JPC First Meeting: నేడు ఒకే దేశం- ఒకే ఎన్నికపై జేపీసీ మొదటి సమావేశం..
- ఒకే దేశం- ఒకే ఎన్నికపై నేడు జేపీసీ మొదటి సమావేశం..
- సభ్యులకు చట్టాల నిబంధనలను తెలియజేయనున్న న్యాయ మంత్రిత్వ శాఖ అధికారులు..
- జేపీసీ నివేదికను వచ్చే పార్లమెంట్ సెషన్లో మొదటి వారం చివరి రోజున లోక్సభలో సమర్పించాలి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
JPC First Meeting: ఒకే దేశం, ఒకే ఎన్నికల ప్రతిపాదనకు సంబంధించిన బిల్లులను పరిశీలించేందుకు ఏర్పాటైన జాయింట్ పార్లమెంటరీ కమిటీ (JPC) తొలి సమావేశం ఈరోజు (జనవరి 8) జరగబోతుంది. ఈ సమావేశంలో ప్రతిపాదిత చట్టాల నిబంధనలను జేపీసీ సభ్యులకు న్యాయ మంత్రిత్వ శాఖ అధికారులు వివరించనున్నారని సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి. అంతేగాక పలువురి అభిప్రాయాలను కూడా జేపీసీ తీసుకోనున్నట్టు తెలుస్తుంది. అయితే, జేపీసీ తన నివేదికను వచ్చే పార్లమెంట్ సెషన్లో మొదటి వారం చివరి రోజున లోక్సభలో సమర్పించాలి. ఈ నేపథ్యంలోనే దీనిపై సుధీర్ఘ చర్చ చేపట్టేందుకు కమిటీ సభ్యులు చర్యలు వేగవంతం చేసినట్టు సమాచారం.
Read Also: ISRO New Chief: ఇస్రో కొత్త ఛైర్మన్గా డాక్టర్ వి.నారాయణన్..
Also Read
- Swine Flu H1N1 in India: H1N1 కొత్త వేరియంట్ వచ్చిందా? కరోనా లాంటి ముప్పు ఉందా? ICMR కీలక సమాచారం
- Kangana Ranaut: ‘వాళ్లంతా పనికిమాలిన వాళ్లు’.. తాప్సీ, బాబా రామ్దేవ్పై కంగనా ఘాటు వ్యాఖ్యలు
- CJP: ఢిల్లీలో సెప్టెంబర్ 5న భారీ నిరసన మార్చ్.. మరోసారి ఆందోళనకు సిద్ధమైన విద్యార్థులు
- Tamil Nadu: తీవ్ర దుమారం రేపుతోన్న పొట్టి దుస్తుల వ్యవహారం.. మంత్రి కీర్తన ఘాటు స్పందన
కాగా, పార్లమెంట్ శీతాకాల సమావేశాల సందర్భంగా 129వ రాజ్యాంగ సవరణ బిల్లు, కేంద్రపాలిత ప్రాంతాల చట్టాల (సవరణ) బిల్లును లోక్సభలో కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ప్రవేశ్ పెట్టారు. ఈ తీర్మానికి లోక్ సభ ఆమోద ముద్ర వేసింది. అయితే, ప్రతిపక్ష సభ్యుల నుంచి వ్యతిరేకత రావడంతో ఈ బిల్లుపై మరింత కసరత్తు చేయడానికి కేంద్ర సర్కార్ జేపీసీకి ఈ బిల్లును పంపించింది. 39 మంది సభ్యులతో కూడిన కమిటీకి బీజేపీ ఎంపీ పీపీ చౌదరి అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. కాంగ్రెస్ను నుంచి ప్రియాంక గాంధీ, జేడీయూ- సంజయ్ ఝా, శివసేన (షిండే)కు చెందిన శ్రీకాంత్ షిండే, తృణమూల్కు చెందిన కళ్యాణ్ బెనర్జీ, ఆప్ ఎంపీ సంజయ్ సింగ్తో పాటు తదితరులు సభ్యులుగా ఇందులో ఉన్నారు.
తాజావార్తలు
-
OTR: దువ్వాడ శ్రీనివాస్ అడుగులు మళ్లీ వైసీపీ వైపు పడుతున్నాయా..?
-
AP High Court: విశాఖ డేటా సెంటర్పై హైకోర్టు సీరియస్.. కీలక ఆదేశాలు
-
Nakshathra : లవ్ యూ నాన్న, లవ్ యూ అమ్మ
-
Ravi Teja: ‘ఇరుముడి’ సక్సెస్ జోష్.. ‘శివ నువ్వు తోపు సామీ’.. స్టేజ్ పైనే డైరెక్టర్ను హత్తుకున్న మాస్ మహారాజా!
-
Mythri Ravi: ఫోన్లో రీల్స్ చూసినా ఏడుపొస్తోంది.. ‘అన్నమయ్య’ తర్వాత మళ్లీ ఇప్పుడే..
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్ఫోన్ కొనేముందు ఈ వాటర్ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!