Amit Shah: పీఓకేను ఏ శక్తి లాక్కోలేదు.. ప్రతిపక్ష నేతల కామెంట్స్పై ఫైర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amit Shah: పాకిస్తాన్ ఆక్రమిక కాశ్మీర్(పీఓకే) గురించి ప్రతిపక్ష నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై కేంద్ర హోం మంత్రి ఫైర్ అయ్యారు. పీఓకేలోని ప్రతీ అంగుళం భారత్కే చెందుతుందని, దానిని ఏ శక్తి లాక్కోలేదని ఆయన శుక్రవారం అన్నారు. ‘‘పాకిస్తాన్ వద్ద అణుబాంబు ఉందని, దానిని గౌవరించాలని కాంగ్రెస్ నేత మణిశంకర్ అయ్యర్ చెబుతున్నారు, కొద్ది రోజుల క్రితం ఇండియా కూటమి నాయకుడు ఫరూఖ్ అబ్దుల్లా మాట్లాడుతూ.. పాకిస్తాన్లో అణుబాంబు ఉందని, పీఓకే గురించి మాట్లాడవద్దని అన్నారు.’’ ఈ వ్యాఖ్యలపై అమిత్ షా మాట్లాడుతూ.. నేను ఇండియా కూటమి నేతలు, కాంగ్రెస్ నేతలకు పీఓకే భారత్కి చెందినదని చెప్పాలని అనుకుంటున్నానని అన్నారు.
Read Also: Fatehpur Sikri Dargah: ఫతేపూర్ సిక్రీ దర్గా కింద కామాఖ్య దేవత ఆలయం ఉంది.. ఆగ్రా కోర్టులో కేసు..
Also Read
- Survey: అమెరికా, శ్రీలంక నుంచి పాక్ వరకు.. భారత్ను ప్రేమించేది ఎవరు? ద్వేషించేది ఎవరు? సర్వేలో సంచలన నిజాలు..
- Shridhar Chillal: మూడు అంతస్తుల భవనం కంటే పొడవైన గోర్లు.. గిన్నిస్ బుక్ లో స్థానం.!
- Independence Day 2026: ఇంతకీ ఇది 80వ స్వాతంత్య్ర దినోత్సవమా? లేక 79వదా? ఫుల్ క్లారిటీ ఇదిగో..
- Karur Stampede: ప్రభుత్వ ఉద్యోగాలపై కీలక తీర్పు.. కరూర్ బాధితులకు సుప్రీంకోర్టులో భారీ ఊరట
పీఓకేని భారత్కి చెందినదని, ఏ శక్తి దాన్ని లాక్కోలేదని శుక్రవారం జార్ఖండ్లో జరిగిన ఎన్నికల ర్యాలీలో అమిత్ షా అన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఏం జరిగిందో తెలియడం లేదని, పీఓకే భారత్లో భాగమని పార్లమెంట్లో ఏకగ్రీవ తీర్మానం చేసిన తర్వాత, ఇప్పుడు పీఓకేపై ప్రశ్నలు గుప్పిస్తున్నారని, అణుబాంబుల గురించి ప్రస్తావిస్తున్నారని మండిపడ్డారు. ఈ లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి ఓటేయాలని, జార్ఖండ్లో జేఎంఎం-కాంగ్రెస్ కూటమి అవినీతిలో మునిగిపోయిందని ఆయన ఆరోపించారు.
జేఎంఎం కూటమి భూ కుంభకోణం, మైనింగ్ స్కామ్, ఉపాధిహామీ స్కామ్, మద్యం కుంభకోణంలో మునిగిపోయిందని, పేద ప్రజల సొమ్ముని దోచుకునేందుకు వారిని బీజేపీ అనుమతించబోదని అమిత్ షా అన్నారు. జేఎంఎం-కాంగ్రెస్ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నాయని ఆరోపించారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి కాంగ్రెస్ 70 ఏళ్లు అడ్డంకులు సృష్టించిందని, అయితే ప్రధాని మోడీ ఐదేళ్లలో గుడి కట్టారని, రాహుల్ బాబా తన ఓటు బ్యాంకుకు భయపడి రామమందిర శంకుస్థాపనకు రాలేదని అన్నారు. కాంగ్రెస్ హయాంలో ఏ గిరిజనుడిని కూడా రాష్ట్రపతిని ఎందుకు చేయలేదని ప్రశ్నించారు.
తాజావార్తలు
-
Amaravati Land Pooling Case: చంద్రబాబుకు సుప్రీంకోర్టులో బిగ్ రిలీఫ్.. రాజకీయ పోరాటాలు కోర్టులో వద్దు..!
-
NBK112 : బాలయ్య – కొరటాలశివ సినిమా ఆగిందా.. పుకార్లలో వాస్తవం ఎంత?
-
Nagarjuna Akkineni: నేను సైబర్ క్రైమ్ బాధితుడినే.. నాలుగేళ్ల క్రితం మోసపోయా.. ఆసక్తికర విషయాలు చెప్పిన కింగ్!
-
Ampere Magnus G Max: 30కి పైగా కొత్త ఫీచర్లతో అప్డేట్ అయిన Ampere Magnus G Max.. 142km రేంజ్, ధర ఎంతంటే?
-
Survey: అమెరికా, శ్రీలంక నుంచి పాక్ వరకు.. భారత్ను ప్రేమించేది ఎవరు? ద్వేషించేది ఎవరు? సర్వేలో సంచలన నిజాలు..
ట్రెండింగ్
-
Shridhar Chillal: మూడు అంతస్తుల భవనం కంటే పొడవైన గోర్లు.. గిన్నిస్ బుక్ లో స్థానం.!
-
Income Tax Refund 2026: ఐటీఆర్ రీఫండ్ ఇంకా రాలేదా?.. వెంటనే ఈ 3 అంశాలు సరిచూసుకోండి..
-
Sumith Fernando Dies: టీమిండియాతో మొదటి టెస్ట్ ముందు.. శ్రీలంక క్రికెట్లో పెను విషాదం!
-
Indoor Plants: ఒక్క గ్లాస్ నీటితో ఇంట్లో గ్రీన్ డెకరేషన్.. ఈ మొక్కలను ఇలా పెంచండి!
-
Termite-Proof Furniture: చెదల బెడదకు చెక్.. చెక్కకు బదులుగా ఈ మెటీరియల్స్ ఎంచుకోండంతే.!