Awadhesh Prasad: సీఎం యోగికి యాదవులు, ముస్లింలతో శత్రుత్వం.. బాలిక గ్యాంగ్రేప్పై అయోధ్య ఎంపీ..
- యూపీ రాజకీయాలను కుదిపేస్తున్న బాలిక గ్యాంగ్ రేప్..
- నిందితుల్లో సమాజ్వాదీ పార్టీ కార్యకర్త..
- సీఎం యోగికి ముస్లింలు.. యాదవులంటే శత్రుత్వం..
- బుల్డోజర్ యాక్షన్ తర్వాత అయోధ్య ఎంపీ కీలక వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Awadhesh Prasad: ఉత్తర్ ప్రదేశ్ రాజకీయాలను అయోధ్య బాలిక సామూహిక అత్యాచార ఘటన కుదిపేస్తోంది. బేకరీలో పనిచేసే 12 ఏళ్ల బాలికపై బేకరీ యజమాని మోయిద్ ఖాన్, అతడి ఉద్యోగి రాజు ఖాన్ అత్యాచారానికి పాల్పడ్డారు. అమ్మాయి గర్భవతి కావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అయితే నిందితుడు మోయిద్ ఖాన్ సమాజ్వాదీ పార్టీ కార్యకర్త కావడంతో ఈ ఘటన పొలిటికల్ టర్న్ తీసుకుంది. ఈ ఘటనపై యూపీ సీఎ యోగి ఆదిత్యనాథ్ చర్యలకు హామీ ఇచ్చారు. నిందితుడికి సంబంధించిన బేకరీని బుల్డోజర్లతో కూల్చివేశారు.
Also Read
- Rajdhani Express Fire: రాజధాని ఎక్స్ప్రెస్ లో ప్రమాదం.. రెండు కోచ్లలో చెలరేగిన మంటలు
- Bulldozer Action: బెంగాల్లో బుల్డోజర్ చర్యలు.. హౌరా స్టేషన్ బయట ఆక్రమణలు తొలగింపు
- What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
అయితే, ఈ ఘటనపై అయోధ్య రామాలయం ఉన్న ఫైజాబాద్ ఎంపీ, ఎస్పీ నేత అవధేశ్ ప్రసాద్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సీఎం యోగి ఆదిత్యనాథ్కి యాదవ్, ముస్లిం వర్గాలతో శత్రుత్వం ఉందని శనివారం ఆరోపించారు. నిందితుడికి చెందిన ఖాన్ బేకరీని కూల్చివేసిన తర్వాత ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే, నేరాలు చేసేవారికి మద్దతుగా ఎస్పీ ఎప్పుడూ నిలబడదని, మైనర్ బాలిక అత్యాచారాన్ని రాజకీయం చేయవద్దని బీజేపీని కోరారు.
ఎంపీ అవధేశ్ టీంలో నిందితుడు సభ్యుడని, అతనికి సమాజ్ వాదీ పార్టీలో సంబంధం ఉందని సీఎం యోగి ఆదిత్యనాథ్ రాష్ట్ర అసెంబ్లీలో ఆరోపించారు. బాలిక అత్యాచార ఘటనలో సంబంధం ఉన్నప్పటికీ అతడిపై ఆ పార్టీ చర్యలు తీసుకోలేదని అన్నారు. మరోవైపు ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ నిందితులకు డీఎన్ఏ టెస్టు నిర్వహించాలని వ్యాఖ్యానించడం వివాదాస్పదమైంది. మీ హయాంలో ఎంతమంది నిందితులకు డీఎన్ఏ పరీక్షలు నిర్వహించారని అధికార బీజేపీతో పాటు బీఎస్పీ ఫైర్ అవుతోంది.
తాజావార్తలు
-
Rajdhani Express Fire: రాజధాని ఎక్స్ప్రెస్ లో ప్రమాదం.. రెండు కోచ్లలో చెలరేగిన మంటలు
-
Pawan Kalyan: పార్లమెంట్ నియోజకవర్గాలవారీగా కమిటీలు.. పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు
-
MEGA 158 : ‘బాబీ – చిరు’ సినిమాకు అన్ని అడ్డంకులు క్లియర్.. షూట్ ఎప్పుడంటే?
-
KKR vs GT: ఐపీఎల్ చరిత్రలోనే అరుదైన మ్యాచ్.. టీ20 క్రికెట్లో కూడా కేకేఆర్-గుజరాత్ మ్యాచ్ రేర్ మైల్స్టోన్!
-
Bulldozer Action: బెంగాల్లో బుల్డోజర్ చర్యలు.. హౌరా స్టేషన్ బయట ఆక్రమణలు తొలగింపు
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..