Women Harassment: దేశంలో ప్రతీగంటకు నలుగురు మహిళలపై అత్యాచారం..
- దేశంలో ప్రతీగంటకు నలుగురు మహిళలపై అత్యాచారం..
- నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) నివేదికలో విస్తూపోయే నిజాలు..
- పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులకు గురవుతున్న మహిళలు..
Women Harassment: కోల్కతాలో 31 ఏళ్ల వైద్యురాలిపై అత్యాచారం, హత్య ఘటన యావద్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. బాధితురాలికి న్యాయం కోసం మహిళలు, తోటి వైద్యులు ఆందోళన నిర్వహిస్తున్నారు. ఈ కేసుల అనేక అనుమానాలకు తావిస్తోంది. ప్రభుత్వం నిందితులను కాపాడుతుందా..? అని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. నైట్ డ్యూటీలో ఉన్న వైద్యురాలిపై ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్, ఆస్పత్రిలోని సెమినార్ హాలులో అత్యాచారం జరిగింది. అత్యంత పాశవికంగా దాడి చేసి హత్య చేశారు. ఈ కేసులో సంజయ్ రాయ్ అనే నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే, ఈ కేసులో ప్రభుత్వం, పోలీసులు నిర్లక్ష్యంపై కలకత్తా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ కేసుని సీబీఐకి బదిలీ చేసింది.
ఇది ఒక్క ఘటనే కాదు దేశవ్యాప్తంగా అత్యాచారాల పరంపర కొనసాగుతూనే ఉంది. భారతదేశంలో 2017 నుంచి 2022 మధ్య సగటున ప్రతీరోజూ 86 అత్యాచార కేసులు నమోదవుతున్నాయి. చాలా కేసుల్లో మహిళలు తమకు తెలిసిన వారి నుంచే అఘాయిత్యాలకు గురికావడం గమనార్హం. ఈ ప్రకారం చూస్తే దేశంలో ప్రతీ గంటకు నలుగురు మహిళలు రేప్కి గురవుతున్నారు. ఇందులో మూడు కంటే ఎక్కువ అత్యాచారాల్లో బాధిత మహిళలకు నిందితులు తెలుసు.
Also Read
- Ajit Doval: ఢిల్లీలో ఇటలీ రక్షణ మంత్రి పర్యటన.. అజిత్ దోవల్తో సమావేశం
- Honeymoon Murder Case: 790 పేజీల ఛార్జిషీట్.. సోనమ్కు బెయిల్.. అసలేం జరిగిందంటే..!
- Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
- IMD Rain Aalert: దక్షిణాది రాష్ట్రాలతో పాటు ఈ రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
Read Also: UP Road Accident: యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. 10 మంది మృతి!
వార్షిక నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) నివేదిక ప్రకారం, 2017 మరియు 2022 మధ్య, భారతదేశంలో మొత్తం 1.89 లక్షల అత్యాచార కేసులు నమోదయ్యాయి, ఇందులో 1.91 లక్షల మంది బాధితులు ఉన్నారు. కనీసం 1.79 లక్షల కేసుల్లో రేపిస్ట్ తెలిసిన వ్యక్తి కాగా, 9,670 కేసుల్లో బాధితురాళ్లకు తెలియదు. భారతదేశంలో అత్యధికంగా అత్యాచారా బాధితుల వయసు 18 నుంచి 30 ఏళ్ల మధ్యే ఉంది. 1.89 లక్షల కేసుల్లో 1.13 లక్షల మంది ఈ వయసువారే. ఈ లెక్కన చూస్తే ప్రతీ రోజూ నమోదవుతున్న 86 అత్యాచారాల్లో 52 మంది 18 నుంచి 30 ఏళ్ల మధ్య వయసున్న మహిళలే. మిగిలిన కేసుల్లో బాధితురాళ్ల వయసు 30 కన్నా ఎక్కువ ఉంటుంది.
మన ఆఫీసులు, పని ప్రదేశాలు ఎంత భద్రం..?
భారతదేశంలో నమోదవుతున్న కేసులతో పోలిస్తే ఆఫీసుల్లో మహిళలపై లైంగిక వేధింపులు తక్కువగానే ఉన్నప్పటికీ, వీటిని లైట్ తీసుకునే అవకాశం లేదు. సగటున ప్రతీరోజై కనీసం ఒక మహిళ తన ఆఫీసులో లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్న NCRB డేటా చూపిస్తుంది. 2014 మరియు 2022 మధ్య, పని లేదా కార్యాలయ ప్రాంగణంలో లైంగిక వేధింపులకు సంబంధించి కనీసం 4,231 కేసులు నమోదయ్యాయి. మొదట్లో, ఆఫీసు ప్రాంగణాల్లో లైంగిక వేధింపుల కేసులు చాలా తక్కువగా ఉన్నాయి. అయితే మిగత పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులు అధికంగా ఉన్నాయి. 2014, 2015 మరియు 2016 సంవత్సరాల్లో, యజమానులు లేదా సహోద్యోగులు చేసిన అత్యాచారాల సంఖ్యను కూడా NCRB వెల్లడించింది. మూడు సంవత్సరాలలో, యజమానులు లేదా సహోద్యోగులచే 1,795 అత్యాచార కేసులు నమోదయ్యాయి. అంటే ప్రతీ రోజూ దాదాపుగా ఇద్దరిపై అత్యచారం జరిగినట్లు డేటా చూపిస్తోంది.
తాజావార్తలు
-
AP Cabinet Key Decisions: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు..
-
Ajit Doval: ఢిల్లీలో ఇటలీ రక్షణ మంత్రి పర్యటన.. అజిత్ దోవల్తో సమావేశం
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
Hardik Pandya: హార్దిక్ను నట్టేట ముంచేస్తోన్న రోహిత్, సూర్య.. మీకు పాండ్య ఎంత చేశాడో గుర్తుందా బ్రోస్!
-
Extramarital affair: ప్రియురాలి ఇంట్లోకి దూరిన ప్రియుడు.. సడన్ గా ఎంట్రీ ఇచ్చిన భర్త..
ట్రెండింగ్
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!
-
Raw Mango Tomato Roti Pachadi: వేడివేడి అన్నానికి సూపర్ కాంబో “మామిడికాయ టమాటా రోటి పచ్చడి”.!