Awadhesh Prasad: సీఎం యోగికి యాదవులు, ముస్లింలతో శత్రుత్వం.. బాలిక గ్యాంగ్రేప్పై అయోధ్య ఎంపీ..
- యూపీ రాజకీయాలను కుదిపేస్తున్న బాలిక గ్యాంగ్ రేప్..
- నిందితుల్లో సమాజ్వాదీ పార్టీ కార్యకర్త..
- సీఎం యోగికి ముస్లింలు.. యాదవులంటే శత్రుత్వం..
- బుల్డోజర్ యాక్షన్ తర్వాత అయోధ్య ఎంపీ కీలక వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Awadhesh Prasad: ఉత్తర్ ప్రదేశ్ రాజకీయాలను అయోధ్య బాలిక సామూహిక అత్యాచార ఘటన కుదిపేస్తోంది. బేకరీలో పనిచేసే 12 ఏళ్ల బాలికపై బేకరీ యజమాని మోయిద్ ఖాన్, అతడి ఉద్యోగి రాజు ఖాన్ అత్యాచారానికి పాల్పడ్డారు. అమ్మాయి గర్భవతి కావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అయితే నిందితుడు మోయిద్ ఖాన్ సమాజ్వాదీ పార్టీ కార్యకర్త కావడంతో ఈ ఘటన పొలిటికల్ టర్న్ తీసుకుంది. ఈ ఘటనపై యూపీ సీఎ యోగి ఆదిత్యనాథ్ చర్యలకు హామీ ఇచ్చారు. నిందితుడికి సంబంధించిన బేకరీని బుల్డోజర్లతో కూల్చివేశారు.
Also Read
- PM Modi: గ్రామీణ ప్రాంతాల ప్రతిభను వెలికితీయడమే ధ్యేయం.. 'ఖేలో ఇండియా' విజన్ను స్పష్టం చేసిన మోడీ
- Wedding Gift: వింత వెడ్డింగ్ గిఫ్ట్.. స్నేహితుడి భార్య ముఖాన్ని గుండెలపై శాశ్వతంగా వేయించుకున్న వ్యక్తి..!
- September 1 Rules Changes: సెప్టెంబర్ 1 నుంచి మారనున్న 5 కీలక విషయాలు.. మీ జేబుపై నేరుగా ప్రభావం!
- Nepal-Tibet Flash Floods: కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత.. అన్ని మార్గాలు మూసివేత..? వెనక్కి వెళ్లిపోండి..!
అయితే, ఈ ఘటనపై అయోధ్య రామాలయం ఉన్న ఫైజాబాద్ ఎంపీ, ఎస్పీ నేత అవధేశ్ ప్రసాద్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సీఎం యోగి ఆదిత్యనాథ్కి యాదవ్, ముస్లిం వర్గాలతో శత్రుత్వం ఉందని శనివారం ఆరోపించారు. నిందితుడికి చెందిన ఖాన్ బేకరీని కూల్చివేసిన తర్వాత ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే, నేరాలు చేసేవారికి మద్దతుగా ఎస్పీ ఎప్పుడూ నిలబడదని, మైనర్ బాలిక అత్యాచారాన్ని రాజకీయం చేయవద్దని బీజేపీని కోరారు.
ఎంపీ అవధేశ్ టీంలో నిందితుడు సభ్యుడని, అతనికి సమాజ్ వాదీ పార్టీలో సంబంధం ఉందని సీఎం యోగి ఆదిత్యనాథ్ రాష్ట్ర అసెంబ్లీలో ఆరోపించారు. బాలిక అత్యాచార ఘటనలో సంబంధం ఉన్నప్పటికీ అతడిపై ఆ పార్టీ చర్యలు తీసుకోలేదని అన్నారు. మరోవైపు ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ నిందితులకు డీఎన్ఏ టెస్టు నిర్వహించాలని వ్యాఖ్యానించడం వివాదాస్పదమైంది. మీ హయాంలో ఎంతమంది నిందితులకు డీఎన్ఏ పరీక్షలు నిర్వహించారని అధికార బీజేపీతో పాటు బీఎస్పీ ఫైర్ అవుతోంది.
తాజావార్తలు
-
Forbes India: అల్లు అర్జున్కు మరో అరుదైన గౌరవం.. ఫోర్బ్స్ కవర్పై ఐకాన్ స్టార్!
-
PM Modi: గ్రామీణ ప్రాంతాల ప్రతిభను వెలికితీయడమే ధ్యేయం.. ‘ఖేలో ఇండియా’ విజన్ను స్పష్టం చేసిన మోడీ
-
India U19 Squad: వారసులు వచ్చేసారు.. ఆస్ట్రేలియాతో U19 సిరీస్కు వీరేంద్ర సెహ్వాగ్, రాహుల్ ద్రవిడ్ కుమారులకు చోటు..!
-
Janhvi Kapoor Marriage : జాన్వీ కపూర్, ఇషాన్ కట్టర్ పెళ్లి చేసుకున్నారా?
-
Gold Theft: ట్రావెల్స్ బస్సులో భారీ చోరీ.. రూ.50 లక్షల విలువైన బంగారం మాయం!
ట్రెండింగ్
-
Guinness World Record: లక్ష అడుగుల ఎత్తు నుంచి ఫోన్ను పడేసినా.. ఒక్క గీత కూడా పడలేదు.! అసలు మ్యాజిక్ ఏంటంటే?
-
Sugar Prices: పండగ వేళ షాక్.. ఒకరికి 2 కేజీలు మాత్రమే.. చక్కెర కొనుగోళ్లపై పరిమితి!
-
Dimensity 7100 చిప్, కొత్త Colour Fusion డిజైన్తో వచ్చేస్తున్న Ai+ Nova 2 Power..!
-
Wedding Gift: వింత వెడ్డింగ్ గిఫ్ట్.. స్నేహితుడి భార్య ముఖాన్ని గుండెలపై శాశ్వతంగా వేయించుకున్న వ్యక్తి..!
-
September 1 Rules Changes: సెప్టెంబర్ 1 నుంచి మారనున్న 5 కీలక విషయాలు.. మీ జేబుపై నేరుగా ప్రభావం!