Ayodhya gangrape: గ్యాంగ్ రేప్ కేసు రాజీ కుదుర్చుకోవాలి.. బాలిక తల్లికి డబ్బులు ఆఫర్ చేసిన సమాజ్వాదీ నేతలు..
- ఉత్తర్ ప్రదేశ్లో సంచలనంగా గ్యాంగ్ రేప్..
- నిందితుల్లో సమాజ్వాదీ పార్టీ నేత..
- రాజీ కుదుర్చుకునేందుకు బాలిక తల్లికి డబ్బులు ఆఫర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ayodhya gangrape: ఉత్తర్ ప్రదేశ్ రాజకీయాల్లో 12 ఏళ్ల బాలికపై గ్యాంగ్ రేప్ అంశం సంచలనంగా మారింది. అయోధ్యలో జరిగిన ఈ ఘటనపై ఇప్పటికే యోగి సర్కార్ చర్యలు ప్రారంభించింది. అయోధ్య జిల్లాలోని భదర్సా నగర్లో ఖాన్ బేకరీ యజమాని, స్థానిక సమాజ్వాదీ పార్టీ నేత అయిన మోయిద్ ఖాన్, అతడి ఉద్యోగి రాజు ఖాన్ ఇద్దరు అందులో పనిచేస్తున్న 12 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమెకు గర్భం రావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో యోగి సర్కార్ నిందితుల బేకరీని బుల్డోజర్లతో కూల్చివేసింది. ఈ కేసులో బాధితురాలిని సీఎం యోగి నేరుగా కలుసుకుని న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు.
Read Also: Ayodhya Rape Case: 12 ఏళ్ల బాలిక కడుపులో 12 వారాల పాప..నిందితుడి ఇంటికి బుల్డోజర్!
Also Read
- How to Kill Men: మెట్రోలో యువతి చేతిలో ‘మగాళ్లను చంపడం ఎలా’ పుస్తకం.. షాక్ అవుతున్న నెటిజన్లు!
- UK Roads Melt at 40°C: 40°Cకే UK రోడ్లు కరుగుతుంటే.. 45°C దాటినా తట్టుకుంటున్న భారతీయ రోడ్లు.. ఆసక్తికరమైన కారణాలు
- Ayodhya: "వాష్రూమ్లలో డబ్బు దాచాం".. అయోధ్య కేసులో నిందితుడు బయటపెట్టిన సంచలన నిజాలు
- Chennai Crime: ప్రియురాలికి ఐఫోన్ గిఫ్ట్ కోసం చైన్ స్నాచింగ్.. పోలీసుకు పట్టించిన చొక్కా..!
ఇదిలా ఉంటే, అత్యాచార విషయాన్ని దాచి ఉంచేందుకు సమాజ్వాదీ పార్టీకి చెందిన పలువురు నేతలు తమకు డబ్బు ఆశ చూపించినట్లుగా బాధితురాలి తల్లి చెప్పింది. భదర్సనగర్ పంచాయతీ చైర్మన్గా ఉన్న ఎస్పీ నేత మహ్మద్ రషీద్ తనకు డబ్బు ఆఫర్ చేసి, కేసులో రాజీ కుదుర్చుకోవాలని కోరినట్లు వెల్లడించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రాష్ట్ర పోలీసు అధికారులు హామీ ఇచ్చారని ఆమె తెలిపారు. తమకు ఆర్థిక సాయం అందించాలని ఆమె ప్రభుత్వాన్ని కోరింది.
రెండు నెలల క్రితం బాలికపై మోయిద్ ఖాన్, రాజుఖాన్ లు అత్యాచారానికి పాల్పడ్డారు. వైద్య పరీక్షల్లో బాలిక గర్భవతి అని తేలింది. నిందితుడు మొయిద్ ఖాన్, ఇటీవల అయోధ్య రామాయలం ఉన్న ఫైజాబాద్ నుంచి గెలిచిన ఎస్పీ నేత అవధేశ్ ప్రసాద్ టీంలో భాగమని బీజేపీతో పాటు సీఎం యోగి ఆరోపించారు. అయితే, ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ ఈ కేసులో నిందితులకు దూరంగా ఉన్నారు. మరోవైపు నిందితులకు డీఎన్ఏ టెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేయడంపై అధికార బీజేపీతో పాటు మాయావతి బీఎస్పీ పార్టీ ఫైర్ అవుతోంది.
తాజావార్తలు
-
How to Kill Men: మెట్రోలో యువతి చేతిలో ‘మగాళ్లను చంపడం ఎలా’ పుస్తకం.. షాక్ అవుతున్న నెటిజన్లు!
-
Queen 2:13 ఏళ్ల తర్వాత కంగనా సెన్సేషన్.. షూటింగ్ పూర్తి, రిలీజ్పై ఆసక్తి
-
Toxic : ‘టాక్సిక్’ లేడీస్ & లేడీస్ గ్లిమ్స్ రిలీజ్.. ఈసారి మరింత వైల్డ్గా యశ్
-
YS Jagan: సాయికృష్ణ కేసులో కవర్అప్ జరిగిందా? జగన్ సంచలన ఆరోపణలు
-
KTR-Prabhas: రచ్చ రచ్చే.. లైవ్లో రెబల్ స్టార్ ప్రభాస్కు ఫోన్ చేసిన కేటీఆర్ (వీడియో)
ట్రెండింగ్
-
Harry Brook: మా ప్లాన్స్ మాకున్నాయి.. దాచాం చాలా.. వైభవ్ను ఈజీగా బుట్టలో వేస్తాం!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ రాకపోవడమే మంచిది.. అసలు కారణం..!
-
IND vs ENG 1st T20: ఇంగ్లండ్ తుది జట్టు ప్రకటన.. ఆ ఇద్దరు స్టార్లకు నో ప్లేస్.. టీమిండియా హ్యాపీ!
-
Farmer Job Offer: జాబ్ ఆఫర్ చేసిన మహిళా రైతు.. ఉదయం 6 నుంచి 2 గంటల వరకు పని.. టీ, బ్రేక్ఫాస్ట్ ఫ్రీ..
-
Bread Pakoda Recipe: కరకరలాడే స్ట్రీట్ స్టైల్ ‘బ్రెడ్ పకోడా’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా.!