Punjab: ‘‘ పాకిస్తాన్లో నివసిస్తున్నట్లు ఉంది’’.. సొంత ప్రభుత్వంపై ఆప్ ఎమ్మెల్యే ఘాటు వ్యాఖ్యలు..
- మేము పాకిస్తాన్లో ఉన్నట్లుగా అనిపిస్తోంది..
- సొంత ప్రభుత్వంపైనే ఆప్ ఎమ్మెల్యే విమర్శలు..
- పంజాబ్లో రాజకీయ దుమారానికి కారణమైన వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Punjab: పంజాబ్ ఆప్ ఎమ్మెల్యే దేవిందర్జీత్ లడ్డీ ధోసే చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. మోగాలో ఆరోగ్య సౌకర్యాలు అందుబాటులో లేకపోవడంపై ఆయన సొంత ప్రభుత్వంపైనే విమర్శలు గుప్పించారు. మోగా జిల్లాపై పంజాబ్ ప్రభుత్వం సవతి తల్లి ప్రేమని చూపిస్తోందని అన్నారు. మోగా కోసం ఆరోగ్యమంత్రి కొత్త ప్రాజెక్టుని ప్రకటించకపోవడంతో ధోసే ఆగ్రహం వ్యక్తం చేశారు.
అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాల్లో మాట్లాడుతూ.. ‘‘మోగాపై వివక్ష ఎందుకు..? మేము పాకిస్తాన్లో నివసిస్తున్నట్లుగా నాకు అనిపిస్తోంది’’ అని ధరమ్కోట్ ఎమ్మెల్యే ధోస్ అన్నారు. ధరంకోట్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేసే ప్రణాళికలు లేవని పంజాబ్ ఆరోగ్య మంత్రి బల్బీర్ సింగ్ చెప్పిన తర్వాత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధోసే విమర్శలు చేశారు. ధరమ్కోట్లో ట్రామా సెంటర్ ప్రారంభించే ప్రతిపాదన లేదని ఆరోగ్య మంత్రి స్పష్టం చేశారు. దీంతో ధోసే ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.
Also Read
- Modi-Putin: మోడీ, రాష్ట్రపతికి పుతిన్ సందేశం.. యూపీ తుఫాన్ మృతులకు సంతాపం
- PM Modi: రష్యా, ఇరాన్ విదేశాంగ మంత్రులతో మోడీ భేటీ.. ఇంధన సంక్షోభంపై చర్చ
- Pakistan: ఢిల్లీని టార్గెట్ చేసే మిస్సైల్ను పరీక్షించిన పాకిస్తాన్..
- Delhi: 2 రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్.. విదేశీ టూర్లు రద్దు.. పొదుపు మంత్రం ప్రకటించిన ఢిల్లీ సర్కార్
Read Also: PM Modi: రామేశ్వరంలో మోడీ శ్రీరామనవమి వేడుకలు.. అదే రోజు ‘‘పంబన్’’ వంతెన ప్రారంభం..
రాష్ట్రవ్యాప్తంగా జలంధర్, పఠాన్కోట్, ఖన్నా, ఫిరోజ్పూర్, ఫజిల్కా ప్రాంతాల్లో 5 ట్రామా సెంటర్లు పనిచేస్తున్నాయని ఆరోగ్యమంత్రి చెప్పారు. మంత్రి ప్రకటనపై ఆగ్రహించిన ధోసే, ధరమ్కోట్ వెనకబడిన ప్రాంతమని, నియోజకవర్గానికి ప్రాధాన్యత ఇవ్వకపోవడంపై ఆగ్రహించారు. కోట్ ఇసే ఖాన్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో 8 మంది వైద్యుల పోస్టులకు రెండు మాత్రమే భర్తీ చేశారని సభలో చెప్పారు.
ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం పంజాబ్ రాష్ట్రంలో రాజకీయ దుమారానికి దారి తీశాయి. వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న పంజాబ్లో ఆప్ ప్రభుత్వంపై బీజేపీ, కాంగ్రెస్ దాడిని తీవ్రం చేశాయి. సొంత పార్టీ ఎమ్మెల్యే నుంచే ప్రభుత్వంపై విమర్శలు రావడంపై సిగ్గుచేటని కాంగ్రెస్ విమర్శించింది.
తాజావార్తలు
-
Trigun: ప్రధాని మాటే మా సినిమాకు బలం.. ‘మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్’ టీమ్!
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
Marksheet Cake: ముంబై టు సోషల్ మీడియా.. నెట్టింట వైరల్ అవుతున్న ‘మార్క్షీట్’ సెలబ్రేషన్!
-
LayOffs: మరో దిగ్గజ కంపెనీలో భారీగా లే ఆఫ్స్.. 4000 మంది ఉద్యోగుల తొలగింపు..
-
UAE-Iran: యూఏఈలో నెతన్యాహూ పర్యటన.. ఇరాన్ తీవ్ర ఆగ్రహం..
ట్రెండింగ్
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?