Mango production: ఈ ఏడాది మామిడి పంటకు తిరుగులేదు.. పెరగనున్న దిగుబడి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mango production: ఈ ఏడాది దేశంలో మామిడి ఉత్పత్తి పెరుగుతుందని ఐసీఏఆర్-సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఫర్ సబ్ట్రాపికల్ హార్టికల్చర్ డైరెక్టర్ టీ దామోదరన్ తెలిపారు. మామిడి ఉత్పత్తి 14 శాతం పెరిగి 24 మిలియన్ టన్నులకు చేరుకోవచ్చని చెప్పారు. ఏప్రిల్-మే నెలల్లో వడగాలులు వస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసినప్పటికీ, మామిడి దిగుబడిపై గణనీయమైన ప్రభావం ఉండకపోవచ్చని అన్నారు. మే నెలలో రైతులు నీటిపారుదల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే పండ్లు రాలడాన్ని తగ్గించవచ్చని ఆయన చెప్పారు.
దక్షిణ ద్వీపకల్పం, మధ్య భారతదేశం, తూర్పు భారతదేశం, వాయువ్య భారతదేశలోని చాలా ప్రాంతాల్లో సాధారణం కన్నా ఎక్కువ వడగాలులు సంభవించే అవకాశం ఉంది. మామిడి పంటలో పూత కాలం పండ్ల దిగుబడి ప్రక్రియలో కీలకమైంది. అనుకూల వాతావరణం కారణంగా పుష్పించే ప్రక్రియ ముగిసింది. పరాగ సంపర్కం సాధారణంగా ఉందని, పండ్ల కాత ప్రారంభమైందని, వడగాలుల ప్రభావం ఉండకపోవచ్చని, పరోక్షంగా పంటకు సహాయపడుతాయని దామోదరన్ చెప్పారు.
Also Read
- Fire Break : ఉత్తర్ ప్రదేశ్ ఘజియాబాద్లో భారీ అగ్ని ప్రమాదం
- PM Kisan 23వ విడత: ఖరీఫ్ సీజన్ వేళ రైతులకు కీలక అప్డేట్.. జూన్ 18న రూ.2,000 ఖాతాలో జమ అవుతాయా?
- Narendra Modi: 'జవహర్ లాల్ నెహ్రూ'ను అధిగమించిన నరేంద్ర మోడీ.. అత్యధిక కాలం ప్రధానిగా.!
- Petrol and Diesel Prices: పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతాయా? వాహనదారులకు షాక్ తప్పదా?
Read Also: Sanjay Singh: తీహార్ జైలు నుంచి సంజయ్ సింగ్ విడుదల.. భారీగా స్వాగతం
ఈ ఏడాది మామిడి పంటకు మంచి అవకాశాలు ఉన్నాయి. మొత్తం ఉత్పత్తి 2022-23లో 21 మిలియన్ టన్నుల నుంచి 2023-24కి 24 మిలియన్ టన్నులకు పెరుగుతుందని వెల్లడించారు. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో మామిడి ఉత్పత్తి బాగుంటుందని చెప్పారు. దేశంలోని మొత్తం దిగుబడిలో 50 శాతం వాటాను దక్షిణ భారతదేశం కలిగి ఉంది. గతేడాది వాతావరణ మార్పు కారణంగా దక్షిణాది రాష్ట్రాలు 15 శాతం పంటను నష్టపోయాయి. ఈ ఏడాది మెరుగైన పరిస్థితి ఉండబోతోంది. ప్రపంచవ్యాప్తంగా మామిడిని పండించే ప్రధాన దేశాల్లో భారత్ ఒకటి. మొత్తం ప్రపంచ ఉత్పత్తిలో 42 శాతం వాటాను కలిగి ఉంది.
సాధారణంగా ఉష్ణోగ్రతలు, వడగాలులు ఎక్కువగా ఉన్న సమయంలో తేలికపాటి నీటి పారుదలను అందించాలని, ఫలితంగా నేలలో తేమ ఒత్తిడి తగ్గి పండ్లు రాలిపోవడం ఆగుతుందని దామోదరన్ రైతులకు సూచించారు. ముఖ్యంగా తెగుళ్లపై రైతులు దృష్టి పెట్టాలని చెప్పారు. ముఖ్యంగా త్రిప్స్ కీటకాల నుంచి పంటను రక్షించుకునేందుకు ఇమిడాక్లోప్రిడ్ లీటరు నీటికి 4 మిల్లీలీటర్లు (మిలీ) లేదా థయామెథాక్సమ్ 0.4 గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయవచ్చునని తెలిపారు.
తాజావార్తలు
-
LIC Saral Pension: ఈ ఎల్ఐసీ పాలసీ తెలుసా? ఒక్కసారి ఇన్వెస్ట్ చేస్తే చాలు.. ఆ తర్వాత జీవితాంతం చేతికి రూ.21000!
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
Hitech City Traffic : గంట వర్షం.. 3 గంటల నరకం..! హైదరాబాద్ ఐటీ హబ్ను ముంచేసిన భారీ వర్షం
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
ట్రెండింగ్
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!
-
Ceiling Fan Speed: సీలింగ్ ఫ్యాన్ స్పీడ్ తగ్గిందా.? కారణం ఇదే కావచ్చు.! కొత్తది కొనేముందు ఈ విషయాలు తప్పక చెక్ చేయండి.!
-
WWDCలో పొరపాటున ‘ఫోల్డబుల్ ఐఫోన్’ వివరాలు లీక్ చేసుకున్న Apple.!
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి