PM Modi: ఉగ్రవాదులపై కాంగ్రెస్ మెతక వైఖరి.. 26/11 తర్వాత పాక్పై దాడిని ఎవరు ఆపారు..?
- ముంబై దాడుల తర్వాత మిమ్నల్ని ఎవరు ఆపారు..?
- కాంగ్రెస్ తీరుపై విరుచుకుపడిన ప్రధాని మోడీ..
- నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం మొదటి దశను ఈ రోజు ప్రధాని నరేంద్రమోడీ ప్రారంభించారు. ప్రారంభ కార్యక్రమంలో ఆయన కాంగ్రెస్ హయాంలోని యూపీఏ పాలనపై విమర్శలు గుప్పించారు. 2008 ముంబై ఉగ్రవాద దాడుల తర్వాత కాంగ్రెస్ పార్టీ తన ‘‘బలహీనత’’ను ప్రదర్శించిందని ఆరోపించారు. అప్పటి రాజకీయ నిర్ణయాలు మరో దేశం నుంచి వచ్చిన ఒత్తిడి ద్వారా ప్రభావితమయ్యాయని బుధవారం ఆరోపించారు. ముంబై దేశంలోని అత్యంత శక్తివంతమైన నగరాల్లో ఒకటి అని, అందుకే ఉగ్రవాదులు 26/11 దాడులకు తెగబడ్డారని అన్నారు.
ఇటీవల, కాంగ్రెస్ మాజీ హోం మంత్రి పి. చిదంబరం ముంబై ఉగ్రదాడుల గురించి మాట్లాడుతూ.. ప్రపంచ దేశాల ఒత్తిడి వల్ల తాము పాకిస్తాన్పై దాడి చేయలేదని చెప్పారు. ముంబై దాడుల తర్వాత మన భద్రతా దళాలు పాకిస్తాన్పై దాడి చేయడానికి సిద్ధమయ్యాయయని, కానీ వేరే దేశం ఒత్తిడి కారణంగా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం భద్రతా బలగాలను ఆపిందని చిదంబరం అన్నారు.
Also Read
- UCC Bill: 'ఒక్క పెళ్లి చేసుకున్నవారికే రాష్ట్రంలో ఉండే హక్కు ఉంటుంది'.. సీఎం సంచలన ప్రకటన..
- Success Story: 20 గంటల పోలీసు డ్యూటీ, గర్భం, రెండు వైఫల్యాలు..అయినా ఒక రైతు కూతురు డీఎస్పీ అయింది..
- Shocking Statistics: 6 నెలల్లో 554 మంది భర్తల మృతి.. దేశాన్ని ఉలిక్కిపడేలా చేసిన సంచలన నివేదిక!
- Meerut Murder: ఆరేళ్ల క్రితం ప్రేమ పెళ్లి.. డ్రైవర్తో ఎఫైర్.. భర్తను పాముతో కరిపించి చంపేసిన భార్య..
Read Also: Asaduddin Owaisi: రాకేష్ కాకుండా, చీఫ్ జస్టిస్పై ‘‘అసద్’’ దాడికి పాల్పడుంటే..?
దీనిపై ప్రధాని మోడీ మాట్లాడుతూ.. ఏ దేశం ఒత్తిడి తెచ్చిందో వెల్లడించాలని కాంగ్రెస్ను డిమాండ్ చేశారు. ఈ నిర్ణయం కారణంగా భారత్ తీవ్రంగా నష్టపోయిందని ప్రధాని అన్నారు. కాంగ్రెస్ బలహీనత ఉగ్రవాదుల్ని బలపరిచిందని, ప్రాణాలను త్యాగం చేయడం ద్వారా దేశం పదే పదే ఉగ్రవాదానికి మూల్యం చెల్లించాల్సి వచ్చిందని అన్నారు. మన దేశ భద్రత, పౌరుల భద్రత కన్నా మరేది ముఖ్యం కాదని మోడీ అన్నారు. పహల్గామ్ దాడి తర్వాత ఆపరేషన్ సిందూర్ ప్రస్తావిస్తూ, నేటి భారతదేశం తన శత్రువులను వారి ఇళ్లలోకే వెళ్లి హతమారుస్తోదని ప్రధాని అన్నారు.
నవీ ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ ‘‘వికసిత్ భారత్’’ను ప్రతిబింబించే ప్రాజెక్ట్ అని ప్రధాని అఅన్నారు. కొత్త విమానాశ్రయం ద్వారా మహారాష్ట్రలోని రైతుల ఉత్పత్తులు మిడిల్ ఈస్ట్, యూరప్ మార్కెట్లతో అనుసంధానించబడుతాయని చెప్పారు.
తాజావార్తలు
-
UCC Bill: ‘ఒక్క పెళ్లి చేసుకున్నవారికే రాష్ట్రంలో ఉండే హక్కు ఉంటుంది’.. సీఎం సంచలన ప్రకటన..
-
CM Chandrababu : అమరావతి దేవతల రాజధాని.. నవ్యాంధ్రను నెంబర్ వన్ చేయడమే నా లక్ష్యం
-
Success Story: 20 గంటల పోలీసు డ్యూటీ, గర్భం, రెండు వైఫల్యాలు..అయినా ఒక రైతు కూతురు డీఎస్పీ అయింది..
-
Shocking Statistics: 6 నెలల్లో 554 మంది భర్తల మృతి.. దేశాన్ని ఉలిక్కిపడేలా చేసిన సంచలన నివేదిక!
-
Pawan Kumar Chandana: మ్యాథ్స్లో 51 మార్కులు.. నేడు భారత తొలి ప్రైవేట్ రాకెట్ విజయవంతం.. హైదరాబాద్ కుర్రాడి విజయగాథ!
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!