Yogi Adityanath: ‘‘నెహ్రూ అంబేద్కర్కి వ్యతిరేకంగా ప్రచారం చేశాడు’’..కాంగ్రెస్పై సీఎం యోగి ఫైర్..
- అంబేద్కర్కి వ్యతిరేకంగా నెహ్రూ ప్రచారం చేశారు..
- కాంగ్రెస్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం యోగి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Yogi Adityanath: భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ని కాంగ్రెస్ పదేపదే అవమానించిందని, ఆయన మరణానంతరం ఆయన వారసత్వాన్ని అణగదొక్కిందని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ మంగళవారం విమర్శించారు. రాజ్యాంగ ముసాయిదా కమిటీలో అంబేద్కర్ని చేర్చడానికి జవహర్ లాల్ నెహ్రూ వ్యతిరేకించారని యోగి అన్నారు. గత వారం రాజ్యసభలో అమిత్ షా అంబేద్కర్పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని కాంగ్రెస్ ఆరోపిస్తున్న తరుణంలో యోగి నుంచి ఈ వ్యాఖ్యలు వచ్చాయి.
Read Also: Jagdeep Dhankhar: ‘‘బైపాస్ సర్జరీకి కూరగాయల కత్తిని వాడకూడదు’’.. ఉపరాష్ట్రపతి కీలక వ్యాఖ్యలు..
Also Read
- NEET UG 2026: మే 3న నీట్ పరీక్ష, మే 12న రద్దు.. అసలు ఈ 10 రోజుల్లో ఏం జరిగింది? పూర్తి టైమ్లైన్ ఇదే..
- Udhayanidhi Stalin: అధికారం పోయినా మారని తీరు! సనాతన ధర్మంపై మరోసారి విషం చిమ్మిన ఉదయనిధి స్టాలిన్
- NEET UG 2026 అభ్యర్థులకు బిగ్ షాక్.. పరీక్ష రద్దు చేస్తూ కేంద్రం సంచలన నిర్ణయం
- Assam CM Himanta Biswa Sarma: రెండోసారి అస్సాం ముఖ్యమంత్రిగా 'హిమంత శర్మ' ప్రమాణ స్వీకారం..!
దళితులను, అణగారిని వర్గాల వారిని అగౌరపరిచే కాంగ్రెస్ విధానాన్ని సమాజ్వాదీ పార్టీ కూడా అవలంబిస్తోందని ఆయన అన్నారు. అంబేద్కర్ పట్ల బీజేపీకి ఉన్న గౌరవం కాంగ్రెస్కి లేదని, అంబేద్కర్ చదువుకున్న మోవ్, నాగ్పూర్, ముంబై, లండన్లోని ముఖ్యప్రదేశాలను స్మారక చిహ్నాలు రూపొందించినట్లు వెల్లడించారు. బీజేపీ నాయకత్వంలోని అటల్ బీహారీ వాజ్పేయి ప్రభుత్వమైనా, నరేంద్రమోడీ ప్రభుత్వమైనా అంబేద్కర్ ఆశయాలను గౌరవించిందని చెప్పారు.
రాజ్యాంగ పరిషరత్, ముసాయిదా కమిటీలో అంబేద్కర్ని చేర్చుకునే ఆసక్తి కాంగ్రెస్కి లేదని చెప్పారు. ముంబై నార్త్ నుండి 1952 సాధారణ ఎన్నికలు, 1954 ఉప ఎన్నికలతో సహా ఎన్నికలలో అంబేద్కర్ను ఓడించడానికి కాంగ్రెస్ కృషి చేసిందని ఆరోపించారు. నెహ్రూ అంబేద్కర్కి వ్యతిరేకంగా ప్రచారం చేసి, ఆయన ఓడిపోయేలా చేశారంటూ ఆరోపించారు. అంబేద్కర్ జీవించి ఉన్నంతకాలం ఆయనకు గౌరవం ఇవ్వడానికి కాంగ్రెస్ నిరాకరించిందని యోగి విమర్శించారు. బీజేపీనే అంబేద్కర్కి భారతరత్న ఇచ్చి గౌరవించిందని చెప్పారు. కేంద్రమంత్రి అమిత్ షా ప్రసంగంలోని కొంత భాగాన్ని మాత్రమే ప్రచారం చేసి కాంగ్రెస్ లబ్ధిపొందాలని అనుకుందని, బీజేపీ ఎంపీలపై దాడి చేయడం రాజ్యాంగ బద్ధమా అని కాంగ్రెస్ని యోగి ప్రశ్నించారు.
తాజావార్తలు
-
NEET UG 2026: మే 3న నీట్ పరీక్ష, మే 12న రద్దు.. అసలు ఈ 10 రోజుల్లో ఏం జరిగింది? పూర్తి టైమ్లైన్ ఇదే..
-
Hiro Vishal: 717 వైన్ షాపుల మూసివేత.. హీరో విశాల్ భావోద్వేగ పోస్ట్!
-
Axar Patel: విజయం సాధించిన లేని ఆనందం.. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్కు భారీ జరిమానా..!
-
KTR: “23 లక్షల మందికి మానసిక క్షోభ”.. నీట్ ప్రశ్నాపత్రం లీక్పై మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్..
-
Dragon :‘డ్రాగన్’ గ్లింప్స్ టైమ్ ఫిక్స్ ..?
ట్రెండింగ్
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!
-
Palak Paratha Recipe: హెల్దీగా, టేస్టీగా చేసే సూపర్ సాఫ్ట్ ‘పాలక్ పరోటా’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Samsung: సర్టిఫైడ్ రీ-న్యూడ్ ప్రోగ్రామ్ తో రిఫర్బిష్డ్ గెలాక్సీ S25, గెలాక్సీ A56 మోడళ్లను తీసుకొచ్చిన శాంసంగ్..!