Mamata Banerjee: మమతా బెనర్జీకి బిగ్ షాక్ తగిలింది. ఇప్పటికే తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ)ని తన చేతిలో నుంచి కోల్పోయిన మమతకు ఇప్పుడు ఆమెపై కేసు నమోదైంది. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినందుకు బెంగాల్ ప్రభుత్వం ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఒక ఎన్నికల ర్యాలీలో మాట్లాడుతూ.. ఒక వర్గం మీకు ఎదురుగా నిలబడితే తీవ్ర పరిణామాలు తప్పవు అంటూ హెచ్చరించింది. ఈ వ్యాఖ్యలపై ప్రస్తుతం ఎఫ్ఐఆర్ నమోదైంది. బీజేపీకి ఓటేసే వారిని ఉద్దేశిస్తూ ఆమె ఈ వ్యాఖ్యలు చేసింది.
ఒక ర్యాలీలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన కారణంగా మమతా బెనర్జీపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరుతూ కోల్కతాకు చెందిన ఒక వ్యక్తి ఫిర్యాదు చేశారు. పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి, కేసును హరకే స్ట్రీట్ పోలీస్ స్టేషన్కు బదిలీ చేశారు. మత పరమైన ఉద్రిక్తల్ని పెంచేలా దీదీ ఈ వ్యాఖ్యలు చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
కోల్కతాలో 2026 అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి ముందు జరిగిన ఒక రాజకీయ కార్యక్రమంలో మమత చేసిన ఈ వ్యాఖ్యలు సమాజంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ పెంచేలా ఉన్నాయని ఫిర్యాదుదారు పేర్కొన్నారు. ఎన్నికల తర్వాత కోల్కతా సహా రాష్ట్రంలోనరి పలు ప్రాంతాల్లో చోటుచేసుకున్న కొన్ని మతపరమైన ఉద్రిక్తతలకు కూడా ఈ వ్యాఖ్యలే కారణమై ఉండొచ్చని ఫిర్యాదులో పేర్కొన్నారు.మమత ప్రసంగానికి సంబంధించిన వీడియో రికార్డింగ్స్ పోలీసులకు అందించినట్లు సమాచారం. భారతీయ న్యాయ సంహిత (BNS)లోని సెక్షన్ 196(1), 351(2), 352 కింద మమతా బెనర్జీపై కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ కేసు, మమత వ్యాఖ్యలపై టీఎంసీ నుంచి ఇప్పటి వరకు అధికారిక స్పందన రాలేదు.

