Good News Soon to Employees: ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం గుడ్న్యూస్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం మరో శుభవార్త చెప్పేందుకు సిద్ధం అవుతోంది.. మరో రెండు మూడు వారాల్లో కేంద్ర ప్రభుత్వం ప్రమోషన్లను ప్రకటించే అవకాశం ఉంది.. ప్రమోషన్కు సంబంధించిన న్యాయపరమైన సమస్యలను పరిష్కరించడంపై ఫోకస్ పెట్టింది ప్రభుత్వం.. మొత్తంగా, పదోన్నతుల ప్రక్రియను వేగవంతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ నెల 1వ తేదీన 8 వేల మందికి పైగా కేంద్ర అధికారులకు పదోన్నతి కల్పించిన ప్రభుత్వం, ఇప్పుడు మరోసారి పలువురు అధికారులకు పదోన్నతి కల్పించేందుకు సిద్ధమవుతోంది. కేంద్ర సిబ్బంది మరియు ప్రజా ఫిర్యాదుల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఈ విషయాన్ని వెల్లడించారు.. అధికారుల ప్రతినిధి బృందంతో సమావేశమైన ఆయన.. రెండు మూడు వారాల్లో పదోన్నతుల ప్రకటన వెలువడుతుందని చెప్పారు. ప్రమోషన్లపై ప్రభుత్వం సీరియస్గా ఉందని, ఈ విషయంలో ప్రధాని నరేంద్ర మోడీ ఆసక్తిగా ఉన్నారని ప్రతినిధి బృందానికి మంత్రి తెలిపారు.
Read Also: Alia Bhatt: లూజ్ వైట్ షర్ట్ లో అలియా.. బేబీ బంప్ ను దాచేస్తుందే
Also Read
- Train: మరీ చీఫ్గా దుప్పట్లు చోరీ.. కోచ్ అటెండెంట్లు గగ్గోలు.. ఎందుకంటే..!
- Supreme Court: ప్రేమికుల్ని నిలువరించడం సాధ్యమా? పోక్సో దుర్వినియోగంపై సుప్రీంకోర్టు చీవాట్లు
- India-US: అమెరికాతో ఒప్పందం వద్దనుకుంటున్నట్లు కథనాలు.. పీయూష్ గోయల్ క్లారిటీ
- Bengaluru: ప్రేమికుడిని పెళ్లాడిన 4 నెలలకే ఉపాధ్యాయురాలు ఆత్మహత్య.. సూసైడ్ నోట్లో ఏం రాసిందంటే..!
కేంద్ర ప్రభుత్వంలోని మంత్రిత్వ శాఖలు మరియు వివిధ విభాగాలలో పరిపాలనాపరమైన పనులు చేస్తున్న అధికారులు చివరిగా 2019లో పదోన్నతి పొందారు. ఆ సమయంలో 4 వేల అధికారులు మూడు సర్వీసుల్లో పదోన్నతి పొందారు. అయితే, డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ.. ప్రభుత్వోద్యోగులు పదోన్నతి లేకుండా సర్వీసు నుంచి రిటైర్ కావడం నిరాశ కలిగిస్తుందన్నారు.. 8,089 మంది ఉద్యోగులకు ప్రమోషన్లు ఇవ్వడంలో న్యాయపరమైన అడ్డంకులు అన్నీ పరిష్కారమయ్యాయని.. ఇక నుంచి అన్ని భవిష్యత్ పదోన్నతులను క్రమబద్ధీకరిస్తామన్నారు. అయితే, సెంట్రల్ సెక్రటేరియట్ అధికార భాషా సేవా గ్రూప్-ఎ అధికారుల ప్రతినిధి బృందం.. కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ను కలిసింది.. పదోన్నతి కల్పించాలనే డిమాండ్ వినిపించింది.. ఈ సమావేశంలో, వారి పదోన్నతుల ప్రక్రియను వేగవంతం చేస్తామని తెలిపారు.. అధికారులకు పదోన్నతులు కల్పించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నాం… మరో రెండు మూడు వారాల్లో కేంద్ర ప్రభుత్వం ప్రమోషన్ను ప్రకటించనుందన్నారు.
తాజావార్తలు
-
ఓపెన్-ఇయర్ డిజైన్, AI కాలింగ్ ఫీచర్స్, 37 గంటల బ్యాటరీతో Sony LinkBuds Clip భారత్లో లాంచ్.!
-
Iran Missile Attack: ముదురుతున్న యుద్ధం.. హార్ముజ్లో యూఏఈ ట్యాంకర్లపై ఇరాన్ క్షిపణులు దాడులు
-
Tollywood: మళ్లీ ట్రెండ్లోకి రాయలసీమ యాస.. స్టార్ హీరోల కొత్త ట్రెండ్ ఇదేనా ?
-
Toxic: యష్ క్రేజ్.. ఇండియాలోనే మోస్ట్ అవైటెడ్ మూవీగా ‘టాక్సిక్’..
-
Fake Shopping Offers : రూ.999 ఆఫర్.. ఖాతా ఖాళీ.! సైబర్ మోసగాళ్ల కొత్త ట్రిక్
ట్రెండింగ్
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!
-
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!