Tamil Nadu: దారుణం.. 3 నెలల క్రితం ప్రేమ పెళ్లి.. అల్లుడ్ని చంపిన మామ
- తమిళనాడులో దారుణం
- 3 నెలల క్రితం ప్రేమ పెళ్లి
- అల్లుడ్ని చంపిన మామ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళనాడులో దారుణం జరిగింది. అల్లుడిని మామ అత్యంత ఘోరంగా హతమార్చాడు. కొడవలితో తల, చేతులు, కాళ్లపై పదే పదే నరకడంతో ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తమిళనాడులోని రామనాయకన్పట్టికి చెందిన పాల వ్యాపారి రామచంద్రన్ (24), బట్లగుండు సమీపంలోని గణపతిపట్టికి చెందిన బీకాం ద్వితీయ సంవత్సరం చదువుతున్న ఆర్తి (21) ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయింది. అనంతరం ప్రేమగా మారింది. అయితే వీరిద్దరి పెళ్లికి యువతి కుటుంబం వ్యతిరేకించింది. దీంతో ఇద్దరూ మూడు నెలల క్రితం పెద్దలను ఎదురించి వివాహం చేసుకున్నారు.
Also Read
- Russian Oil: అమెరికా ఆంక్షలు ఉంటే ఎంత? ఊడితే ఎంత! రష్యా చమురు కొనుగోలుపై భారత్ 'మాస్' స్టేట్మెంట్!
- Supreme Court: రోడ్లపై వీధి కుక్కలు కనిపిస్తే అంతే! సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. పాత ఆర్డర్ మారేదే లేదని స్పష్టం
- IMD Yellow Alert: నిప్పుల కొలిమిలా ఉత్తర భారతం.. ఢిల్లీలో 45 డిగ్రీల దాకా చేరిన ఉష్ణోగ్రతలు.. ఐఎండి తీవ్ర హెచ్చరిక!
- What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
ఇది కూడా చదవండి: Trump-Meloni: మెలోని అందమైన అమ్మాయి.. అలాంటే అభ్యంతరం లేదు కదా? నవ్వులు పూయించిన ట్రంప్
ఆదివారం సాయంత్రం రామచంద్రన్ ద్విచక్ర వాహనంపై కూజిపట్టికి వెళుతుండగా కూట్టతు అయ్యంపాలయం వంతెన సమీపంలో అతని మామ చంద్రన్ (49) అడ్డగించి వాగ్వాదానికి దిగాడు. అనంతరం కొడవలితో దాడి చేశాడు. రామచంద్రన్ తల, చేతులు, కాళ్లపై పదే పదే దాడి చేయడంతో ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: Meloni: ట్రంప్ శాంతికర్త అంటూ షెహబాజ్ షరీఫ్ పొగడ్తలు.. మెలోని సంజ్ఞలు వైరల్
జంట వేర్వేరు కులాలకు చెందినవారు. అయితే పరువు హత్యను పోలీసులు తోసిపుచ్చారు. బాధితులిద్దరూ షెడ్యూల్డ్ కులానికి చెందిన వారు కాదని.. అయితే హత్య వెనుక ఉన్న కారణాన్ని వెలికితీస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడి కోసం గాలిస్తున్నట్లు చెప్పారు.
తమిళనాడులో నేరాలు పెరుగుతున్నాయని, శాంతిభద్రతలు క్షీణించాయని ప్రతిపక్షాలు విమర్శించాయి. అధికార డీఎంకే ఆరోపణలను తోసిపుచ్చింది. నేరాలు చాలా వరకు వ్యక్తిగత శత్రుత్వం వల్లే జరిగాయని, ప్రభుత్వం అటువంటి కేసులన్నింటిలో కఠినమైన చర్యలు, వేగవంతమైన చర్యలు తీసుకుంటుందని తెలిపింది.
ఇది కూడా చదవండి: Shashi Tharoor: మోడీ మంచి అవకాశాన్ని కోల్పోయారు.. శాంతి సదస్సుకు వెళ్లకపోవడాన్ని తప్పుపట్టిన శశిథరూర్
తాజావార్తలు
-
Dragon Glimpse: 4 నిమిషాల పైగా ఊచకోత.. బాక్సాఫీస్ వద్ద విధ్వంసానికి టైం ఫిక్స్.. అర్ధరాత్రి #NTRNeel బర్త్డే గిఫ్ట్!
-
Water Board Manager: జలమండలి మేనేజర్ ఇంట్లో ఏసీబీ దాడులు.. రూ.100 కోట్లకు పైగా ఆస్తులు గుర్తింపు!
-
Sorakaya Kadhi Recipe: నిమిషాల్లో రుచికరమైన, ఆరోగ్యకరమైన కర్రీ.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ అడుగుతారు..!
-
NTRNeel : సోషల్ మీడియాలో ఎన్టీఆర్ – నీల్ హంగామా మాములుగా లేదు
-
Russian Oil: అమెరికా ఆంక్షలు ఉంటే ఎంత? ఊడితే ఎంత! రష్యా చమురు కొనుగోలుపై భారత్ ‘మాస్’ స్టేట్మెంట్!
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!