Mango production: ఈ ఏడాది మామిడి పంటకు తిరుగులేదు.. పెరగనున్న దిగుబడి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mango production: ఈ ఏడాది దేశంలో మామిడి ఉత్పత్తి పెరుగుతుందని ఐసీఏఆర్-సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఫర్ సబ్ట్రాపికల్ హార్టికల్చర్ డైరెక్టర్ టీ దామోదరన్ తెలిపారు. మామిడి ఉత్పత్తి 14 శాతం పెరిగి 24 మిలియన్ టన్నులకు చేరుకోవచ్చని చెప్పారు. ఏప్రిల్-మే నెలల్లో వడగాలులు వస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసినప్పటికీ, మామిడి దిగుబడిపై గణనీయమైన ప్రభావం ఉండకపోవచ్చని అన్నారు. మే నెలలో రైతులు నీటిపారుదల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే పండ్లు రాలడాన్ని తగ్గించవచ్చని ఆయన చెప్పారు.
దక్షిణ ద్వీపకల్పం, మధ్య భారతదేశం, తూర్పు భారతదేశం, వాయువ్య భారతదేశలోని చాలా ప్రాంతాల్లో సాధారణం కన్నా ఎక్కువ వడగాలులు సంభవించే అవకాశం ఉంది. మామిడి పంటలో పూత కాలం పండ్ల దిగుబడి ప్రక్రియలో కీలకమైంది. అనుకూల వాతావరణం కారణంగా పుష్పించే ప్రక్రియ ముగిసింది. పరాగ సంపర్కం సాధారణంగా ఉందని, పండ్ల కాత ప్రారంభమైందని, వడగాలుల ప్రభావం ఉండకపోవచ్చని, పరోక్షంగా పంటకు సహాయపడుతాయని దామోదరన్ చెప్పారు.
Also Read
- Boy Living in Pond: చెరువే ఇల్లు.. నీటిలోకి దిగితేనే ఉపశమనం! ఐదేళ్లుగా ఇదే జీవితం.. 16 ఏళ్ల బాలుడి జీవితంలో మిస్టరీ ఏంటి?
- IRCTC Sri Lanka Ramayana Yatra 2026: రామాయణ పుణ్యక్షేత్రాలతో శ్రీలంక టూర్.. విమానం, హోటల్, భోజనం అన్నీ ప్యాకేజీలోనే!
- VB-G RAM G Scheme: వీబీ-జీ రామ్ జీ పథకం.. తొలి నెలలోనే 50% తగ్గిన గ్రామీణ ఉపాధి..!
- Maggi Noodles Case: మ్యాగీ లీడ్ వివాదానికి మరో ట్విస్ట్.. కేసులు కొట్టేసిన ఢిల్లీ హైకోర్టు
Read Also: Sanjay Singh: తీహార్ జైలు నుంచి సంజయ్ సింగ్ విడుదల.. భారీగా స్వాగతం
ఈ ఏడాది మామిడి పంటకు మంచి అవకాశాలు ఉన్నాయి. మొత్తం ఉత్పత్తి 2022-23లో 21 మిలియన్ టన్నుల నుంచి 2023-24కి 24 మిలియన్ టన్నులకు పెరుగుతుందని వెల్లడించారు. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో మామిడి ఉత్పత్తి బాగుంటుందని చెప్పారు. దేశంలోని మొత్తం దిగుబడిలో 50 శాతం వాటాను దక్షిణ భారతదేశం కలిగి ఉంది. గతేడాది వాతావరణ మార్పు కారణంగా దక్షిణాది రాష్ట్రాలు 15 శాతం పంటను నష్టపోయాయి. ఈ ఏడాది మెరుగైన పరిస్థితి ఉండబోతోంది. ప్రపంచవ్యాప్తంగా మామిడిని పండించే ప్రధాన దేశాల్లో భారత్ ఒకటి. మొత్తం ప్రపంచ ఉత్పత్తిలో 42 శాతం వాటాను కలిగి ఉంది.
సాధారణంగా ఉష్ణోగ్రతలు, వడగాలులు ఎక్కువగా ఉన్న సమయంలో తేలికపాటి నీటి పారుదలను అందించాలని, ఫలితంగా నేలలో తేమ ఒత్తిడి తగ్గి పండ్లు రాలిపోవడం ఆగుతుందని దామోదరన్ రైతులకు సూచించారు. ముఖ్యంగా తెగుళ్లపై రైతులు దృష్టి పెట్టాలని చెప్పారు. ముఖ్యంగా త్రిప్స్ కీటకాల నుంచి పంటను రక్షించుకునేందుకు ఇమిడాక్లోప్రిడ్ లీటరు నీటికి 4 మిల్లీలీటర్లు (మిలీ) లేదా థయామెథాక్సమ్ 0.4 గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయవచ్చునని తెలిపారు.
తాజావార్తలు
-
iPhone 18 Fold: iPhone 18 Foldలో 12GB RAM, A20 Pro చిప్? 5,800mAh బ్యాటరీతో వస్తుందంటూ లీకులు
-
Minister TG Bharath: మంత్రులపై నిఘా పెట్టేవారు.. నేరస్థులపై ఎందుకు పెట్టరు?: టీజీ భరత్ సంచలన వ్యాఖ్యలు
-
Boy Living in Pond: చెరువే ఇల్లు.. నీటిలోకి దిగితేనే ఉపశమనం! ఐదేళ్లుగా ఇదే జీవితం.. 16 ఏళ్ల బాలుడి జీవితంలో మిస్టరీ ఏంటి?
-
Korean Kanakaraju Collections: వరుణ్ తేజ్కు బ్రేక్ఈవెన్.. 3 రోజుల్లోనే 37 కోట్లు కొల్లగొట్టిన ‘కొరియన్ కనకరాజు’!
-
Akhil Akkineni : పవన్ సాదినేని దర్శకత్వంలో అఖిల్ అక్కినేని
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!