Maharashtra CM: ఫడ్నవిస్తో భేటీకానున్న షిండే.. దేనికోసమంటే..!
- ఫడ్నవిస్తో భేటీకానున్న షిండే
- ఫోర్ట్ ఫోలియోపై చర్చించనున్న షిండే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహారాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవిస్ ఎట్టకేలకు ఎన్నికయ్యారు. బీజేపీ శాసనసభాపక్ష నేతగా ఫడ్నవిస్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మొత్తానికి మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు వచ్చిన 11 రోజులకి మహారాష్ట్ర సీఎం ఎంపిక పూర్తయింది. గురువారం (05-12-2024) ముఖ్యమంత్రిగా ఫడ్నవిస్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి బీజేపీ అగ్ర నేతలు హాజరుకానున్నారు. ప్రమాణ స్వీకారోత్సవానికి ఆజాద్ మైదాన్లో వేగంగా సన్నాహాలు జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే బుధవారం ఫడ్నవిస్తో షిండే భేటీకానున్నట్లు తెలుస్తోంది. శాఖలపై ఇరువురు చర్చించనున్నట్లు సమాచారం.
ఇది కూడా చదవండి: Devendra Fadnavis: ఆశ్చర్యపరిచిన ఫడ్నవీస్ కొత్త పేరు.. ఆహ్వానపత్రిక వైరల్..
Also Read
- Droupadi Murmu: కేసుల గుట్టలకు చెక్.. సుప్రీంకోర్టు జడ్జీల పెంపునకు రాష్ట్రపతి ఆమోదం..
- CNG Price Hike: రెండు రోజుల్లో రెండోసారి.. మళ్లీ పెరిగిన సీఎన్జీ ధరలు..
- Rajdhani Express Fire: రాజధాని ఎక్స్ప్రెస్ లో ప్రమాదం.. రెండు కోచ్లలో చెలరేగిన మంటలు
- Bulldozer Action: బెంగాల్లో బుల్డోజర్ చర్యలు.. హౌరా స్టేషన్ బయట ఆక్రమణలు తొలగింపు
ఇదిలా ఉంటే మహాయుతి కూటమిలో భాగంగా శివసేన ముఖ్యమంత్రి పోస్టు కోసం చాలా గట్టిగా పట్టుబట్టింది. సీఎం పంచాయితీ కారణంగానే కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు ఇన్ని రోజుల సమయం పట్టింది. అయితే ఈ పంచాయితీ పరిష్కరించడానికి కేంద్ర పరిశీలకులుగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీని కేంద్రం నియమించింది. మొత్తానికి వీరిద్దరు రంగంలోకి దిగి ఏక్నాథ్ షిండేను ఒప్పించారు. డిప్యూటీ సీఎం పదవి తీసుకోవడానికి ఆయన అంగీకరించడంతో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు మార్గం సుగమం అయింది.
ఇది కూడా చదవండి: RTC Driver Meets Nara Lokesh: ‘దేవర’ పాటకు స్టెప్పులేశాడు.. మంత్రి లోకేష్ని కలిశాడు..
అయితే కొత్త ప్రభుత్వంలో 7:7:7 నిష్పత్తిలో కూటమిలో ఉన్న మూడు పార్టీలు మంత్రుల పదవులు పంచుకోనున్నట్లు తెలుస్తోంది. బీజేపీ నుంచి ఏడుగురు, శివసేన నుంచి ఏడుగురు, ఎన్సీపీ నుంచి ఏడుగురు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా మంత్రి పదవులుపై చర్చించేందుకు బుధవారం దేవేంద్ర ఫడ్నవిస్తో ఏక్నాథ్ షిండే భేటీకానున్నట్లు తెలుస్తోంది. శివసేనకు సంబంధించిన ఫోర్ట్ ఫోలియోపై షిండే చర్చించనున్నారు. ఇక ఫడ్నవిస్ ముఖ్యమంత్రిగా.. షిండే, అజిత్ పవార్ డిప్యూటీ సీఎంలుగా ప్రమాణం చేయనున్నారు.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ -132, శివసేన-57, ఎన్సీపీ-41, కాంగ్రెస్-16, ఉద్ధవ్ థాక్రే-20, శరద్ పవార్-10 స్థానాలు గెలుచుకున్నాయి. కాంగ్రెస్ నేతృత్వంలోని మహా వికాస్ అఘాడి (ఎంవీఏ)కి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపించలేదు. ఈవీఎంల ట్యాంపరింగ్ వల్లే ఓడిపోయాం అంటూ కాంగ్రెస్ ఆరోపించింది.
ఇది కూడా చదవండి: Bank Duties: 5 రోజుల పని దినాలపై ఏఐబీఓసీ కీలక ప్రకటన.. భవిష్యత్ ప్లాన్ ఇదే!
తాజావార్తలు
-
Australia: 61 మంది మహిళలపై పైశాచికత్వం! ఆస్ట్రేలియాలో భారత సంతతి చెందిన వ్యక్తికి 13 ఏళ్ల జైలు శిక్ష
-
Rajnikanth : విజయ్ CM అయినందుకు నాకు ఎలాంటి అసూయ లేదు
-
Story Board: దేశంలో S.I.R ఉద్దేశమేంటి..? జరుగుతున్నదేంటి..?
-
Natural Hair Color: తెల్ల జుట్టుతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ కిచెన్ చిట్కాలతో సహజమైన హెయిర్ కలర్ మీ సొంతం..!
-
MS Raju-Trisha“త్రిషకు నేనంటే ప్రాణం”.. ఎంఎస్ రాజు ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..