Emmanuel Macron: ఇండియాకు ఫ్రాన్స్ అధ్యక్షుడు.. ఎజెండా ఇదే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Emmanuel Macron To Visit India Early Next Year: ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుమేల్ మక్రాన్ భారత పర్యటనకు రాబోతున్నారు. వచ్చే ఏడాది ప్రారంభంలో ఆయన భారతదేశాన్ని సందర్శించేందుకు రానున్నారు. ఫ్రెంచ్ మంత్రి క్రిసౌలా జచరోపౌలౌ, భారత సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి జితేంద్ర సింగ్ తో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ.. మాక్రాన్ 2023 ప్రారంభంలో భారతదేశాన్ని సందర్శించాల్సి ఉందని అన్నారు. మహారాష్ట్రలోని జైతాపూర్ అణువిద్యుత్ రియాక్టర్ల నిర్మాణానికి సంబంధించి పునరుద్ధరణ జరుగుతున్న నేపథ్యంలో ఆయన ఇండియాకు రానున్నట్లు తెలుస్తోంది.
Read Also: Partial Solar Eclipse: ఈ నెల 25న పాక్షిక సూర్యగ్రహణం.. ఇప్పుడు తప్పితే మళ్లీ పదేళ్ల తరువాతే
Also Read
- Maharashtra: ఐఫోన్ కోసం కొండపై నుంచి దూకలేదు.. మహారాష్ట్ర ఘటనలో వెలుగులోకి షాకింగ్ నిజాలు..
- Allahabad High Court: హిజాబ్ ధరించడం ఇస్లాంలో తప్పనిసరి కాదు..! అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు..
- Gurmeet Ram Rahim Release: మరోసారి జైలు నుంచి బయటకు డేరా బాబా.. 17వ సారి పెరోల్పై విడుదల
- Sugar Price Hike: కొండెక్కుతున్న చక్కెర ధరలు.. కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం..
జైతాపూర్ ప్రాజెక్టుకు సంబంధించి సాంకేతిక, ఆర్థిక, పౌర అణు బాధ్యత సమస్యలను ఇరు పక్షాలు వీలైనంత త్వరగా.. మక్రాన్ పర్యటనకు ముందే పరిష్కరించుకుంటామని జితేంద్ర సింగ్ అన్నారు. మహారాష్ట్ర రత్నగిరి జిల్లా జైతాపూర్ ఒక్కొక్కటిగా 1,650 మెగావాట్ల ఆరు అణువిద్యుత్ ఫ్లాంట్లను నిర్మించనున్నట్లు భారత్ ప్రకటించింది. మొత్తం 9,900 మెగావాట్ల సామర్థ్యంతో దేశంలోనే అతిపెద్ద అణువిద్యుత్ కేంద్రంగా జైతాపూర్ అణువిద్యుత్ కేంద్ర మారనుంది.
అణువిద్యుత్ రియాక్టర్ల ఏర్పాటును వేగవంతం చేసేందుకు జితేంద్ర సింగ్, ఫ్రెంచ్ మంత్రి జచరోపౌలౌ చర్చించారు. ఫ్రెంచ్ కంపెనీ ఈడీఎఫ్ గత ఏడాది న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎన్పీసీఐఎల్)కి మధ్య ఒప్పందం కుదిరింది. ఆరు యూరోపియన్ ప్రెషరైజ్డ్ రియాకర్లు నిర్మించడానికి ఒప్పందం కుదిరింది. ఈ ఏడాది మేలో ఈడీఎఫ్ ఉన్నతస్థాయి బృందం భారతదేశాన్ని సందర్శించారు. ఎన్పీసీఐఎల్ అధికారులతో చర్చలు జరిపారు. దేశంలో కర్భన ఉద్గారాలను తగ్గించేందుకు ప్రభుత్వం సోలార్, అణువిద్యుత్ కేంద్రాలను ప్రోత్సహిస్తోంది. ఇందులో భాగంగానే జైతాపూర్ అణు విద్యుత్ కేంద్రం రెడీ అవుతోంది.
తాజావార్తలు
-
AP Liquor Case: ఏపీ లిక్కర్ రవాణా కేసు.. కారుమూరి రిమాండ్లో కీలక అంశాలు..
-
Srisailam Tragedy: శ్రీశైలంలో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య
-
Rishabh Pant: ఒక్కరోజే మూడు అరుదైన రికార్డులు.. ధోనీ, గిల్, గిల్క్రిస్ట్లను వెనక్కి నెట్టిన రిషభ్ పంత్!
-
Reservation Roster: డాక్టర్ల నియామకంపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం!
-
Maharashtra: ఐఫోన్ కోసం కొండపై నుంచి దూకలేదు.. మహారాష్ట్ర ఘటనలో వెలుగులోకి షాకింగ్ నిజాలు..
ట్రెండింగ్
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
-
Ragi Poha Roti: రోజూ తినే టిఫిన్లు బోర్ కొట్టాయా? ఇన్స్టెంట్గా ఈ రాగి-పోహా రోటీ ట్రై చేయండి.!
-
8,050mAh బ్యాటరీ, 200MP కెమెరాతో సెప్టెంబర్ 1న రాబోతున్న POCO F9 Ultra..
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?