Kolkata doctor murder case: “కంటికి గాయాలు, మెడ ఎముక ఫ్రాక్చర్”.. వైద్యురాలి హత్యాచార ఘటనలో వణికించే నిజాలు..
- కోల్కతా వైద్యురాలి హత్యాచార ఘటనలో విస్తూపోయే నిజాలు..
- దారుణంగా హింసించి చంపినట్లు పోస్టుమార్టం నివేదిక..
- బ్లూటూత్ హెడ్ఫోన్ సాయంతో చిక్కిన నిందితుడు..
- ఉరిశిక్ష విధించేలా చర్యలు తీసుకుంటామన్న మమతా బెనర్జీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kolkata doctor murder case: కోల్కతా ట్రైనీ పీజీ డాక్టర్పై అత్యాచారం, హత్య ఘటన వెస్ట్ బంగాల్ రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఆర్జి కర్ మెడికల్ హాస్పిటల్లో నైట్ డ్యూటీలో విధులు నిర్వహిస్తున్న మహిళా డాక్టర్పై దారుణం జరిగింది. ఈ కేసులో నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. హత్యచేసినట్లు ఒప్పుకున్నట్లు సమాచారం. 31 ఏళ్ల వైద్యురాలి ఘటన ఆ రాష్ట్రంలో పొలిటికల్ దుమారం రేపింది.
ఇదిలా ఉంటే ఆమె పోస్టుమార్టం నివేదికలో విస్తూపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడు ఆమెను దారుణంగా హింసించి హత్య చేసినట్లు తెలుస్తోంది. ఆమె ఒంటిపై అనేక గాయాలు ఉన్నాయి. ఆమె రెండు కళ్లు, నోరు, ప్రైవేట్ భాగాల నుంచి రక్తస్రావం జరిగింది. ముఖంపై గోరుతో రక్కిన గాయాలు ఉన్నాయి. వైద్యురాలి బొడ్డు, పెదవులు, ఎడమకాలు, మెడ, కుడి చేతిలోని ఉంగరపు వేలుపై గాయాలు ఉన్నాయి. ఇది ఖచ్చితంగా లైంగిక వేధింపుల కేసే అని పోలీస్ అధికారి వెల్లడించారు. ఆమె మెడ ఎముక విరిగినట్లు గుర్తించారు. ఆమె గొంతు నులిమి హత్య చేసినట్లు తెలుస్తోంది.
Also Read
- 2026 Half Year: అర్థ సంవత్సరంలో జాతీయంగా జరిగిన విశేషాలు ఇవే!
- UP: రాయ్బరేలీ ఆస్పత్రిలో అమానుషం.. రోగిని కాలుతో తన్నిన సిబ్బంది.. ప్రజలు ఆగ్రహం
- Tamil Nadu: సీఎం విజయ్ కీలక నిర్ణయం.. ఇకపై ఏసీ ప్రభుత్వ బస్సులే ఉంటాయని ప్రకటన
- Mumbai: ముంబైలో ఘోరం.. స్కూల్ వ్యాన్పై కూలిన భారీ వృక్షం.. 11 ఏళ్ల విద్యార్థి మృతి
Read Also: Divvala Madhuri: దువ్వాడ శ్రీనివాస్, నేను కలిసే ఉంటాం.. డైవర్స్కి కూడా అప్లై చేశాం
ఈ కేసులో ప్రతిపక్ష బీజేపీ, అధికార టీఎంసీ ప్రభుత్వాన్ని ,సీఎం మమతా బెనర్జీని టార్గెట్ చేసింది. ఈ ఘటనలో నేరస్తుడిని శిక్షించేందుకు సిద్ధంగా ఉన్నామని, నిందితుడికి ఉరిశిక్ష పడేలా చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. కేంద్ర ఎజెన్సీలతో దర్యాప్తుకు కూడా సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. బాధితురాలు ఛెస్ట్ మెడిసిన్లో పీజీ చేస్తోంది. సంఘటన జరిగిన సమయంలో నైట్ డ్యూటీలో ఉంది. ఆమె మృతదేహం శుక్రవారం ఆస్పత్రి సెమినార్ హాల్లో లభించింది.
నిందితుడిని గుర్తించేందుకు సీసీకెమెరాలను పరిశీలించిన పోలీసులు అనుమానితుల జాబితాను సిద్ధం చేశారు. సంఘటన స్థలంలో ‘‘బ్లూటూత్’’ హెడ్ఫోన్ దొరికింది. అనుమానితులను విచారణ కోసం పిలిచిన సందర్భంలో నిందితుడి మొబైల్ ఫోన్తో బ్లూటూత్ ఆటొమెటిక్గా కనెక్ట్ అయింది. నిందితుడికి మరణశిక్ష విధించేలా పాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసేందుకు సీఎం మమతా బెనర్జీ ఆదేశాలు ఇచ్చారు. టీఎంపీ ఎంపీ, మమతా మేనల్లుడు అభిషేక్ బెనర్జీ మాట్లాడుతూ.. కేంద్రం ఇలాంటి కేసుల్లో దోషులను కఠినంగా శిక్షించేందుకు ఆర్డినెన్స్ తీసుకురావాలని, దానికి టీఎంసీ మద్దతు ఉంటుందని చెప్పారు. నిందితుడికి ఉరిశిక్ష లేదా ఎన్కౌంటర్ చేయాలని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Story Board : తెలంగాణలో బెంగాల్ తరహా రాజకీయం సాధ్యమా..?
-
Shreyas Iyer: మళ్లీ అదే తప్పు.. ఎంత చెప్పినా.. ఎవరు చెప్పినా మారని శ్రేయాస్ అయ్యర్ తీరు..
-
T20 Team: సంజూ శాంసన్, తిలక్ వర్మకు దక్కని చోటు.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఎంట్రీ..
-
Harish Rao : రేవంత్ రెడ్డికి హరీష్ రావు కౌంటర్.. అసెంబ్లీలోనే కాదు ఎక్కడైనా చర్చకు సిద్ధం
-
Europe Heatwave: బాబోయ్ ఎండలు.. కరిగిపోతున్న రహదారులు
ట్రెండింగ్
-
Farmer Job Offer: జాబ్ ఆఫర్ చేసిన మహిళా రైతు.. ఉదయం 6 నుంచి 2 గంటల వరకు పని.. టీ, బ్రేక్ఫాస్ట్ ఫ్రీ..
-
Bread Pakoda Recipe: కరకరలాడే స్ట్రీట్ స్టైల్ ‘బ్రెడ్ పకోడా’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Kitchen Tips: ఫ్రిజ్ శబ్దం పెరిగిందా.? టెక్నీషియన్ను పిలవకుండా ఇంట్లోనే ఇలా చేయండి.!
-
Income Tax Returns: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అలెర్ట్.. జూలైలో మిస్ కాకూడని ముఖ్యమైన డెడ్లైన్లు ఇవే.!
-
Spider Control : వర్షాకాలంలో సాలీళ్ల బెడదా.? ఈ సహజమైన స్ప్రేలతో చెక్ పెట్టండి.!