Al-Falah University: లెక్కల్లో తేలని రూ.415.10 కోట్లు.. ఈడీ ప్రత్యేక ఫోకస్
- లెక్కల్లో తేలని రూ.415.10 కోట్లు
- ఈడీ ప్రత్యేక ఫోకస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హర్యానాలోని అల్-ఫలాహ్ యూనివర్సిటీ వేదికగా జరిగిన ఉగ్ర కుట్రను వెలికితీసే పనిలో దర్యాప్తు అధికారులు నిమగ్నమై ఉన్నారు. ఇక నిన్నటి నుంచి ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. మొత్తం 25 చోట్ల ఏకకాలంలో దాడులు చేశారు. ఈ సోదాల్లో పలు అక్రమాలను గుర్తించారు.
ఇది కూడా చదవండి: Madrasa: ఉగ్రదాడుల వేళ ప్రభుత్వం కీలక నిర్ణయం.. మదర్సాలకు కొత్త నిబంధనలు..
Also Read
- Mamata Banerjee-EC: మమతా బెనర్జీకి ఈసీ లేఖ.. 4 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశం
- Maharashtra: ఆర్టీఐలో మార్పులు.. అన్నాహజారే హెచ్చరికతో వెనక్కి తగ్గిన ప్రభుత్వం
- Aishwarya Rai: ఐదో తరగతిలో ఐశ్వర్యరాయ్ పాఠ్యాంశం.. ప్రజలు తీవ్ర ఆగ్రహం
- Petrol-Diesel: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా?.. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ కీలక వ్యాఖ్యలు
యూనివర్శిటీ తప్పుడు అక్రిడిటేషన్ ద్వారా విద్యార్థుల నుంచి రూ.415.10 కోట్లు వసూలు చేసినట్లుగా అధికారులు గుర్తించారు. ఎటువంటి గుర్తింపు లేకుండానే ఈ ఫీజులు వసూలు చేసినట్లుగా కనిపెట్టారు. ఇక సోదాల్లో రూ.48 లక్షల నగదు, డిజిటల్ పరికరాలు, డాక్యుమెంటరీ ఆధారాలు లభించినట్లు అధికారులు తెలిపారు. అక్రమంగా సంపాదిస్తున్న నిధులను ఎక్కడికి మళ్లిస్తున్నారనే విషయంపై ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. ఇక మనీలాండరింగ్ కేసులో ఈడీ అధికారులు.. విశ్వవిద్యాలయం ఛైర్మన్ జావెద్ అహ్మద్ సిద్దిఖీని అరెస్ట్ చేసి ప్రశ్నిస్తున్నారు.
ఇది కూడా చదవండి: Australia: ఆస్ట్రేలియాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 8 నెలల భారతీయ గర్భిణీ మృతి
ఇదిలా ఉంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు పెద్ద ఎత్తున క్యాంపస్లో దాడులు చేస్తున్నారు. జామియానగర్లో సంస్థ చైర్మన్ ఇంట్లో సహా మొత్తం 25 చోట్ల అధికారులు సోదాలు నిర్వహించారు. అయితే ఈడీ దాడుల నేపథ్యంలో క్యాంపస్లో ఉండాల్సిన చాలా మంది ప్రొఫెసర్లు ఇప్పుడు అదృశ్యమైనట్లుగా అధికారులు గుర్తించారు. అంతమాత్రమే కాకుండా క్యాంపస్కు సమీపంలో ఉండే చాలా మంది స్థానికులు కూడా కనిపించకుండా పోయారు. దీంతో అధికారులకు పెద్ద ఎత్తున అనుమానాలు రేకెత్తుతున్నాయి. అంటే క్యాంపస్ వేదికగా చాలా కుట్రలు జరిగినట్లుగా భావిస్తున్నారు.
ప్రస్తుతం హర్యానా డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) ఓపి సింగ్ రంగంలోకి దిగారు. మంగళవారం క్యాంపస్ను సందర్శించారు. దీంతో క్యాంపస్లో చాలా దిగ్భ్రాంతికర విషయాలను గుర్తించారు. ఈ నేపథ్యంలో అల్-ఫలాహ్ విశ్వవిద్యాలయంలో భద్రతా లోపాలపై సమగ్ర దర్యాప్తుకు ఆదేశించారు. క్యాంపస్ నుంచి అదృశ్యమైన ప్రొఫెసర్లు, స్థానికులు ఎవరో గుర్తించాలని పోలీస్ అధికారులకు ఆదేశించారు.
అంతేకాకుండా యూనివర్సిటీలోనే ఉంటూ ఇంత పెద్ద స్థాయిలో ఉగ్రదాడులకు వైద్యుల బృందం ఎలా ప్లాన్ చేయగలిగిందో ప్రధానంగా దృష్టి పెట్టాలని డీజీపీ ఆదేశించారు. క్యాంపస్ భద్రత, పర్యవేక్షణపై దర్యాప్తు చేయాలని సూచించారు. పైగా పెద్ద సంఖ్యలో అధ్యాపకులు, అలాగే విశ్వవిద్యాలయం చుట్టు పక్కల ప్రాంతాలకు చెందిన చాలా మంది స్థానికుల ఆచూకీ లభించడం లేదు. పైగా ప్రొఫెసర్లు ఎవరు కూడా అడ్మినిస్ట్రేషన్కు సమాచారం ఇవ్వకుండానే అదృశ్యమయ్యారు. వాళ్లంతా సమాచారం ఇవ్వకుండానే ఎందుకు వెళ్లాల్సి వచ్చిందో.. సమీప గ్రామస్తులు కూడా సడన్గా ఎందుకు అదృశ్యమయ్యారో ఈ వివరాలన్నీ సేకరించాల్సిదిగా డీజీపీ ఆదేశించారు. ప్రస్తుత పరిణామాలను బట్టి చూస్తుంటే.. ఈ కుట్రలో ఇంకా ప్రొఫెసర్లు, స్థానికుల పాత్ర కూడా ఉన్నట్లుగా దర్యాప్తు బృందాలు భావిస్తున్నాయి. వీళ్ల ఆచూకీ లభిస్తే.. ఢిల్లీ బ్లాస్ట్ వెనుక ఇంకేమీ కుట్ర జరిగిందో బయటపడనుంది.`
తాజావార్తలు
-
OTR : ఉభయ గోదావరిలో కుల రాజకీయం.. కొత్త టర్న్?
-
Story Board : అయోధ్యలో టీటీడీ తరహా బాధ్యతాయుతమైన బోర్డు అవసరమా..?
-
Telangana Cabinet : తెలంగాణ క్యాబినెట్ బిగ్ డెసిషన్స్..!
-
OTR: జోరుగా సాగర సమరం.. సాగర్ బీఆర్ఎస్లో ఎంసీ కోటిరెడ్డి vs నోముల భగత్..
-
OTR: 14 ఏళ్ళుగా లేని పాలక మండలి.. శ్రీ సీతారామచంద్ర స్వామి మీద తెలంగాణ సర్కార్ శీతకన్నేసిందా?
ట్రెండింగ్
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!