Amit Shah: పీఓకేను ఏ శక్తి లాక్కోలేదు.. ప్రతిపక్ష నేతల కామెంట్స్పై ఫైర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amit Shah: పాకిస్తాన్ ఆక్రమిక కాశ్మీర్(పీఓకే) గురించి ప్రతిపక్ష నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై కేంద్ర హోం మంత్రి ఫైర్ అయ్యారు. పీఓకేలోని ప్రతీ అంగుళం భారత్కే చెందుతుందని, దానిని ఏ శక్తి లాక్కోలేదని ఆయన శుక్రవారం అన్నారు. ‘‘పాకిస్తాన్ వద్ద అణుబాంబు ఉందని, దానిని గౌవరించాలని కాంగ్రెస్ నేత మణిశంకర్ అయ్యర్ చెబుతున్నారు, కొద్ది రోజుల క్రితం ఇండియా కూటమి నాయకుడు ఫరూఖ్ అబ్దుల్లా మాట్లాడుతూ.. పాకిస్తాన్లో అణుబాంబు ఉందని, పీఓకే గురించి మాట్లాడవద్దని అన్నారు.’’ ఈ వ్యాఖ్యలపై అమిత్ షా మాట్లాడుతూ.. నేను ఇండియా కూటమి నేతలు, కాంగ్రెస్ నేతలకు పీఓకే భారత్కి చెందినదని చెప్పాలని అనుకుంటున్నానని అన్నారు.
Read Also: Fatehpur Sikri Dargah: ఫతేపూర్ సిక్రీ దర్గా కింద కామాఖ్య దేవత ఆలయం ఉంది.. ఆగ్రా కోర్టులో కేసు..
Also Read
- Viral Video: ఛీ.. ఛీ.. ఇంత దారుణంగా ఉన్నారేంట్రా బాబు.. భోజనం చేస్తున్న వారి మధ్యే మూత్ర విసర్జన మహిళ..
- Ketan Agarwal Case: కేతన్ హత్యకు ముందు, తర్వాత చాట్స్ డిలీట్.. సియా-చేతన్ ఫోన్లలో కీలక ఆధారాలు
- Ketan Agarwal Case: మద్యం మత్తులో సియా గోయల్.. వీడియో వైరల్
- Congress: కాంగ్రెస్లో భారీ ప్రక్షాళన.. యూపీతో సహా కీలక రాష్ట్రాల ఇన్ఛార్జ్ల మార్పు! కారణం ఇదేనా
పీఓకేని భారత్కి చెందినదని, ఏ శక్తి దాన్ని లాక్కోలేదని శుక్రవారం జార్ఖండ్లో జరిగిన ఎన్నికల ర్యాలీలో అమిత్ షా అన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఏం జరిగిందో తెలియడం లేదని, పీఓకే భారత్లో భాగమని పార్లమెంట్లో ఏకగ్రీవ తీర్మానం చేసిన తర్వాత, ఇప్పుడు పీఓకేపై ప్రశ్నలు గుప్పిస్తున్నారని, అణుబాంబుల గురించి ప్రస్తావిస్తున్నారని మండిపడ్డారు. ఈ లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి ఓటేయాలని, జార్ఖండ్లో జేఎంఎం-కాంగ్రెస్ కూటమి అవినీతిలో మునిగిపోయిందని ఆయన ఆరోపించారు.
జేఎంఎం కూటమి భూ కుంభకోణం, మైనింగ్ స్కామ్, ఉపాధిహామీ స్కామ్, మద్యం కుంభకోణంలో మునిగిపోయిందని, పేద ప్రజల సొమ్ముని దోచుకునేందుకు వారిని బీజేపీ అనుమతించబోదని అమిత్ షా అన్నారు. జేఎంఎం-కాంగ్రెస్ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నాయని ఆరోపించారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి కాంగ్రెస్ 70 ఏళ్లు అడ్డంకులు సృష్టించిందని, అయితే ప్రధాని మోడీ ఐదేళ్లలో గుడి కట్టారని, రాహుల్ బాబా తన ఓటు బ్యాంకుకు భయపడి రామమందిర శంకుస్థాపనకు రాలేదని అన్నారు. కాంగ్రెస్ హయాంలో ఏ గిరిజనుడిని కూడా రాష్ట్రపతిని ఎందుకు చేయలేదని ప్రశ్నించారు.
తాజావార్తలు
-
Chicken and Egg Prices: నాన్వెజ్ ప్రియులకు ధరల షాక్.. భారీగా పెరిగిన చికెన్, గుడ్ల ధరలు
-
Samantha : సమంత వర్సెస్ శోభితా-చైతూ.. విడిపోయినా ఆగని సోషల్ మీడియా వార్!
-
Rahul Dev: భార్య మరణంతో కుప్పకూలిపోయా.. కొడుకే నా జీవితాన్ని మార్చేశాడు: రాహుల్ దేవ్
-
Bhagirath Choudhary: మంత్రే లబ్ధిదారుడు.. సొంత మంత్రిత్వ శాఖ పథకం నుంచి రూ.99 లక్షల సబ్సిడీ..
-
Herbal Hair Care: షాంపూలు రాకముందు జుట్టు మెరిసేలా ఉంచిన సహజ చిట్కాలు ఇవే..
ట్రెండింగ్
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇంత దారుణంగా ఉన్నారేంట్రా బాబు.. భోజనం చేస్తున్న వారి మధ్యే మూత్ర విసర్జన మహిళ..
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!