Punjab: ‘‘ పాకిస్తాన్లో నివసిస్తున్నట్లు ఉంది’’.. సొంత ప్రభుత్వంపై ఆప్ ఎమ్మెల్యే ఘాటు వ్యాఖ్యలు..
- మేము పాకిస్తాన్లో ఉన్నట్లుగా అనిపిస్తోంది..
- సొంత ప్రభుత్వంపైనే ఆప్ ఎమ్మెల్యే విమర్శలు..
- పంజాబ్లో రాజకీయ దుమారానికి కారణమైన వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Punjab: పంజాబ్ ఆప్ ఎమ్మెల్యే దేవిందర్జీత్ లడ్డీ ధోసే చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. మోగాలో ఆరోగ్య సౌకర్యాలు అందుబాటులో లేకపోవడంపై ఆయన సొంత ప్రభుత్వంపైనే విమర్శలు గుప్పించారు. మోగా జిల్లాపై పంజాబ్ ప్రభుత్వం సవతి తల్లి ప్రేమని చూపిస్తోందని అన్నారు. మోగా కోసం ఆరోగ్యమంత్రి కొత్త ప్రాజెక్టుని ప్రకటించకపోవడంతో ధోసే ఆగ్రహం వ్యక్తం చేశారు.
అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాల్లో మాట్లాడుతూ.. ‘‘మోగాపై వివక్ష ఎందుకు..? మేము పాకిస్తాన్లో నివసిస్తున్నట్లుగా నాకు అనిపిస్తోంది’’ అని ధరమ్కోట్ ఎమ్మెల్యే ధోస్ అన్నారు. ధరంకోట్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేసే ప్రణాళికలు లేవని పంజాబ్ ఆరోగ్య మంత్రి బల్బీర్ సింగ్ చెప్పిన తర్వాత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధోసే విమర్శలు చేశారు. ధరమ్కోట్లో ట్రామా సెంటర్ ప్రారంభించే ప్రతిపాదన లేదని ఆరోగ్య మంత్రి స్పష్టం చేశారు. దీంతో ధోసే ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.
Also Read
- Natural gas: భారత్కు జాక్పాట్.. అండమాన్లో గ్యాస్ నిల్వలు..
- Putin: విదేశాల ఒత్తిడికి భారత్ ఎన్నడూ లొంగలేదు.. ట్రంప్కు పుతిన్ స్ట్రాంగ్ మెసేజ్..
- India-China: భారత్ జీడీపీ చైనాను మించిపోనుందా? అంతర్జాతీయ సంస్థ అంచనాలు ఇవే!
- TGPSC New Notification: నిరుద్యోగులకు భారీ శుభవార్త.. మరో నోటిఫికేషన్ విడుదల చేసిన TGPSC..
Read Also: PM Modi: రామేశ్వరంలో మోడీ శ్రీరామనవమి వేడుకలు.. అదే రోజు ‘‘పంబన్’’ వంతెన ప్రారంభం..
రాష్ట్రవ్యాప్తంగా జలంధర్, పఠాన్కోట్, ఖన్నా, ఫిరోజ్పూర్, ఫజిల్కా ప్రాంతాల్లో 5 ట్రామా సెంటర్లు పనిచేస్తున్నాయని ఆరోగ్యమంత్రి చెప్పారు. మంత్రి ప్రకటనపై ఆగ్రహించిన ధోసే, ధరమ్కోట్ వెనకబడిన ప్రాంతమని, నియోజకవర్గానికి ప్రాధాన్యత ఇవ్వకపోవడంపై ఆగ్రహించారు. కోట్ ఇసే ఖాన్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో 8 మంది వైద్యుల పోస్టులకు రెండు మాత్రమే భర్తీ చేశారని సభలో చెప్పారు.
ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం పంజాబ్ రాష్ట్రంలో రాజకీయ దుమారానికి దారి తీశాయి. వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న పంజాబ్లో ఆప్ ప్రభుత్వంపై బీజేపీ, కాంగ్రెస్ దాడిని తీవ్రం చేశాయి. సొంత పార్టీ ఎమ్మెల్యే నుంచే ప్రభుత్వంపై విమర్శలు రావడంపై సిగ్గుచేటని కాంగ్రెస్ విమర్శించింది.
తాజావార్తలు
-
Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
-
Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్గా సర్పంచ్ సాబ్..
-
Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
-
NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
-
Natural gas: భారత్కు జాక్పాట్.. అండమాన్లో గ్యాస్ నిల్వలు..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!