Medical Alert: పేషెంట్లకు బిగ్ అలర్ట్.. దేశవ్యాప్తంగా 24 గంటలు వైద్య సేవలు బంద్
- పేషెంట్లకు బిగ్ అలర్ట్
- దేశవ్యాప్తంగా 24 గంటలు వైద్య సేవలు బంద్
- కోల్కతా హత్యాచార ఘటనతో నిరసన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ వ్యాప్తంగా 24 గంటల పాటు వైద్య సేవలు స్తంభించనున్నాయి. శనివారం ఉదయం 6 గంటల నుంచి ఆదివారం ఉదయం 6 గంటల వరకు ఒక రోజంతా వైద్య సేవలు నిలిచిపోనున్నాయి. కోల్కతా వైద్యురాలి హత్యాచార ఘటనకు నిరసనగా FAIM నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఫ్యాకల్టీ అసోసియేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (FAIM) అధికారికంగా ప్రకటించింది. శనివారం ఓపీడీ(OPD), ఓటీ( OT) సేవలను నిలిపివేస్తున్నట్లు వెల్లడించింది. పేషెంట్లకు, దేశ ప్రజలకు ముందుగానే సమాచారం తెలియజేసింది. అత్యవసర సేవలు మాత్రం అందుబాటులో ఉంటాయని పేర్కొంది. ఎమర్జెన్సీలో మాత్రం డాక్టర్లు అందుబాటులో ఉంటారని వెల్లడించింది.
కోల్కతా వైద్యురాలి హత్యాచార ఘటన దేశాన్ని కుదిపేస్తోంది. ఆర్జీ కర్ ఆస్పత్రిలోనే వైద్యురాలు అత్యంత క్రూరంగా హత్యాచారానికి గురైంది. పోస్టుమార్టం రిపోర్టు ప్రకారం ఆమెపై సామూహిక అత్యాచారానికి గురైనట్లు తెలుస్తోంది. ఆమెలో 150 మిల్లీగ్రాముల వీర్యం ఉంది. అలాగే ఘటనాస్థలిలో వస్తువులన్నీ చెల్లాచెదురుగా ఉన్నాయి. అంటే బాధితురాలు.. మానవమృగాలతో తీవ్రంగా పోరాడినట్లుగా అర్ధమవుతోంది.
Also Read
- PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
- PM Modi: నెదర్లాండ్స్ రాజు, రాణితో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చలు
- Maharashtra: తుపాకీ గురిపెట్టినా భయపడలేదు.. దొంగలతో వీరోచితంగా పోరాడిన సిబ్బంది.. వీడియో వైరల్
- Silver: బంగారం తర్వాత ఇప్పుడు వెండి.. కేంద్రం కీలక నిర్ణయంతో పెరగనున్న ధరలు..
ఇదిలా ఉంటే ఆర్జీ కర్ ఆస్పత్రి మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ అకృత్యాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఘోష్ దుర్మార్గుడని ఇరుగుపొరుగు వారు మీడియాకు చెబుతున్నారు. ఇక మాజీ ఉద్యోగులైతే తీవ్ర ఆరోపణలు చేశారు. ఘోష్ తన గెస్ట్ హౌస్లో సెక్స్ రాకెట్, డ్రగ్స్ మాఫియా నడిపిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. వైద్యురాలు అత్యంత ఘోరంగా హత్యాచారానికి గురై అర్ధనగ్నంగా పడి ఉంటే.. బాధితురాలి తల్లిదండ్రులకు మాత్రం ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం ఇచ్చాడు. కనీసం పోలీసులకు కూడా ఫోన్ చేయలేదు. అంటే ఇదంతా ఒక ప్రక్క ప్రణాళికతో జరిగినట్లుగా సీబీఐ భావిస్తోంది. సీబీఐ లోతుగా దర్యాప్తు చేస్తోంది.

తాజావార్తలు
-
Finn Allen: 10 సిక్సర్లు, 4 ఫోర్లు.. అభిషేక్, వైభవ్ల ప్రత్యేక బ్యాట్స్మెన్ల జాబితాలో ఫిన్ అలెన్..
-
Astrology: మే 17 శనివారం దినఫలాలు.. ఈ రాశివారు కాస్త జాగ్రత్త..
-
Off The Record : రాంగ్ సిగ్నల్స్ రాకుండా జై ఆంధ్ర లైన్ తీసుకున్నారా?
-
Story Board : మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
-
PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..