Supreme Court: ‘ఉచితాలు’ పెద్ద సమస్య.. ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు వాగ్దానాలు చేయడం మరియు పంపిణీ చేయడం తీవ్రమైన సమస్య అని సుప్రీంకోర్టు పేర్కొంది, దీని కారణంగా ఆర్థిక వ్యవస్థ నష్టపోతోందని వ్యాఖ్యానించింది.. ఎన్నికల వేళ ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ఉచిత హామీలు ఇస్తున్న రాజకీయ పార్టీలను నిషేధించాలని కోరుతూ న్యాయవాది అశ్విని ఉపాధ్యాయ్ దాఖలు చేసిన పిల్ను సుప్రీంకోర్టు విచారించింది. ఎన్నికల మేనిఫెస్టోను నియంత్రించేందుకు చర్యలు తీసుకోవాలని, అందులో చేసిన వాగ్దానాలకు రాజకీయ పార్టీలు జవాబుదారీగా ఉండేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు పిటిషనర్.. అయితే, ఇది సమస్య కాదని ఎవరూ అనరు.. ఇది తీవ్రమైన సమస్య.. ఉచితాలు పొందుతున్న వారికి అది కావాలి.. ఇక, మాది సంక్షేమ రాజ్యం.. తాము పన్నులు చెల్లిస్తున్నామని,. అభివృద్ధి ప్రక్రియకు వినియోగించాలని కొందరు అనవచ్చు.. కాబట్టి ఇది తీవ్రమైన సమస్య.. అందుకే ఇరు పక్షాల వాదనలను కమిటీ వినాలి అని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ చెప్పినట్లు బార్ అండ్ బెంచ్ పేర్కొంది.
Read Also: CM YS Jagan Mohan Reddy: గర్వంగా చెబుతున్నా… నా అక్క చెల్లెమ్మలకు రాఖీ పండుగ కానుక ఇదే..
Also Read
- Gallantry Awards 2026: వీర సైనికులకు గొప్ప గౌరవం.. శౌర్య, కీర్తి చక్ర సహా 78 పురస్కారాలకు రాష్ట్రపతి ఆమోదం
- Akhilesh Yadav: ‘18 ఏళ్లు రాగానే బీజేపీని ఓడించండి’.. జెన్ ఆల్ఫాకు అఖిలేష్ పిలుపు
- Murmu: జెన్-జీపై తొలిసారి స్పందించిన ముర్ము.. ఏమన్నారంటే..!
- Murmu warns: ‘ఎక్కడ దాక్కున్నా వదిలిపెట్టం’.. ఉగ్రవాదులకు రాష్ట్రపతి ముర్ము హెచ్చరిక
భారతదేశం పేదరికం ఉన్న దేశమని, కేంద్ర ప్రభుత్వం కూడా ఆకలితో అలమటించే ప్రణాళికలను కలిగి ఉందని పేర్కొన్నారు జస్టిస్ ఎన్వీ రమణ.. ఆర్థిక వ్యవస్థ డబ్బును కోల్పోతోందని మరియు ప్రజల సంక్షేమం సమతుల్యంగా ఉండాలి అని తెలిపారు.. ఇక, ఈ పిటిషన్పై తదుపరి విచారణను ఆగస్టు 17వ తేదీకి వాయిదా వేసింది సుప్రీంకోర్టు.. మరోవైపు.. అంతకుముందు, ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్ధనను సుప్రీంకోర్టు వ్యతిరేకించింది.. అర్హత మరియు వెనుకబడిన ప్రజల సామాజిక ఆర్థిక సంక్షేమం కోసం పథకాలను ‘ఉచితాలు’గా వర్ణించలేమని ఆప్ పేర్కొంది. బీజేపీకి బలమైన లింకులు ఉన్నాయని పిటిషనర్ పేర్కొన్నారు.. నిర్దిష్ట రాజకీయ ఎజెండాను బీజేపీ ముందుకు తీసుకెళ్తుందని ఆమ్ఆద్మీ పార్టీ ఆరోపించింది.
తాజావార్తలు
-
Traffic Restrictions : రాజ్భవన్ ‘ఎట్ హోమ్’.. ఈ రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు..
-
Gallantry Awards 2026: వీర సైనికులకు గొప్ప గౌరవం.. శౌర్య, కీర్తి చక్ర సహా 78 పురస్కారాలకు రాష్ట్రపతి ఆమోదం
-
OTR: రూట్ మారిందా మేస్టారూ…?
-
OTR: టీజీ భరత్ వర్సెస్ పోలీస్ శాఖ? మంత్రి సంచలన వ్యాఖ్యల వెనుక అసలేం ఉంది?
-
Gas Cylinder Racket : హైదరాబాద్లో అక్రమ గ్యాస్ దందా.. 750 సిలిండర్లు సీజ్.!
ట్రెండింగ్
-
Healthy Snacks : నల్లగా మారిన అరటిపండ్లు పారేయొద్దు.. ఇలా చేస్తే అదిరిపోయే టేస్టీ డెజర్ట్స్.!
-
Nagarjuna Akkineni: నేను సైబర్ క్రైమ్ బాధితుడినే.. నాలుగేళ్ల క్రితం మోసపోయా.. ఆసక్తికర విషయాలు చెప్పిన కింగ్!
-
Shridhar Chillal: మూడు అంతస్తుల భవనం కంటే పొడవైన గోర్లు.. గిన్నిస్ బుక్ లో స్థానం.!
-
Income Tax Refund 2026: ఐటీఆర్ రీఫండ్ ఇంకా రాలేదా?.. వెంటనే ఈ 3 అంశాలు సరిచూసుకోండి..
-
Sumith Fernando Dies: టీమిండియాతో మొదటి టెస్ట్ ముందు.. శ్రీలంక క్రికెట్లో పెను విషాదం!