Fatehpur Sikri Dargah: ఫతేపూర్ సిక్రీ దర్గా కింద కామాఖ్య దేవత ఆలయం ఉంది.. ఆగ్రా కోర్టులో కేసు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fatehpur Sikri Dargah: ఉత్తర్ ప్రదేశ్లోని ప్రసిద్ధ ఫతేపూర్ సిక్రీ దర్గా కింద కామాఖ్య మాత ఆలయం ఉందని ఓ న్యాయవాది కోర్టులో కేసు ఫైల్ చేశారు. లాయర్ అజయ్ ప్రతాప్ సింగ్ వాదనల్ని విచారించేందుకు ఆగ్రాలోని సివిల్ కోర్టు అంగీకరించింది. ఫతేపూర్ సిక్రీలోని సలీం చిష్టి దర్గాను కామాఖ్య దేవత ఆలయంగా పేర్కొన్నాడు. పక్కనే ఉన్న మసీదు ఆలయ సమూదాయంలో భాగమని చెప్పారు. ప్రస్తుతం ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా(ఏఎస్ఐ) పరిధఇలో ఉన్న వివాదాస్పద ఆస్తి వాస్తవానికి కామాఖ్య దేవి గర్భగుడి అని అతను చెప్పారు.
ఫతేపూర్ సిక్రీని మొఘల్ రాజు అక్బర్ స్థాపించాడనే విషయాన్ని కూడా అతను సవాల్ చేశాడు. విజయపూర్ సిక్రీ అని కూడా పిలువబడే సిక్రీకి సంబంధించిన ప్రస్తావనలు బాబర్నామాలో కనిపిస్తాయని ఆయన పేర్కొన్నారు. దీంతో పాటు న్యాయవాది పురావస్తు ఆధారాలను ప్రస్తావించారు. మాజీ ఆర్కియాలజిస్ట్ సూపరింటెండెంట్ డీజీ శర్మ తవ్వకాలను గురించి ప్రస్తావిస్తూ.. 1000 A.D నాటి కాలానికి చెందిన హిందూ, జైన కళాఖండాలని డీజీ శర్మ చెప్పినట్లు వెల్లడించారు. బ్రిటిష్ అధికారి ఇ.బి. హోవెల్ వివాదాస్పద ప్రాపర్టీలోని స్తంభాలు, పైకప్పు హిందూ శిల్పంగా వర్ణించారని వెల్లడించారు. అంతే కాకుండా ఖన్వా యుద్ధ సమయంలో సిక్రీ రాజు రామ్ ధామ్ దేవ్ కామాఖ్య దేవి విగ్రహాన్ని సురక్షితంగా ఘాజీపూర్కి తరలించాడని చెప్పారు.
Also Read
- MEA: కరాచీ దాడిని భారత్పై నెట్టొద్దు.. పాక్పై ఘాటు వ్యాఖ్యలు..
- Ketan Agarwal Murder Case: కేతన్ హత్యలో పట్టుబడకుండా 10 గంటల మాస్టర్ ప్లాన్.. చివరకు అదే పట్టించింది!
- Sharmistha Mukherjee: "రాజకీయం పార్ట్ టైమ్ కాదు".. రాహుల్ గాంధీపై ప్రణబ్ కుమార్తె ఘాటు విమర్శలు..
- PM Modi: మోదీకి మరో అంతర్జాతీయ గౌరవం.. సీషెల్స్ నుంచి అత్యున్నత అవార్డు
Read Also: Team India: టీ20 వరల్డ్ కప్కు ఎంపికైన ఆటగాళ్లకు చాలా అనుభవం ఉంది.. విశ్వాసం వ్యక్తం చేసిన జైషా
న్యాయవాది అజయ్ ప్రతాప్ సింగ్ మాట్లాడుతూ.. చట్టప్రకారం,ఒక నిర్మాణాన్ని ఆలయంగా స్థాపించిన తర్వాత దాని స్వభావాన్ని మార్చలేమని చెప్పారు. ఈ కేసును సివిల్ కోర్టులో ప్రవేశపెట్టగా, న్యాయమూర్తి మృత్యుంజయ్ శ్రీవాస్తవ నోటీసులు జారీ చేయాలని ఆదేుశించారు. జామా మసీదు మెట్ల కింద శ్రీకృష్ణుడి విగ్రహాన్ని పాతిపెట్టారంటూ న్యాయవాది గతంలో కోర్టులో కేసు వేశారు. ఉత్తర్ ప్రదేశ్ సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డు, దర్గా సలీం చిస్తీ, జామా మసీదు నిర్వహణ కమిటీలు దీంట్లో ప్రతివాదులుగా ఉన్నారు. ఆస్తాన్ మాతా కామాఖ్య, ఆర్య సంస్కృతి పరిరక్షణ ట్రస్ట్, యోగేశ్వర్ శ్రీ కృష్ణ కల్చరల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ట్రస్ట్, క్షత్రియ శక్తిపీఠ్ వికాస్ ట్రస్ట్, న్యాయవాది అజయ్ ప్రతాప్ సింగ్ ఈ కేసులో వాదిదారులుగా ఉన్నారు.
తాజావార్తలు
-
Shreyas Iyer: ఓటమికి కారణాలు ఇవే.. తప్పులను నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్ అయ్యర్..
-
Harmanpreet Kaur: ఆ తప్పే మా కొంపముంచింది.. ప్రతీ సారి ఇలానే జరుగుతోంది.. భావోద్వేగానికి లోనైన కెప్టెన్..
-
CM Chandrababu : ఐదు రోజుల సీఎం టూర్.. వరుసగా భారీ కార్యక్రమాలు
-
IND Vs IRE: ప్రపంచ ఛాంపియన్ను మట్టికరిపించిన ఐర్లాండ్.. సిరీస్ కైవసం..
-
Nimmala Ramanaidu : జగన్వి అన్నీ క్రెడిట్ చోరీ ముచ్చట్లే.. వెలిగొండను పూర్తి చేసేది చంద్రబాబే
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!