Earthquake: హిమాచల్ప్రదేశ్లో భూకంపం.. వణికిన ప్రజలు
- హిమాచల్ప్రదేశ్లో భూకంపం
- చంబా జిల్లాలో రెండు సార్లు భూకంపం
- వణికిన ప్రజలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారీ వర్షాలు, వరదలతో వణికిపోతున్న హిమాచల్ప్రదేశ్ను తాజాగా భూకంపం వణికించింది. చంబా ప్రాంతంలో వరుసగా రెండు సార్లు భూకంపాలు సంభవించాయి. దీంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. వరుస విపత్తులతో హడలెత్తిపోతున్నారు.
ఇది కూడా చదవండి: Raja Singh : మార్వాడి గో బ్యాక్ అనేది అర్బన్ నక్సలైట్ల కుట్ర
Also Read
- PM Modi: UPI తదుపరి స్థాయికి సిద్ధం.. ప్రపంచమంతా విస్తరించాలన్న మోడీ
- Sheikh Hasina Extradition: హసీనాను భారత్ నుంచి పట్టుకొచ్చి ఉరితీస్తాం.. బంగ్లాదేశ్ కఠిన వైఖరి!
- Rahul Gandhi: రాహుల్ గాంధీ ప్రయాణిస్తున్న విమానానికి గో-అరౌండ్.. రెండో ప్రయత్నంలో సేఫ్ ల్యాండింగ్!
- Supreme Court: టెట్పై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. ఇకపై ఆ అర్హతలు తప్పనిసరి!
బుధవారం తెల్లవారుజామున చంబా జిల్లాలో రెండు సార్లు భూకంపం సంభవించింది. ఉదయం 4:39 గంటలకు 4.0 తీవ్రతతో భూకంపం నమోదైంది. గంట తర్వాత అదే ప్రాంతంలో 3.3 తీవ్రతతో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) తెలిపింది. రెండు ప్రకంపనలు వరుసగా 10 కి.మీ, 20 కి.మీ లోతుతో సంభవించాయి.
ఇది కూడా చదవండి: Shocking : కేపీహెచ్బీలో ఘోరం.. వేశ్యకు విటుడికి మధ్య ఘర్షణ.. కత్తితో దాడి
ఓ వైపు హిమాచల్ప్రదేశ్ను భారీ వర్షాలు, వరదలు ముంచెత్తుతుండగానే తాజాగా రెండు సార్లు భూకంపం సంభవించడంతో ప్రజలు వణికిపోయారు. అయితే భూకంపాలు కారణంగా ఆస్తి, ప్రాణ నష్ట వివరాలు అధికారులు ఏమీ వెల్లడించలేదు. ఇక జూన్ 20 నుంచి రుతుపవనాలు కారణంగా సంభవించిన వరదలు కారణంగా 276 మంది చనిపోయారు. వీరిలో 143 మంది కొండచరియలు విరిగిపడి, ఆకస్మిక వరదలు కారణంగా ప్రాణాలు కోల్పోయారు. 133 మంది అసురక్షిత పరిస్థితుల కారణంగా మరణించినట్లు అధికారులు వెల్లడించారు.
ఇదిలా ఉండగా బుధవారం తెల్లవారుజామున పాకిస్థాన్లో కూడా 3.7 తీవ్రతతో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపింది. 170 కి.మీ లోతులో ఈ భూకంపం సంభవించినట్లుగా పేర్కొంది. మంగళవారం తెల్లవారుజామున కూడా ఇస్లామాబాద్, రావల్పిండి, ఖైబర్ పఖ్తుంఖ్వా, స్వాత్, చిత్రాల్, అబోటాబాద్లోని అనేక ప్రాంతాలలో 5.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. పాకిస్థాన్లోని అనేక జిల్లాల్లో భూకంపాలు సంభవించాయి.
తాజావార్తలు
-
Story Board : పసిడి అమ్మకాన్ని ప్రోత్సహిస్తున్న కంపెనీలు.. సామాన్యుల బలహీనతలే టార్గెటా?
-
Israel: ఇజ్రాయెల్పై యూకే, ఫ్రాన్స్, కెనడా ఆంక్షలు.. ప్రతీకార చర్యలకు దిగిన టెల్ అవీవ్!
-
Vijay Deverakonda : “వాళ్ల జోలికొస్తే నేను ఊరుకోను”.. స్టేజ్ మీదే వార్నింగ్ ఇచ్చిన విజయ్ దేవరకొండ!
-
OTR : కుప్పంలో పాత నేత మళ్ళి కీలక బాధ్యత లోకి రాబోతున్నారా?
-
Sandeep Reddy Vanga: ‘అప్పుడే అర్థమైంది..’ ఆనంద్ గురించి ఆసక్తికర విషయం చెప్పిన సందీప్ రెడ్డి వంగా
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైస్ కెప్టెన్ ఎందుకు చేశారన్నారు.. కెప్టెన్కే సలహాలు ఇస్తున్న వైభవ్.. వీడియో వైరల్!
-
Harry Potter అభిమానులకు గుడ్ న్యూస్.. Realme కొత్త స్పెషల్ ఎడిషన్ లాంచ్.!
-
Homemade Pani Puri: పానీపూరి అంటే ఇష్టమా? బయట బండి దగ్గర ఉండే టేస్ట్.. ఇంట్లోనే సులువుగా ఇలా చేసుకోండి ఇలా.!
-
Pigeons Problem: పావురాల బెడదతో విసిగిపోయారా..? ఈ చిట్కాలతో సింపుల్ గా సమస్యకు చెక్ పెట్టండి ఇలా.!
-
200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Huawei Pura X View లాంచ్..!