Good News Soon to Employees: ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం గుడ్న్యూస్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం మరో శుభవార్త చెప్పేందుకు సిద్ధం అవుతోంది.. మరో రెండు మూడు వారాల్లో కేంద్ర ప్రభుత్వం ప్రమోషన్లను ప్రకటించే అవకాశం ఉంది.. ప్రమోషన్కు సంబంధించిన న్యాయపరమైన సమస్యలను పరిష్కరించడంపై ఫోకస్ పెట్టింది ప్రభుత్వం.. మొత్తంగా, పదోన్నతుల ప్రక్రియను వేగవంతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ నెల 1వ తేదీన 8 వేల మందికి పైగా కేంద్ర అధికారులకు పదోన్నతి కల్పించిన ప్రభుత్వం, ఇప్పుడు మరోసారి పలువురు అధికారులకు పదోన్నతి కల్పించేందుకు సిద్ధమవుతోంది. కేంద్ర సిబ్బంది మరియు ప్రజా ఫిర్యాదుల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఈ విషయాన్ని వెల్లడించారు.. అధికారుల ప్రతినిధి బృందంతో సమావేశమైన ఆయన.. రెండు మూడు వారాల్లో పదోన్నతుల ప్రకటన వెలువడుతుందని చెప్పారు. ప్రమోషన్లపై ప్రభుత్వం సీరియస్గా ఉందని, ఈ విషయంలో ప్రధాని నరేంద్ర మోడీ ఆసక్తిగా ఉన్నారని ప్రతినిధి బృందానికి మంత్రి తెలిపారు.
Read Also: Alia Bhatt: లూజ్ వైట్ షర్ట్ లో అలియా.. బేబీ బంప్ ను దాచేస్తుందే
Also Read
- TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
- Import Duty Charges increased: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
- Piyush Goyal: అందరం కలిసి ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది.. పరిశ్రమలకు పీయూష్ గోయల్ హెచ్చరిక
- NEET Paper Leak: రూ. 10 లక్షలకు కొని, రూ. 15 లక్షలకు అమ్మకం.. నీట్ పేపర్ లీక్ కేసులో నిందితుడి అరెస్ట్..
కేంద్ర ప్రభుత్వంలోని మంత్రిత్వ శాఖలు మరియు వివిధ విభాగాలలో పరిపాలనాపరమైన పనులు చేస్తున్న అధికారులు చివరిగా 2019లో పదోన్నతి పొందారు. ఆ సమయంలో 4 వేల అధికారులు మూడు సర్వీసుల్లో పదోన్నతి పొందారు. అయితే, డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ.. ప్రభుత్వోద్యోగులు పదోన్నతి లేకుండా సర్వీసు నుంచి రిటైర్ కావడం నిరాశ కలిగిస్తుందన్నారు.. 8,089 మంది ఉద్యోగులకు ప్రమోషన్లు ఇవ్వడంలో న్యాయపరమైన అడ్డంకులు అన్నీ పరిష్కారమయ్యాయని.. ఇక నుంచి అన్ని భవిష్యత్ పదోన్నతులను క్రమబద్ధీకరిస్తామన్నారు. అయితే, సెంట్రల్ సెక్రటేరియట్ అధికార భాషా సేవా గ్రూప్-ఎ అధికారుల ప్రతినిధి బృందం.. కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ను కలిసింది.. పదోన్నతి కల్పించాలనే డిమాండ్ వినిపించింది.. ఈ సమావేశంలో, వారి పదోన్నతుల ప్రక్రియను వేగవంతం చేస్తామని తెలిపారు.. అధికారులకు పదోన్నతులు కల్పించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నాం… మరో రెండు మూడు వారాల్లో కేంద్ర ప్రభుత్వం ప్రమోషన్ను ప్రకటించనుందన్నారు.
తాజావార్తలు
-
Bunny Vas: భారీ కలెక్షన్ల వెనుక అసలు నిజం బయటపెట్టిన బన్నీ వాస్!
-
SRH Lowest Score: ఐపీఎల్ చరిత్రలోనే చెత్త రికార్డు.. 86 పరుగులకే కుప్పకూలిన ఆరెంజ్ ఆర్మీ..
-
Kagiso Rabada: వాళ్లు మొదలెట్టారు, మేము ముగించాం.. ఎస్ఆర్హెచ్ విక్టరీపై రబాడ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Raghunandan Rao: అధికారం పోయినా ఉదయనిధికి జ్ఞానోదయం కలగలేదు.. రఘునందన్ ఫైర్
-
Michael Jackson: మైఖేల్ జాక్సన్ ఇంకా బ్రతికే ఉన్నారా? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటో!
ట్రెండింగ్
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Import Duty Charges increased: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!