EC-Congress: కాంగ్రెస్కు ఈసీ ఆహ్వానం.. ఫలితాలపై అనుమానాలు నివృత్తి చేస్తామని వెల్లడి
- కాంగ్రెస్కు ఈసీ ఆహ్వానం
- మహారాష్ట్ర ఫలితాలపై అనుమానాలు నివృత్తి చేస్తామని వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఫలితాలు కూడా వచ్చేశాయ్. మహాయుతి కూటమి ఘన విజయం సాధించింది. కానీ ప్రభుత్వం మాత్రం ఇప్పటి వరకు ఏర్పడలేదు. ఇదిలా ఉంటే మహారాష్ట్ర ఫలితాలపై కాంగ్రెస్ తీవ్ర అనుమానాలు వ్యక్తం చేస్తోంది. పోలింగ్ మరియు కౌంటింగ్ డేటాలో తీవ్ర అసమానతలు ఉన్నాయని ఆరోపణలు గుప్పించింది. హర్యానా అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా ఇదే మాదిరిగా ఆరోపణలు చేసింది. ఆ సమయంలో నేరుగా కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి ఫిర్యాదు చేసింది. తాజాగా మరోసారి మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలపై కూడా ఆరోపణలు గుప్పించింది. కాంగ్రెస్ ఆరోపణలపై ఈసీ స్పందించింది. అనుమానాలు నివృత్తి చేసేందుకు డిసెంబర్ 3న కాంగ్రెస్ ప్రతినిధులను పంపాలని కోరింది.
ఇది కూడా చదవండి: Geyser Explodes: స్నానం చేస్తుండగా గీజర్ పేలి నవ వధువు మృతి..
Also Read
- IIT Bombay Student:పరీక్షలో ChatGPT వాడుతూ పట్టుబడ్డ IIT బాంబే విద్యార్థి ఆ*త్మహ*త్య.. క్యాంపస్లో నిరసనలు
- iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
- Sugar Price: పండుగల వేళ సామాన్యులకు తీపి కబురు.. కేంద్రం మరో కీలక నిర్ణయం
- Air India: ఖర్చులు తగ్గించేందుకు కీలక నిర్ణయం.. ఎయిరిండియా కొత్త సీఈవో సూపర్ ప్లాన్!
ఎన్నికలు ప్రతి దశలోనూ పారదర్శకంగా జరిగాయని.. అయినా కూడా చట్టపరమైన ఆందోళనలు పరిశీలిస్తామని ఈసీ స్పష్టం చేసింది. డిసెంబర్ 3న కాంగ్రెస్ ప్రతినిధుల బృందం అనుమానాలు విన్న తర్వాత రాతపూర్వక సమాధానం ఇస్తామని ఎన్నికల సంఘం పేర్కొంది. మహారాష్ట్ర ఎన్నికల్లో తీవ్ర అవకతవకలు చోటుచేసుకున్నాయంటూ శుక్రవారం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. వ్యక్తిగతంగా హాజరై తమ అనుమానాలు తెలియజేస్తామని తెలిపింది. ఈ క్రమంలోనే ఈసీ నుంచి హస్తం పార్టీకి పిలుపు వచ్చింది.
ఇది కూడా చదవండి: Rajendraprasad : అవకాశాల్లేక ఆత్మహత్య చేసుకోవాలనుకున్న రాజేంద్రప్రసాద్
మహారాష్ట్రలో 288 అసెంబ్లీ స్థానాలు ఉండగా బీజేపీ 132, శివసేన 57, ఎన్సీపీకి 41, కాంగ్రెస్కు 16, ఉద్ధవ్ థాక్రే పార్టీకి 20, శరద్ పవార్ పార్టీకి 10 స్థానాలు దక్కాయి. ఇదిలా ఉంటే మహాయుతి కూటమి విజయం సాధించినా ఇప్పటి వరకు మాత్రం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదు. ముఖ్యమంత్రి ఎంపికపై హైకమాండ్ తర్జన భర్జన పడుతోంది. ఎటూ తేల్చుకోలేకపోతుంది. దీంతో ఫలితాలు వచ్చి 7 రోజులైనా కొత్త ప్రభుత్వం ఏర్పడలేదు. డిసెంబర్ 5లోపు పరిష్కారం దొరకవచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఏక్నాథ్ షిండే అలకబూని.. సొంతూరుకి వెళ్లిపోయారు. ఈ ఉత్కంఠ ఎప్పటి వరకు కొనసాగుతుందో చూడాలి.
ఇది కూడా చదవండి: Pushpa 2: పుష్ప 2 రిలీజ్ ముందు అల్లు అర్జున్ ‘ఆర్మీ’పై కేసు!!
తాజావార్తలు
-
Mahindra XUV 3X0 REVX Edge: మహీంద్రా XUV 3XO REVX Edge (O) లాంచ్.. సన్రూఫ్, 6 ఎయిర్బ్యాగ్స్తో అదిరిపోయే ఫీచర్లు
-
BCCI Umpires: బీసీసీఐ కీలక నిర్ణయం.. ఇకపై అంపైర్లు అప్రమత్తంగా ఉండాల్సిందే.. లేదంటే..!
-
Sigma Trailer: సందీప్ కిషన్ ‘సిగ్మా’ ట్రైలర్ వచ్చేసింది.. రూ.500 కోట్ల రాకెట్తో హీరో ఫైట్!
-
IIT Bombay Student:పరీక్షలో ChatGPT వాడుతూ పట్టుబడ్డ IIT బాంబే విద్యార్థి ఆ*త్మహ*త్య.. క్యాంపస్లో నిరసనలు
-
BCCI: కోచ్గా అతడు తాత్కాలికమే.. పనితీరు నచ్చితేనే టీమిండియాలో ఉంటాడు!
ట్రెండింగ్
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్పై భారత్ ఘన విజయం.. సెమీస్కు దూసుకెళ్లిన హర్మన్సేన..!