PM Modi: వారణాసిలో మోడీని ఓడించేందుకు ఇండియా కూటమి బిగ్ ప్లాన్.. పోటీలో ఉండేది వీళ్లేనా.?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: లోక్సభ ఎన్నికలకు మరో నాలుగు నెలలు మాత్రమే సమయం ఉంది. ఈసారి ఎలాగైనా బీజేపీని ఓడించి, ప్రధాని మోడీని గద్దె దించాలని ఇండియా కూటమి భావిస్తోంది. ఇందుకు అనుగుణంగానే భారీ ప్లాన్తో కూటమి కార్యచరణ ప్రారంభించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ప్రధాని నరేంద్రమోడీనే టార్గెట్గా వారణాసిలో ఆయనను ఓడించేందుకు రాజకీయ ప్రముఖుల్ని బరిలో దించేందుకు కూటమి భావిస్తు్న్నట్లుగా తెలుస్తోంది. మంగళవారం జరిగిన ఇండియా కూటమి సమావేశంలో ఈ మేరకు చర్చ జరిగినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
వారణాసిలో 1991 నుంచి బీజేపీకే ఓటర్లు పట్టం కట్టారు. ఒక్క 2004లో తప్పితే అన్ని సార్లు బీజేపీనే గెలిచింది. ఇక 2014, 2019 ఎన్నికల్లో వారణాసి నుంచి మోడీ పోటీ చేసి బంపర్ మెజారిటీతో విజయం సాధించారు. అయితే ఈ సారి 2024 ఎన్నికల్లో ప్రధానిని వారణాసి నుంచి ఓడించేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి.
Also Read
- Natural gas: భారత్కు జాక్పాట్.. అండమాన్లో గ్యాస్ నిల్వలు..
- Putin: విదేశాల ఒత్తిడికి భారత్ ఎన్నడూ లొంగలేదు.. ట్రంప్కు పుతిన్ స్ట్రాంగ్ మెసేజ్..
- India-China: భారత్ జీడీపీ చైనాను మించిపోనుందా? అంతర్జాతీయ సంస్థ అంచనాలు ఇవే!
- TGPSC New Notification: నిరుద్యోగులకు భారీ శుభవార్త.. మరో నోటిఫికేషన్ విడుదల చేసిన TGPSC..
Read Also: Lalu Yadav: “ల్యాండ్ ఫర్ జాబ్” స్కామ్.. లాలూ, తేజస్వీలకు ఈడీ సమన్లు..
అయితే, ప్రధాని మోడీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ వాద్రా, బీహార్ ముఖ్యమంత్రి, జేడీయూ అధినేత నితీష్ కుమార్లను పోటీలోకి దింపడానికి పరిశీలిస్తున్నట్లు సమచారం. గతంలో బీజేపీకి మిత్రుడిగా ఉన్న నితీష్ కుమార్ ఎన్డీయే నుంచి వైదొలిగి, ఇండియా కూటమిలో చేరారు. కూటమి తరుపున ప్రధాని రేసుల్లో వినిపిస్తున్న పేర్లలో నితీష్ కుమార్ పేరు కూడా ఒకటి. తనకు ప్రధాని కావాలనే ఆశ లేదని ఇతను పలుమార్లు చెప్పడం గమనార్హం.
ఇదిలా ఉంటే కాంగ్రెస్ నుంచి 2019లోనే వారణాసి నుంచి ప్రియాంకాగాంధీ పోటీ చేస్తారని అంతా అనుకున్నారు, కానీ చివరకు మరోసారి కాంగ్రెస్ అజయ్ రాయ్ని రంగంలోకి దించింది. ప్రధాని కన్నా 5 లక్షల ఓట్ల తేడాతో మూడోస్థానంలో నిలిచారు. అయితే ఈసారి ఆమెను బరిలోకి దించే అవకాశం కనిపిస్తోంది.
ఇదిలా ఉంటే ఇండియా కూటమి మూడో వ్యక్తి అరవింద్ కేజ్రీవాల్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. 2014లో ప్రధాని మోడీపై వారణాసి నుంచి ఆప్ తరుపున కేజ్రీవాల్ బరిలో నిలిచి 2 లక్షల ఓట్లు, దాదాపుగా 20 శాతం ఓట్లతో రెండోస్థానంలో నిలిచారు. ఇదిలా ఉంటే ఇండియా కూటమి తరుపున కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గేని ప్రధాని అభ్యర్థిగా టీఎంసీ చీఫ్, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రతిపాదించగా.. కేజ్రీవాల్ సపోర్ట్ చేశారు. అయితే ముందు ఎన్నికల్లో గెలవాలని ఖర్గే అంటున్నారు.
తాజావార్తలు
-
Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
-
Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్గా సర్పంచ్ సాబ్..
-
Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
-
NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
-
Natural gas: భారత్కు జాక్పాట్.. అండమాన్లో గ్యాస్ నిల్వలు..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!