Punjab: ‘‘ పాకిస్తాన్లో నివసిస్తున్నట్లు ఉంది’’.. సొంత ప్రభుత్వంపై ఆప్ ఎమ్మెల్యే ఘాటు వ్యాఖ్యలు..
- మేము పాకిస్తాన్లో ఉన్నట్లుగా అనిపిస్తోంది..
- సొంత ప్రభుత్వంపైనే ఆప్ ఎమ్మెల్యే విమర్శలు..
- పంజాబ్లో రాజకీయ దుమారానికి కారణమైన వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Punjab: పంజాబ్ ఆప్ ఎమ్మెల్యే దేవిందర్జీత్ లడ్డీ ధోసే చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. మోగాలో ఆరోగ్య సౌకర్యాలు అందుబాటులో లేకపోవడంపై ఆయన సొంత ప్రభుత్వంపైనే విమర్శలు గుప్పించారు. మోగా జిల్లాపై పంజాబ్ ప్రభుత్వం సవతి తల్లి ప్రేమని చూపిస్తోందని అన్నారు. మోగా కోసం ఆరోగ్యమంత్రి కొత్త ప్రాజెక్టుని ప్రకటించకపోవడంతో ధోసే ఆగ్రహం వ్యక్తం చేశారు.
అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాల్లో మాట్లాడుతూ.. ‘‘మోగాపై వివక్ష ఎందుకు..? మేము పాకిస్తాన్లో నివసిస్తున్నట్లుగా నాకు అనిపిస్తోంది’’ అని ధరమ్కోట్ ఎమ్మెల్యే ధోస్ అన్నారు. ధరంకోట్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేసే ప్రణాళికలు లేవని పంజాబ్ ఆరోగ్య మంత్రి బల్బీర్ సింగ్ చెప్పిన తర్వాత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధోసే విమర్శలు చేశారు. ధరమ్కోట్లో ట్రామా సెంటర్ ప్రారంభించే ప్రతిపాదన లేదని ఆరోగ్య మంత్రి స్పష్టం చేశారు. దీంతో ధోసే ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.
Also Read
- BMC Taj Mahal Palace Hotel: 26/11 తర్వాత రోడ్లపై బారికేడ్లు ఏర్పాటు.. తాజ్ హోటల్కు రూ. 22 కోట్ల నోటీసు జారీ
- NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
- India-UK: అమల్లోకి భారత్-యూకే ఒప్పందం.. ఏవేవి ధరలు తగ్గాయంటే..!
- Bengal: బెంగాల్ రాజకీయాల్లో కొత్త చర్చ! మమతకు కాంగ్రెస్ ఆహ్వానం
Read Also: PM Modi: రామేశ్వరంలో మోడీ శ్రీరామనవమి వేడుకలు.. అదే రోజు ‘‘పంబన్’’ వంతెన ప్రారంభం..
రాష్ట్రవ్యాప్తంగా జలంధర్, పఠాన్కోట్, ఖన్నా, ఫిరోజ్పూర్, ఫజిల్కా ప్రాంతాల్లో 5 ట్రామా సెంటర్లు పనిచేస్తున్నాయని ఆరోగ్యమంత్రి చెప్పారు. మంత్రి ప్రకటనపై ఆగ్రహించిన ధోసే, ధరమ్కోట్ వెనకబడిన ప్రాంతమని, నియోజకవర్గానికి ప్రాధాన్యత ఇవ్వకపోవడంపై ఆగ్రహించారు. కోట్ ఇసే ఖాన్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో 8 మంది వైద్యుల పోస్టులకు రెండు మాత్రమే భర్తీ చేశారని సభలో చెప్పారు.
ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం పంజాబ్ రాష్ట్రంలో రాజకీయ దుమారానికి దారి తీశాయి. వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న పంజాబ్లో ఆప్ ప్రభుత్వంపై బీజేపీ, కాంగ్రెస్ దాడిని తీవ్రం చేశాయి. సొంత పార్టీ ఎమ్మెల్యే నుంచే ప్రభుత్వంపై విమర్శలు రావడంపై సిగ్గుచేటని కాంగ్రెస్ విమర్శించింది.
తాజావార్తలు
-
OnePlus N6x: వన్ప్లస్ N6x త్వరలో భారత్లోకి.. ఎంట్రీ లెవల్ సెగ్మెంట్లో మరో సంచలనం
-
Palli Chattambi OTT: ఓటీటీలోకి టోవినో థామస్ పీరియడ్ యాక్షన్ డ్రామా… స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే?
-
Guntur: కన్న కొడుకును చంపిన తల్లిదండ్రులు.!
-
Windfall Tax: పెట్రోల్-డీజిల్, ఏటీఎఫ్పై ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఈ పన్ను అకస్మాత్తుగా పెంపు
-
The Paradise Rights : ప్యారడైజ్ రైట్స్ కోసం రూ. 110 కోట్లు అఫర్ చేసిన దిల్ రాజు.. పుకార్లు నమ్మొద్దన్న నిర్మాత
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!