EC Press Meet: నేడు ఈసీ ప్రెస్మీట్.. బీహార్ ఓటర్ లిస్ట్, రాహుల్ ఆరోపణలపై రియాక్షన్!
- నేడు మధ్యాహ్నం 3 గంటలకు ఎన్నికల కమిషన్ మీడియా సమావేశం..
- బీహార్ ఓటర్ జాబితా, రాహుల్ గాంధీ ఆరోపణలపై స్పందించే ఛాన్స్..
EC Press Meet: ఎన్నికల కమిషన్ టార్గెట్ గా.. దేశంలో అనేక చోట్ల ఓటర్ జాబితాలో అక్రమాలు జరిగాయంటూ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ సహా విపక్ష నేతలు ఆరోపణలు చేశాయి. వీటికి చెక్ పెట్టేందుకు ఈసీ రెడీ అయినట్లు సమాచారం. ఈ ఓట్ల చోరీ ఆరోపణలపై నేడు ( ఆగస్టు 17న) మీడియా సమావేశం నిర్వహించబోతున్నట్లు తెలుస్తుంది. అలాగే, బీహార్లో రాహుల్ గాంధీ ‘ఓటు అధికార్ యాత్ర’ను ప్రారంభించబోతున్న రోజే ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
Read Also: Rahul Gandhi: నేటి నుంచి బీహార్లో రాహుల్ గాంధీ ఓటర్ అధికార్ యాత్ర..
Also Read
అయితే, ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే సమయంలో తప్ప.. ఇతర అంశాలపై ఎన్నికల కమిషన్ అధికారికంగా మీడియా సమావేశం ఏర్పాటు చేయడం చాలా అరుదు. ఇవాళ (ఆదివారం) నిర్వహించనున్న ప్రెస్ కాన్ఫరెన్స్ వెనుక అసలు కారణాన్ని తెలియజేయనప్పటికీ.. గత కొంతకాలంగా ఈసీపై వస్తున్న ఆరోపణలకు చెక్ పెట్టేలా ఈ ప్రెస్ మీట్ ఉండే ఛాన్స్ ఉంది. ప్రతిపక్షాలు ‘ఓటు చోరీ’ అనే పదాన్ని పదే పదే ఉపయోగించడాన్ని ఎన్నికల సంఘం ఇప్పటికే ఖండించింది. తప్పుడు కథనాలను ప్రచారం చేసే బదులు ఆధారాలు ఇవ్వాలని కోరింది.
Read Also: Surya 47 : ఆ మలయాళ దర్శకుడితో సూర్య కొత్త సినిమా?
కాగా, బీహార్లో ఓట్ల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్), ఓట్ల చోరీపై విపక్షాలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నాయి. కర్ణాటక, మహారాష్ట్ర, హర్యానాల్లో ఓట్లు చోరీకి గురయ్యాయని రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు చేశారు. అయితే, కర్ణాటకలోని ఒక్క మహాదేవపుర నియోజకవర్గంలోనే లక్ష ఓట్లు చోరీకి గురయ్యాయని పేర్కొన్నాడు. ఈ ఆరోపణలకు లిఖితపూర్వంగా డిక్లరేషన్ ఇవ్వాలని ఈసీ కోరింది. లేకపోతే దేశానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది.
తాజావార్తలు
-
Terror Attack: మాలిలో భారీ ఉగ్రవాద దాడి.. రక్షణ మంత్రి హతం..
-
Easy Laundry Tricks: కాలర్ మొండి మరకలను సింపుల్గా వదిలించే సూపర్ టిప్స్!
-
IPL Playoff Chance: ప్లే ఆఫ్స్ చేరే జట్లపై క్లారిటీ.. ఆ రెండు జట్లు ఔట్..!
-
LSG vs KKR: టాస్ గెలిచిన లక్నో.. ప్రతీకారం తీర్చుకునేందుకు సై..
-
Donald Trump: ‘‘మీకే ఎందుకు ఇలా జరుగుతోంది.?’’ కాల్పుల ఘటనపై ట్రంప్ ‘‘లింకన్’’ ఆన్సర్..
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!