Earthquake: హిమాచల్ప్రదేశ్లో భూకంపం.. వణికిన ప్రజలు
- హిమాచల్ప్రదేశ్లో భూకంపం
- చంబా జిల్లాలో రెండు సార్లు భూకంపం
- వణికిన ప్రజలు
భారీ వర్షాలు, వరదలతో వణికిపోతున్న హిమాచల్ప్రదేశ్ను తాజాగా భూకంపం వణికించింది. చంబా ప్రాంతంలో వరుసగా రెండు సార్లు భూకంపాలు సంభవించాయి. దీంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. వరుస విపత్తులతో హడలెత్తిపోతున్నారు.
ఇది కూడా చదవండి: Raja Singh : మార్వాడి గో బ్యాక్ అనేది అర్బన్ నక్సలైట్ల కుట్ర
Also Read
- Suvendu adhikari: 180 గెలుస్తున్నాం.. మమతా బెనర్జీ ఇక రెస్ట్ తీసుకో..
- Bengal exit polls: బీజేపీ వైపు నాలుగు, టీఎంసీ వైపు రెండు.. ఎగ్జిట్ పోల్స్తో ఉత్కంఠ..
- TM Exit Poll: తమిళనాడు సీఎంగా విజయ్.. సంచలనం స్పష్టిస్తున్న సర్వే..
- Measles Outbreak : బంగ్లాదేశ్ లో విజృంభిస్తున్న మీజిల్స్ మహమ్మారి..భారత్ కి ముప్పు తప్పదా ?
బుధవారం తెల్లవారుజామున చంబా జిల్లాలో రెండు సార్లు భూకంపం సంభవించింది. ఉదయం 4:39 గంటలకు 4.0 తీవ్రతతో భూకంపం నమోదైంది. గంట తర్వాత అదే ప్రాంతంలో 3.3 తీవ్రతతో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) తెలిపింది. రెండు ప్రకంపనలు వరుసగా 10 కి.మీ, 20 కి.మీ లోతుతో సంభవించాయి.
ఇది కూడా చదవండి: Shocking : కేపీహెచ్బీలో ఘోరం.. వేశ్యకు విటుడికి మధ్య ఘర్షణ.. కత్తితో దాడి
ఓ వైపు హిమాచల్ప్రదేశ్ను భారీ వర్షాలు, వరదలు ముంచెత్తుతుండగానే తాజాగా రెండు సార్లు భూకంపం సంభవించడంతో ప్రజలు వణికిపోయారు. అయితే భూకంపాలు కారణంగా ఆస్తి, ప్రాణ నష్ట వివరాలు అధికారులు ఏమీ వెల్లడించలేదు. ఇక జూన్ 20 నుంచి రుతుపవనాలు కారణంగా సంభవించిన వరదలు కారణంగా 276 మంది చనిపోయారు. వీరిలో 143 మంది కొండచరియలు విరిగిపడి, ఆకస్మిక వరదలు కారణంగా ప్రాణాలు కోల్పోయారు. 133 మంది అసురక్షిత పరిస్థితుల కారణంగా మరణించినట్లు అధికారులు వెల్లడించారు.
ఇదిలా ఉండగా బుధవారం తెల్లవారుజామున పాకిస్థాన్లో కూడా 3.7 తీవ్రతతో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపింది. 170 కి.మీ లోతులో ఈ భూకంపం సంభవించినట్లుగా పేర్కొంది. మంగళవారం తెల్లవారుజామున కూడా ఇస్లామాబాద్, రావల్పిండి, ఖైబర్ పఖ్తుంఖ్వా, స్వాత్, చిత్రాల్, అబోటాబాద్లోని అనేక ప్రాంతాలలో 5.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. పాకిస్థాన్లోని అనేక జిల్లాల్లో భూకంపాలు సంభవించాయి.
తాజావార్తలు
-
Suvendu adhikari: 180 గెలుస్తున్నాం.. మమతా బెనర్జీ ఇక రెస్ట్ తీసుకో..
-
Weight Loss Mistakes: బాబోయ్ బరువు తగ్గడానికి ఈ పని మాత్రం చస్తే చేయకండి..!
-
MI vs SRH: సెంచరీతో రఫ్ఫాడించిన ‘ర్యాన్ రికెల్టన్’.. SRH ముందు భారీ టార్గెట్.!
-
TRS: టీఆర్ఎస్ పార్టీలోకి 50 మంది చేరిక.. ఎక్కడంటే..
-
Hyderabad Metro : తెలంగాణ ప్రభుత్వం ఆధీనంలోకి హైదరాబాద్ మెట్రో
ట్రెండింగ్
-
Raw Mango Tomato Roti Pachadi: వేడివేడి అన్నానికి సూపర్ కాంబో “మామిడికాయ టమాటా రోటి పచ్చడి”.!
-
Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?
-
Viral Wedding: పెళ్లి పీటలపై ఊహించని ట్విస్ట్.. వధువు ముందు వింత షరతు పెట్టిన పెళ్లి కొడుకు.. షాక్లో బంధువులు!
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?