Mahua Moitra: మహువాను “లోక్సభ నుంచి తక్షణమే బహిష్కరించాలి”.. ఎథిక్స్ ప్యానెల్ డ్రాఫ్ట్ రిపోర్ట్ రెడీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mahua Moitra: పార్లమెంట్లో ప్రశ్నలు అడిగేందుకు వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీ నుంచి లంచం తీసుకుందనే ఆరోపణలను ఎదుర్కొంటున్నారు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మోయిత్రా. ‘క్యాష్ ఫర్ క్వేరీ’గా పిలువబడుతున్న ఈ కేసులో పార్లమెంట్ ఎథిక్స్ ప్యానెల్ ఇప్పటికే ఆమెను విచారించింది. ఈ నేపథ్యంలో ఎథిక్స్ ప్యానెల్ డ్రాఫ్ట్ నివేదిక తయారైంది. ఇందులో ఆమెపై ‘కఠిన శిక్ష’ విధించాలని సూచించిందని, ఆమెను లోక్సభ నుంచి తక్షణమే బహిష్కరించాలని సూచించినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.
ఎథిక్స్ కమిటీ ముసాయిదాలో.. మోయిత్రా చర్యలు అనైతికమని, పార్లమెంటరీ ప్రత్యేక హక్కును ఉల్లంఘించాయని మరియు సభను ధిక్కరించినట్లు పేర్కొంది. ఇంతే కాకుండా గిఫ్టులు, లంచాల గురించి మోయిత్రా మరియు వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీల ప్రకటనల మధ్య వైరుధ్యాలను కూడా నివేదిక హైలెట్ చేసింది. ఈ నివేదికను పార్లమెంట్ స్పీకర్కి పంపించనుంది.
Also Read
- August New Rules 2026: రేపటి నుంచి కొత్త రూల్స్ అమలు.. ప్రతి ఇంటి బడ్జెట్పై ప్రభావం చూపే 10 మార్పులు..
- Cauvery Dispute: కావేరీ వివాదం మళ్లీ వేడెక్కింది.. సీఎం విజయ్తో డీకే శివకుమార్ భేటీ వాయిదా
- Kulgam: కుల్గామ్లో ఉగ్ర దాడి.. వలస కార్మికుడు మృతి
- Saayoni Ghosh: పార్లమెంట్ను అడ్డుకోవడం భావ్యం కాదు.. టీఎంసీ రెబల్ సాయోని ఘోష్ ఆగ్రహం
Read Also: Uttar Pradesh: రికార్డుల్లో నేను చనిపోయాను.. కానీ నాకు ఏకే 47 కావాలి.. ప్రధాని కార్యదర్శికి లేఖ
పార్లమెంట్లో ప్రశ్నలు అడగడానికి దర్శన్ హీరానందానీ నుంచి డబ్బులు తీసుకున్నట్లు బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే ఆరోపించారు. దీనిపై లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాయడంతో ఈ అంశం దేశరాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆమె వ్యక్తిగత పార్లమెంట్ లాగిన్ వివరాలను ఇతరులతో పంచుకున్నట్లు ఆరోపించారు. దుబాయ్ నుంచి పలుమార్లు లాగిన్ అయినట్లు తెలిసింది. ఈ మొత్తం వివాదంపై ఇప్పటికే ఎథిక్స్ కమిటీ హోం, విదేశీ వ్యవహారాలు, ఐటీ మంత్రిత్వ శాఖల నుంచి వివరాలు తెప్పించుకుంది. వీటి ఆధారంగా మహువామోయిత్రాను విచారించింది.
ఈ వ్యవహారంలో వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీ ఎథిక్స్ ప్యానెల్కి అఫిడవిట్ సమర్పించడం కొసమెరుపు. తన నుంచి గిఫ్టులు తీసుకుని ప్రధాని మోడీ, అదానీ గ్రూపుకు వ్యతిరేకంగా ప్రశ్నలు అడినట్లు అందులో పేర్కొన్నారు. తనతో చేయకూడని పనులు చేయించుకున్నట్లు అఫిడవిట్లో ఆరోపించారు. ఇదిలా ఉంటే ఇటీవల ఎథిక్స్ ప్యానెల్ విచారణ సందర్భంగా విపక్ష ఎంపీలు మహువా మోయిత్రాకు అండగా నిలబడ్డారు. మరోవైపు మహువా మోయిత్రాపై లోక్పాల్ సీబీఐ దర్యాప్తుకు ఆదేశించినట్లు ఎంపీ నిషికాంత్ దూబే నిన్న ఎక్స్(ట్విట్టర్) ద్వారా ప్రకటించారు.
తాజావార్తలు
-
Off The Record: సొంత పార్టీ నేతలకు కేతిరెడ్డి బ్యాడ్ మార్నింగ్?
-
West Indies: వ్యక్తిగత కారణాలతోనే దూరం.. క్రికెట్ వెస్టిండీస్ ప్రకటనను గుర్తుచేసిన పేసర్..
-
August New Rules 2026: రేపటి నుంచి కొత్త రూల్స్ అమలు.. ప్రతి ఇంటి బడ్జెట్పై ప్రభావం చూపే 10 మార్పులు..
-
Tablet Launched: 10,100mAh బ్యాటరీ, కాగితం లాంటి డిస్ప్లే.. అదిరిపోయిన ఫీచర్స్..
-
Cauvery Dispute: కావేరీ వివాదం మళ్లీ వేడెక్కింది.. సీఎం విజయ్తో డీకే శివకుమార్ భేటీ వాయిదా
ట్రెండింగ్
-
Kitchen Tips : బియ్యం కేవలం వంటకే కాదు.. ఈ సీక్రెట్ హ్యాక్స్ తెలిస్తే ఆశ్చర్యపోతారు.!
-
Flipkart Pay Later: ఇప్పుడు కొనండి.. నిమ్మలంగా కట్టండి.. ఫ్లిప్కార్ట్లో ‘పే లేటర్’ సదుపాయం!
-
ITR Filing Deadline: ట్యాక్స్పేయర్లకు అలెర్ట్.. ITR ఫైల్ చేశారా? ఈరోజే చివరి గడువు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవసరమా?.. అసలు ఆ ఆలోచన ఏంటి?.. ప్రముఖ వ్యాఖ్యాత ఆసక్తికర వ్యాఖ్యలు!
-
కొత్త కలర్స్, ట్యూబ్లెస్ స్పోక్ వీల్స్తో 2026 Yezdi బైక్స్ లాంచ్..!