Mango production: ఈ ఏడాది మామిడి పంటకు తిరుగులేదు.. పెరగనున్న దిగుబడి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mango production: ఈ ఏడాది దేశంలో మామిడి ఉత్పత్తి పెరుగుతుందని ఐసీఏఆర్-సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఫర్ సబ్ట్రాపికల్ హార్టికల్చర్ డైరెక్టర్ టీ దామోదరన్ తెలిపారు. మామిడి ఉత్పత్తి 14 శాతం పెరిగి 24 మిలియన్ టన్నులకు చేరుకోవచ్చని చెప్పారు. ఏప్రిల్-మే నెలల్లో వడగాలులు వస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసినప్పటికీ, మామిడి దిగుబడిపై గణనీయమైన ప్రభావం ఉండకపోవచ్చని అన్నారు. మే నెలలో రైతులు నీటిపారుదల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే పండ్లు రాలడాన్ని తగ్గించవచ్చని ఆయన చెప్పారు.
దక్షిణ ద్వీపకల్పం, మధ్య భారతదేశం, తూర్పు భారతదేశం, వాయువ్య భారతదేశలోని చాలా ప్రాంతాల్లో సాధారణం కన్నా ఎక్కువ వడగాలులు సంభవించే అవకాశం ఉంది. మామిడి పంటలో పూత కాలం పండ్ల దిగుబడి ప్రక్రియలో కీలకమైంది. అనుకూల వాతావరణం కారణంగా పుష్పించే ప్రక్రియ ముగిసింది. పరాగ సంపర్కం సాధారణంగా ఉందని, పండ్ల కాత ప్రారంభమైందని, వడగాలుల ప్రభావం ఉండకపోవచ్చని, పరోక్షంగా పంటకు సహాయపడుతాయని దామోదరన్ చెప్పారు.
Also Read
- PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
- Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
- Actor Vishal: ‘‘ఆయనకు ఏం తెలుసని మంత్రి పదవి ఇచ్చారు..?’’ సీఎం విజయ్పై విశాల్ ఘాటు వ్యాఖ్యలు..
- Chickens Die: ఘోర ఘటన.. 3 గంటల్లో 5,300 కోళ్లు మృతి.. కారణం ఏంటంటే..
Read Also: Sanjay Singh: తీహార్ జైలు నుంచి సంజయ్ సింగ్ విడుదల.. భారీగా స్వాగతం
ఈ ఏడాది మామిడి పంటకు మంచి అవకాశాలు ఉన్నాయి. మొత్తం ఉత్పత్తి 2022-23లో 21 మిలియన్ టన్నుల నుంచి 2023-24కి 24 మిలియన్ టన్నులకు పెరుగుతుందని వెల్లడించారు. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో మామిడి ఉత్పత్తి బాగుంటుందని చెప్పారు. దేశంలోని మొత్తం దిగుబడిలో 50 శాతం వాటాను దక్షిణ భారతదేశం కలిగి ఉంది. గతేడాది వాతావరణ మార్పు కారణంగా దక్షిణాది రాష్ట్రాలు 15 శాతం పంటను నష్టపోయాయి. ఈ ఏడాది మెరుగైన పరిస్థితి ఉండబోతోంది. ప్రపంచవ్యాప్తంగా మామిడిని పండించే ప్రధాన దేశాల్లో భారత్ ఒకటి. మొత్తం ప్రపంచ ఉత్పత్తిలో 42 శాతం వాటాను కలిగి ఉంది.
సాధారణంగా ఉష్ణోగ్రతలు, వడగాలులు ఎక్కువగా ఉన్న సమయంలో తేలికపాటి నీటి పారుదలను అందించాలని, ఫలితంగా నేలలో తేమ ఒత్తిడి తగ్గి పండ్లు రాలిపోవడం ఆగుతుందని దామోదరన్ రైతులకు సూచించారు. ముఖ్యంగా తెగుళ్లపై రైతులు దృష్టి పెట్టాలని చెప్పారు. ముఖ్యంగా త్రిప్స్ కీటకాల నుంచి పంటను రక్షించుకునేందుకు ఇమిడాక్లోప్రిడ్ లీటరు నీటికి 4 మిల్లీలీటర్లు (మిలీ) లేదా థయామెథాక్సమ్ 0.4 గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయవచ్చునని తెలిపారు.
తాజావార్తలు
-
KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
-
PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
-
Ragi Mixture: సాయంత్రం స్నాక్స్లోకి క్రిస్పీ ‘రాగి మిక్సర్’.. సింపుల్గా హెల్తీగా ఇంట్లోనే ఇలా చేసుకోండి!
-
Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
-
Donald Trump: అమెరికా అధ్యక్షుడికి షాక్.. రూల్స్ బ్రేక్ చేశారంటూ ట్రంప్కు ఫైన్ వేసిన అధికారులు! అసలేం జరిగిందంటే..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..