PM Modi: భారత్ శాంతికి ప్రయత్నిస్తే.. పాకిస్తాన్ ప్రతీసారి ద్రోహం చేసింది..
- భారత్ శాంతి ప్రయత్నానికి పాకిస్తాన్ ద్రోహం..
- పాక్కి జ్ఞానం రావాలి, శాంతిని ఎంచుకోవాలి..
- లెక్స్ ఫ్రిడ్మాన్ ఇంటర్వ్యూలో పీఎం మోడీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: పాకిస్తాన్తో శాంతిని నెలకొల్పడానికి చేసిన ప్రతి ప్రయత్నంలో భారత్కి ద్రోహం, శత్రుత్వం ఎదురైందని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. అమెరికన్ పాడ్కాస్టర్ లెక్స్ ఫ్రిడ్మాన్తో జరిగిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 2014లో తాను మొదటిసారిగా ప్రమాణస్వీకారం చేసే సమయంలో పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ని ప్రత్యేకంగా ఆహ్వానించిన విషయాన్ని గుర్తు చేశారు. దైపాక్షిక సంబంధాలను మెరుగుపరచడానికి ఇస్లామాబాద్కి జ్ఞానం రావాలని మోడీ ఆశాభావం వ్యక్తం చేశారు.
Read Also: Mohammed Shami: షమీ కూతురిని టార్గెట్ చేసిన మత పెద్దలు.. ఈసారి ఎందుకంటే..?
Also Read
- UP: అత్తగారి అంత్యక్రియల్లో ఘోరం.. నదిలో చేతులు కడుక్కుంటుండగా భారీ మొసలి హఠాత్తుగా..!
- Cockroach Janta Party: "కాక్రోచ్ జనతా పార్టీ" ఫాలోవర్లు అంతా పాకిస్తాన్, బంగ్లాదేశ్ వాళ్లేనా..?
- BJP: 20 ఏళ్లు బీజేపీదే హవా, కాంగ్రెస్ కష్టమే: యాక్సిస్ మై ఇండియా చీఫ్..
- Job Notification: నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. 12,256 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల..
‘‘శాంతిని పెంపొదించే ప్రతీ ప్రయత్నానికి శత్రుత్వం, ద్రోహం ఎదురైంది. వారికి జ్ఞానం రావాలి. వారు శాంతి మార్గాన్ని ఎంచుకుంటానని మేము హృదయపూర్వకంగా ఆశిస్తున్నాము’’ అని ప్రధాని అన్నారు. పాక్ ప్రజలు శాంతిని కోరుకుంటున్నారని తాను నమ్ముతున్నానని మోడీ అన్నారు. పాక్ ప్రజలు నిత్యం కలహాలు, అశాంతి, నిరంతర భయాల్లో జీవించడంలో అలసిపోయారు, అక్కడి అమాయకపు పిల్లలు కూడా చంపబడ్డారని, లెక్కలేనన్ని జీవితాలు నాశనమయ్యాయని ప్రధాని అన్నారు.
‘‘ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి తాను చేసిన తొలి ప్రయత్నం సద్భావనకు నిదర్శనమని ప్రధానమంత్రి అన్నారు. దశాబ్దాలలో ఎన్నడూ లేని విధంగా ఇది దౌత్యపరమైన చర్య. విదేశాంగ విధానం పట్ల నా విధానాన్ని ఒకప్పుడు ప్రశ్నించిన వ్యక్తులు నేను అన్ని సార్క్ దేశాధినేతలను ఆహ్వానించానని తెలుసుకున్నప్పుడు ఆశ్చర్యపోయారు. అప్పటి రాష్ట్రపత్రి ప్రణబ్ ముఖర్జీ ఈ చారిత్రాత్మక విషయాన్ని తన జ్ఞాపకాలలో అందంగా చిత్రీకరించారు’’ అని పీఎం మోడీ చెప్పారు. భారత విదేశాంగ విధానం ఎంత స్పష్టంగా నమ్మకంగా మారిందనే దానికి ఇది నిదర్శనమని, ఇది శాంతి, సారస్యానికి భారత్ చూపించే నిబద్ధత అని ప్రపంచాన్ని సందేశమిచ్చామని చెప్పారు.
తాజావార్తలు
-
GT vs CSK : గుజరాత్ టైటాన్స్ ఘన విజయం.. టాప్లో GT.. CSK అవుట్..!
-
OTR : TPCC కి కొత్త హంగులు రాబోతున్నాయా..?
-
Maoists Surrender : జార్ఖండ్లో మావోయిస్టులకు భారీ దెబ్బ.. ఒకేసారి 27 మంది లొంగుబాటు..!
-
Storyboard : ఏపీలో కూటమి పాలన ఎలా ఉంది..? సూపర్ సిక్స్ హామీల స్థితిగతులేంటి..?
-
Off The Record : కోనసీమ జిల్లా వైసీపీలో అసంతృప్తి రాగాలు
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!