Good News Soon to Employees: ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం గుడ్న్యూస్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం మరో శుభవార్త చెప్పేందుకు సిద్ధం అవుతోంది.. మరో రెండు మూడు వారాల్లో కేంద్ర ప్రభుత్వం ప్రమోషన్లను ప్రకటించే అవకాశం ఉంది.. ప్రమోషన్కు సంబంధించిన న్యాయపరమైన సమస్యలను పరిష్కరించడంపై ఫోకస్ పెట్టింది ప్రభుత్వం.. మొత్తంగా, పదోన్నతుల ప్రక్రియను వేగవంతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ నెల 1వ తేదీన 8 వేల మందికి పైగా కేంద్ర అధికారులకు పదోన్నతి కల్పించిన ప్రభుత్వం, ఇప్పుడు మరోసారి పలువురు అధికారులకు పదోన్నతి కల్పించేందుకు సిద్ధమవుతోంది. కేంద్ర సిబ్బంది మరియు ప్రజా ఫిర్యాదుల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఈ విషయాన్ని వెల్లడించారు.. అధికారుల ప్రతినిధి బృందంతో సమావేశమైన ఆయన.. రెండు మూడు వారాల్లో పదోన్నతుల ప్రకటన వెలువడుతుందని చెప్పారు. ప్రమోషన్లపై ప్రభుత్వం సీరియస్గా ఉందని, ఈ విషయంలో ప్రధాని నరేంద్ర మోడీ ఆసక్తిగా ఉన్నారని ప్రతినిధి బృందానికి మంత్రి తెలిపారు.
Read Also: Alia Bhatt: లూజ్ వైట్ షర్ట్ లో అలియా.. బేబీ బంప్ ను దాచేస్తుందే
Also Read
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
- UP: ఏం త్యాగం.. ఐదుగురు పిల్లల తల్లిని ప్రియుడికిచ్చి పెళ్లి చేసిన భర్త.. ఏం జరిగిందంటే..!
- Rahul Gandhi vs BJP: విద్యార్థులతో రాజకీయాలెందుకు? రాహుల్గాంధీని ప్రశ్నించిన బీజేపీ
- Sheikh Hasina: విద్యార్థి ఉద్యమం కాదు, రెజిమ్ ఛేంజ్ కుట్ర.. 2 ఏళ్ల తర్వాత మౌనం వీడిన షేక్ హసీనా..
కేంద్ర ప్రభుత్వంలోని మంత్రిత్వ శాఖలు మరియు వివిధ విభాగాలలో పరిపాలనాపరమైన పనులు చేస్తున్న అధికారులు చివరిగా 2019లో పదోన్నతి పొందారు. ఆ సమయంలో 4 వేల అధికారులు మూడు సర్వీసుల్లో పదోన్నతి పొందారు. అయితే, డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ.. ప్రభుత్వోద్యోగులు పదోన్నతి లేకుండా సర్వీసు నుంచి రిటైర్ కావడం నిరాశ కలిగిస్తుందన్నారు.. 8,089 మంది ఉద్యోగులకు ప్రమోషన్లు ఇవ్వడంలో న్యాయపరమైన అడ్డంకులు అన్నీ పరిష్కారమయ్యాయని.. ఇక నుంచి అన్ని భవిష్యత్ పదోన్నతులను క్రమబద్ధీకరిస్తామన్నారు. అయితే, సెంట్రల్ సెక్రటేరియట్ అధికార భాషా సేవా గ్రూప్-ఎ అధికారుల ప్రతినిధి బృందం.. కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ను కలిసింది.. పదోన్నతి కల్పించాలనే డిమాండ్ వినిపించింది.. ఈ సమావేశంలో, వారి పదోన్నతుల ప్రక్రియను వేగవంతం చేస్తామని తెలిపారు.. అధికారులకు పదోన్నతులు కల్పించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నాం… మరో రెండు మూడు వారాల్లో కేంద్ర ప్రభుత్వం ప్రమోషన్ను ప్రకటించనుందన్నారు.
తాజావార్తలు
-
OTR: ఒకప్పుడు ఊపు ఊపిన మాజీ ఎంపీ.. ఇప్పుడు బలవంతంగా జీపులోకి ఎక్కించిన పోలీసులు..
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
-
Trump: ఇరాన్ సుంకాలు విధిస్తే మేమూ విధిస్తాం.. హార్ముజ్పై ట్రంప్ వార్నింగ్
-
OTR: జగ్గారెడ్డి కమిషన్ రిపోర్ట్లో ఏముంది..?
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!