Amarnath Yatra: ముగిసిన అమర్నాథ్ యాత్ర.. . పాల్గొన్న 4.4 లక్షల మంది శివ భక్తులు
Amarnath Yatra concludes: అమర్నాథ్ యాత్ర గురువారంతో ముగిసింది. దక్షిణ కాశ్మీర్లోని గుహ మందిరంలో 4.4 లక్షల మంది యాత్రికులు ప్రార్థనలు చేయడంతో వార్షిక అమర్నాథ్ యాత్ర గురువారంతో ముగిసింది. 62 రోజుల పాటు యాత్ర సాగింది. యాత్ర జూలై 1న బల్తాల్ మరియు పహల్గాం మార్గాల ద్వారా ప్రారంభమైన విషయం తెలిసిందే. తీర్థయాత్ర సందర్భంగా సహజసిద్ధంగా ఏర్పడిన మంచు శివలింగాన్ని 4,45,338 మంది భక్తులు దర్శించుకున్నారని అధికారులు తెలిపారు.
Read Also: Kushi Twitter Review : ఖుషి హిట్టా.. ఫట్టా ట్విటర్ ఏం చెబుతుందంటే?
Also Read
యాత్ర ప్రారంభం అయిన తరువాత పలు కారణాలతో యాత్రకు అవాంతరాలు ఎదరవుతున్నాయి. భారీ వర్షాలు, వరదల కారణంగా అమర్నాథ్ యాత్ర ఇబ్బందులు పడుతూ ముందుకు సాగింది. యాత్ర సమయంలో మధ్యలో పలుసార్లు నిలిపివేయాల్సి వచ్చింది. తిరిగి ప్రారంభించాల్సి వచ్చింద. 62వ వార్షిక అమర్నాథ్ యాత్ర గురువారంతో ముగియడంతో.. హిమాలయాల్లోని మంచు స్ఫటిక శివలింగం ఉన్న ఈ గుహాలయాన్ని ఈ ఏడాది 4.4 లక్షల మంది యాత్రికులు సందర్శించుకున్నారు. జూలై ఒకటో తేదీ నుంచి బల్టాల్, పహల్గామ్ మార్గాల్లో యాత్ర మొదలైంది. యాత్రికులు సహా మొత్తం 48 మంది వాతావరణ సంబంధ, సహజ కారణాలతో చనిపోగా.. మరో 62 మంది గాయపడ్డారని అధికారులు చెప్పారు. యాత్ర ప్రశాంతంగా కొనసాగిందని, ఎటువంటి అవాంచనీయ ఘటనలు చోటుచేసుకోలేదని తెలిపారు. గత ఏడాది 3.65 లక్షల మంది యాత్రికులు అమర్నాథ్ యాత్రలో పాల్గొన్నారు. శ్రీనగర్లోని దశనమి అఖారా నుంచి యాత్రను ప్రారంభించిన జాపత్రి గురువారం అమర్నాథ్ గుహ క్షేత్రానికి చేరుకుంది. ఆగస్ట్ 23న చివరి బ్యాచ్ యాత్రికులు గుహాలయానికి పూజలు చేశారని, హిమాలయాలలో ట్రాక్లను సరిచేయాల్సిన అవసరం ఉన్నందున, సంఖ్య తగ్గుతున్నందున తీర్థయాత్రను నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. గత కొన్ని సంవత్సరాలతో పోల్చితే ఈ సంవత్సరం తీర్థయాత్రకు ఎక్కువ మంది భక్తులు హాజరైనట్టు అధికారి ఒకరు తెలిపారు. గత సంవత్సరం, 3,65,000 మంది యాత్రికులు పవిత్ర పుణ్యక్షేత్రాన్ని సందర్శించారు.. ఇది 2016 నుండి అత్యధికమని చెప్పారు. 3,880 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ పుణ్యక్షేత్రానికి తీర్థయాత్ర జూలై 1న అనంత్నాగ్ జిల్లాలోని పహల్గాం ట్రాక్పై మరియు గండేర్బల్ జిల్లాలోని బల్తాల్పై ఏకకాలంలో ప్రారంభమైంది. పహల్గామ్ పొడవైనది కానీ సులభమైన మార్గమని అయితే, బాల్తాల్ మార్గం యొక్క ఏటవాలు చిన్నదైనప్పటికీ కష్టతరం చేస్తుందని.. యాత్ర ప్రశాంతంగా, ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా సాగిందని అధికారులు తెలిపారు.
తాజావార్తలు
-
Jobs: పదో తరగతి అర్హత.. ఆ స్కూల్, కాలేజీల్లో నైట్ వాచ్ ఉమెన్, అసిస్టెంట్ కుక్ పోస్టులకు దరఖాస్తులు..
-
Off The Record : కరీంనగర్ లో కాంగ్రెస్ బలపడటం పెద్ద నేతలకే ఇష్టం లేదా? శత్రువుకు శత్రువు మిత్రుడన్నట్టు రాజకీయం?
-
Story Board : ఒంటరి పోరాటమా.. అంతర్గత వైఫల్యమా? విపక్షాల బలహీనతకు అసలు కారణం రాహులేనా?
-
GST: దేశ చరిత్రలోనే ఆల్ టైమ్ రికార్డ్.. ఏప్రిల్లో భారీగా జీఎస్టీ వసూళ్లు..
-
Ragi Sweet Roti: బామ్మల కాలం నాటి ఆరోగ్య రహస్యం.. నిమిషాల్లో తయారయ్యే రాగి తీపి రొట్టెలు ఇలా సింపుల్గా చేసేయండి!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!