/11 దాడులకు తెగబడ్డారని అన్నారు.
ఇటీవల, కాంగ్రెస్ మాజీ హోం మంత్రి పి. చిదంబరం ముంబై ఉగ్రదాడుల గురించి మాట్లాడుతూ.. ప్రపంచ దేశాల ఒత్తిడి వల్ల తాము పాకిస్తాన్పై దాడి చేయలేదని చెప్పారు. ముంబై దాడుల తర్వాత మన భద్రతా దళాలు పాకిస్తాన్పై దాడి చేయడానికి సిద్ధమయ్యాయయని, కానీ వేరే దేశం ఒత్తిడి కారణంగా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం భద్రతా బలగాలను ఆపిందని చిదంబరం అన్నారు.
Also Read
- What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- India Defense Budget: సాహో భారత్.. పాకిస్థాన్ను గజగజలాడిస్తున్న ఇండియా రక్షణ బడ్జెట్.. చైనా సాయం ఉన్నా దాయాదికి వణుకు పుట్టాల్సిందే!
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
- Producing States in India: భారత్లో 'పెట్రోల్' బావులు ఏయే రాష్ట్రాల్లో ఉన్నాయో తెలుసా?
Read Also: Asaduddin Owaisi: రాకేష్ కాకుండా, చీఫ్ జస్టిస్పై ‘‘అసద్’’ దాడికి పాల్పడుంటే..?
దీనిపై ప్రధాని మోడీ మాట్లాడుతూ.. ఏ దేశం ఒత్తిడి తెచ్చిందో వెల్లడించాలని కాంగ్రెస్ను డిమాండ్ చేశారు. ఈ నిర్ణయం కారణంగా భారత్ తీవ్రంగా నష్టపోయిందని ప్రధాని అన్నారు. కాంగ్రెస్ బలహీనత ఉగ్రవాదుల్ని బలపరిచిందని, ప్రాణాలను త్యాగం చేయడం ద్వారా దేశం పదే పదే ఉగ్రవాదానికి మూల్యం చెల్లించాల్సి వచ్చిందని అన్నారు. మన దేశ భద్రత, పౌరుల భద్రత కన్నా మరేది ముఖ్యం కాదని మోడీ అన్నారు. పహల్గామ్ దాడి తర్వాత ఆపరేషన్ సిందూర్ ప్రస్తావిస్తూ, నేటి భారతదేశం తన శత్రువులను వారి ఇళ్లలోకే వెళ్లి హతమారుస్తోదని ప్రధాని అన్నారు.
నవీ ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ ‘‘వికసిత్ భారత్’’ను ప్రతిబింబించే ప్రాజెక్ట్ అని ప్రధాని అఅన్నారు. కొత్త విమానాశ్రయం ద్వారా మహారాష్ట్రలోని రైతుల ఉత్పత్తులు మిడిల్ ఈస్ట్, యూరప్ మార్కెట్లతో అనుసంధానించబడుతాయని చెప్పారు.
తాజావార్తలు
-
Divya Sathyaraj: పెళ్లి లేకుండానే తల్లిని అవుతా.. కట్టప్ప కూతురు సెన్సేషనల్ కామెంట్స్!
-
YSRCP Protest: డీజిల్, పెట్రోల్ కొరత.. ఆందోళనలకు వైసీపీ పిలుపు..
-
Nandamuri Balakrishna : బాలయ్య నీ స్పీడ్ ఏంటయ్యా.. ఒకేసారి రెండు సినిమాలు
-
Virat Kohli: ఆకాశమే హద్దుగా కోహ్లీ రికార్డుల వేట.. ఐపీఎల్లో ఈ ఘనత సాధించిన ఏకైక ప్లేయర్ విరాట్..
-
Indonesia: ఇండోనేషియాలో రెండు రైళ్లు ఢీ.. నలుగురు మృతి
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!