Kolkata doctor murder case: “కంటికి గాయాలు, మెడ ఎముక ఫ్రాక్చర్”.. వైద్యురాలి హత్యాచార ఘటనలో వణికించే నిజాలు..
- కోల్కతా వైద్యురాలి హత్యాచార ఘటనలో విస్తూపోయే నిజాలు..
- దారుణంగా హింసించి చంపినట్లు పోస్టుమార్టం నివేదిక..
- బ్లూటూత్ హెడ్ఫోన్ సాయంతో చిక్కిన నిందితుడు..
- ఉరిశిక్ష విధించేలా చర్యలు తీసుకుంటామన్న మమతా బెనర్జీ..
Kolkata doctor murder case: కోల్కతా ట్రైనీ పీజీ డాక్టర్పై అత్యాచారం, హత్య ఘటన వెస్ట్ బంగాల్ రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఆర్జి కర్ మెడికల్ హాస్పిటల్లో నైట్ డ్యూటీలో విధులు నిర్వహిస్తున్న మహిళా డాక్టర్పై దారుణం జరిగింది. ఈ కేసులో నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. హత్యచేసినట్లు ఒప్పుకున్నట్లు సమాచారం. 31 ఏళ్ల వైద్యురాలి ఘటన ఆ రాష్ట్రంలో పొలిటికల్ దుమారం రేపింది.
ఇదిలా ఉంటే ఆమె పోస్టుమార్టం నివేదికలో విస్తూపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడు ఆమెను దారుణంగా హింసించి హత్య చేసినట్లు తెలుస్తోంది. ఆమె ఒంటిపై అనేక గాయాలు ఉన్నాయి. ఆమె రెండు కళ్లు, నోరు, ప్రైవేట్ భాగాల నుంచి రక్తస్రావం జరిగింది. ముఖంపై గోరుతో రక్కిన గాయాలు ఉన్నాయి. వైద్యురాలి బొడ్డు, పెదవులు, ఎడమకాలు, మెడ, కుడి చేతిలోని ఉంగరపు వేలుపై గాయాలు ఉన్నాయి. ఇది ఖచ్చితంగా లైంగిక వేధింపుల కేసే అని పోలీస్ అధికారి వెల్లడించారు. ఆమె మెడ ఎముక విరిగినట్లు గుర్తించారు. ఆమె గొంతు నులిమి హత్య చేసినట్లు తెలుస్తోంది.
Also Read
Read Also: Divvala Madhuri: దువ్వాడ శ్రీనివాస్, నేను కలిసే ఉంటాం.. డైవర్స్కి కూడా అప్లై చేశాం
ఈ కేసులో ప్రతిపక్ష బీజేపీ, అధికార టీఎంసీ ప్రభుత్వాన్ని ,సీఎం మమతా బెనర్జీని టార్గెట్ చేసింది. ఈ ఘటనలో నేరస్తుడిని శిక్షించేందుకు సిద్ధంగా ఉన్నామని, నిందితుడికి ఉరిశిక్ష పడేలా చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. కేంద్ర ఎజెన్సీలతో దర్యాప్తుకు కూడా సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. బాధితురాలు ఛెస్ట్ మెడిసిన్లో పీజీ చేస్తోంది. సంఘటన జరిగిన సమయంలో నైట్ డ్యూటీలో ఉంది. ఆమె మృతదేహం శుక్రవారం ఆస్పత్రి సెమినార్ హాల్లో లభించింది.
నిందితుడిని గుర్తించేందుకు సీసీకెమెరాలను పరిశీలించిన పోలీసులు అనుమానితుల జాబితాను సిద్ధం చేశారు. సంఘటన స్థలంలో ‘‘బ్లూటూత్’’ హెడ్ఫోన్ దొరికింది. అనుమానితులను విచారణ కోసం పిలిచిన సందర్భంలో నిందితుడి మొబైల్ ఫోన్తో బ్లూటూత్ ఆటొమెటిక్గా కనెక్ట్ అయింది. నిందితుడికి మరణశిక్ష విధించేలా పాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసేందుకు సీఎం మమతా బెనర్జీ ఆదేశాలు ఇచ్చారు. టీఎంపీ ఎంపీ, మమతా మేనల్లుడు అభిషేక్ బెనర్జీ మాట్లాడుతూ.. కేంద్రం ఇలాంటి కేసుల్లో దోషులను కఠినంగా శిక్షించేందుకు ఆర్డినెన్స్ తీసుకురావాలని, దానికి టీఎంసీ మద్దతు ఉంటుందని చెప్పారు. నిందితుడికి ఉరిశిక్ష లేదా ఎన్కౌంటర్ చేయాలని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Jobs: పదో తరగతి అర్హత.. ఆ స్కూల్, కాలేజీల్లో నైట్ వాచ్ ఉమెన్, అసిస్టెంట్ కుక్ పోస్టులకు దరఖాస్తులు..
-
Off The Record : కరీంనగర్ లో కాంగ్రెస్ బలపడటం పెద్ద నేతలకే ఇష్టం లేదా? శత్రువుకు శత్రువు మిత్రుడన్నట్టు రాజకీయం?
-
Story Board : ఒంటరి పోరాటమా.. అంతర్గత వైఫల్యమా? విపక్షాల బలహీనతకు అసలు కారణం రాహులేనా?
-
GST: దేశ చరిత్రలోనే ఆల్ టైమ్ రికార్డ్.. ఏప్రిల్లో భారీగా జీఎస్టీ వసూళ్లు..
-
Ragi Sweet Roti: బామ్మల కాలం నాటి ఆరోగ్య రహస్యం.. నిమిషాల్లో తయారయ్యే రాగి తీపి రొట్టెలు ఇలా సింపుల్గా చేసేయండి!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!