Awadhesh Prasad: సీఎం యోగికి యాదవులు, ముస్లింలతో శత్రుత్వం.. బాలిక గ్యాంగ్రేప్పై అయోధ్య ఎంపీ..
- యూపీ రాజకీయాలను కుదిపేస్తున్న బాలిక గ్యాంగ్ రేప్..
- నిందితుల్లో సమాజ్వాదీ పార్టీ కార్యకర్త..
- సీఎం యోగికి ముస్లింలు.. యాదవులంటే శత్రుత్వం..
- బుల్డోజర్ యాక్షన్ తర్వాత అయోధ్య ఎంపీ కీలక వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Awadhesh Prasad: ఉత్తర్ ప్రదేశ్ రాజకీయాలను అయోధ్య బాలిక సామూహిక అత్యాచార ఘటన కుదిపేస్తోంది. బేకరీలో పనిచేసే 12 ఏళ్ల బాలికపై బేకరీ యజమాని మోయిద్ ఖాన్, అతడి ఉద్యోగి రాజు ఖాన్ అత్యాచారానికి పాల్పడ్డారు. అమ్మాయి గర్భవతి కావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అయితే నిందితుడు మోయిద్ ఖాన్ సమాజ్వాదీ పార్టీ కార్యకర్త కావడంతో ఈ ఘటన పొలిటికల్ టర్న్ తీసుకుంది. ఈ ఘటనపై యూపీ సీఎ యోగి ఆదిత్యనాథ్ చర్యలకు హామీ ఇచ్చారు. నిందితుడికి సంబంధించిన బేకరీని బుల్డోజర్లతో కూల్చివేశారు.
Also Read
- Digital Payments: యూపీఐ ఛార్జీల నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకుంటుందా? ఫైనల్ ఆన్సర్ వచ్చేసింది!
- XI Jinping: జిన్పింగ్కు ఇస్కీమిక్ స్ట్రోక్.. బ్రిక్స్ నుంచి నేరుగా హాస్పిటల్కు.?
- UAPA: షహజాద్ భట్టి నెట్వర్క్పై భారత్ ఉక్కుపాదం.. ఉగ్రసంస్థగా ప్రకటన..
- UP: మొన్న గురుగ్రామ్.. ఇవాళ లక్నోలో యువతిని కారుతో ఢీకొట్టిన యువకుడు
అయితే, ఈ ఘటనపై అయోధ్య రామాలయం ఉన్న ఫైజాబాద్ ఎంపీ, ఎస్పీ నేత అవధేశ్ ప్రసాద్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సీఎం యోగి ఆదిత్యనాథ్కి యాదవ్, ముస్లిం వర్గాలతో శత్రుత్వం ఉందని శనివారం ఆరోపించారు. నిందితుడికి చెందిన ఖాన్ బేకరీని కూల్చివేసిన తర్వాత ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే, నేరాలు చేసేవారికి మద్దతుగా ఎస్పీ ఎప్పుడూ నిలబడదని, మైనర్ బాలిక అత్యాచారాన్ని రాజకీయం చేయవద్దని బీజేపీని కోరారు.
ఎంపీ అవధేశ్ టీంలో నిందితుడు సభ్యుడని, అతనికి సమాజ్ వాదీ పార్టీలో సంబంధం ఉందని సీఎం యోగి ఆదిత్యనాథ్ రాష్ట్ర అసెంబ్లీలో ఆరోపించారు. బాలిక అత్యాచార ఘటనలో సంబంధం ఉన్నప్పటికీ అతడిపై ఆ పార్టీ చర్యలు తీసుకోలేదని అన్నారు. మరోవైపు ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ నిందితులకు డీఎన్ఏ టెస్టు నిర్వహించాలని వ్యాఖ్యానించడం వివాదాస్పదమైంది. మీ హయాంలో ఎంతమంది నిందితులకు డీఎన్ఏ పరీక్షలు నిర్వహించారని అధికార బీజేపీతో పాటు బీఎస్పీ ఫైర్ అవుతోంది.
తాజావార్తలు
-
TGSRTC : బస్టాండ్ ఇక కేవలం బస్టాండ్ మాత్రమే కాదు.. మాల్ను తలపించేలా కొత్త లుక్
-
Saudi-Houthis: మక్కా చేరిన హౌతీల దాడులు.. చప్పుడు చేయని పాక్.. కారణమిదేనా?
-
Digital Payments: యూపీఐ ఛార్జీల నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకుంటుందా? ఫైనల్ ఆన్సర్ వచ్చేసింది!
-
XI Jinping: జిన్పింగ్కు ఇస్కీమిక్ స్ట్రోక్.. బ్రిక్స్ నుంచి నేరుగా హాస్పిటల్కు.?
-
Vijay-Trisha: త్రిష ప్లేస్లో నేనుంటేనా.. విజయ్ను వదిలేసి దూరంగా వెళ్లిపోయేదాన్ని: సీనియర్ హీరోయిన్
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!