PM Modi Gifts: ప్రధాని మోడీ బహుమతుల ఈ-వేలాన్ని ప్రారంభించిన కేంద్ర సాంస్కృతిక శాఖ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi Gifts: ప్రధానమంత్రి నరేంద్రమోదీ పుట్టినరోజు సందర్భంగా కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ శనివారం ప్రధాని మోదీకి అందించిన ప్రతిష్టాత్మకమైన, చిరస్మరణీయమైన బహుమతుల ఈ-వేలాన్ని ప్రారంభించింది.నేటి నుంచి ప్రారంభమయ్యే ఈ-వేలం నాల్గవ ఎడిషన్ రెండు వారాల పాటు నిర్వహించబడుతుంది. అక్టోబర్ 2న ముగుస్తుంది. ప్రధాని మోడీకి చెందిన బహుమతుల ఇ-వేలంలో నమోదు చేసుకోవడానికి https://pmmementos.gov.inకి వెళ్లండి అంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ట్వీట్ చేశారు. ఢిల్లీలోని నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడరన్ ఆర్ట్లో గిఫ్ట్లను పొందుపరిచారు. ఈ అంశాలను వెబ్సైట్లో కూడా చూడవచ్చు. ఈ ఏడాది సుమారు 1200 మెమెంటోలు, బహుమతి వస్తువులను ఈ-వేలంలో ఉంచారు.
వేలంలో మెమెంటోల్లో సున్నితమైన పెయింటింగ్లు, శిల్పాలు, హస్తకళలు, జానపద కళాఖండాలు ఉన్నాయి. వీటిలో చాలా సంప్రదాయ అంగవస్త్రాలు, శాలువాలు, తలపాగాలు, ఉత్సవ కత్తులు వంటి బహుమతులుగా అందించబడే వస్తువులు ఉన్నాయి. అయోధ్యలోని రామమందిరం,వారణాసిలోని కాశీ-విశ్వనాథ దేవాలయం ప్రతిరూపాలు, నమూనాలు ఆసక్తిని కలిగించే ఇతర బహుమతులు ఉన్నాయి. ప్రముఖ క్రీడాకారులు అందించిన బహుమతులను కూడా అందుబాటులో ఉంచారు. ఈ ఎడిషన్ వేలంలో 25 కొత్త క్రీడా జ్ఞాపకాలు ఉన్నాయి.
Also Read
- Global Internet Disruption: ఇరాన్ వ్యాఖ్యలతో కొత్త టెన్షన్..! ఇంటర్నెట్ స్తంభించిపోతుందా..? భారత్కు ముప్పు తప్పదా..?
- Russian Oil: అమెరికా ఆంక్షలు ఉంటే ఎంత? ఊడితే ఎంత! రష్యా చమురు కొనుగోలుపై భారత్ 'మాస్' స్టేట్మెంట్!
- Supreme Court: రోడ్లపై వీధి కుక్కలు కనిపిస్తే అంతే! సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. పాత ఆర్డర్ మారేదే లేదని స్పష్టం
- IMD Yellow Alert: నిప్పుల కొలిమిలా ఉత్తర భారతం.. ఢిల్లీలో 45 డిగ్రీల దాకా చేరిన ఉష్ణోగ్రతలు.. ఐఎండి తీవ్ర హెచ్చరిక!
Amit Shah Convoy: అమిత్ షా కాన్వాయ్కు అడ్డుగా వచ్చిన కారు.. అద్దాలు పగులగొట్టిన ఎస్పీజీ
నమామి గంగ ద్వారా దేశ జీవనాధారమైన గంగానదిని పరిరక్షించాలనే ఉదాత్తమైన లక్ష్యం కోసం తనకు అందిన కానుకలన్నీ వేలం వేయాలని నిర్ణయించిన తొలి ప్రధాని నరేంద్ర మోదీ అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. వేలం ద్వారా సేకరించిన నిధులు, జాతీయ నది అయిన గంగా నదిని పరిరక్షించడానికి, పునరుజ్జీవింపజేయడానికి ఉద్దేశించిన ఫ్లాగ్షిప్ ప్రాజెక్ట్ అయిన నమామి గంగే కార్యక్రమానికి దోహదపడతాయి. సాధారణ ప్రజలు https://pmmementos.gov.inలో లాగిన్ చేసి నమోదు చేసుకోవడం ద్వారా ఈ-వేలంలో పాల్గొనవచ్చు.
తాజావార్తలు
-
Iran: ట్రంప్, నెతన్యాహుల తలలు తీస్తే రూ.450 కోట్ల బహుమతి.. ఖమేనీ మృతికి ఇరాన్ రివెంజ్ ప్లాన్!
-
Ishan Kishan Emotional: అతడి కోసం మ్యాచ్ గెలవాలనుకున్నా.. అదే నా మోటివేషన్!
-
Karuppu : వీరవిహారం చేస్తున్న వీరభద్రుడు.. వర్కింగ్ డే రోజు భారీ వసూళ్లు
-
Global Internet Disruption: ఇరాన్ వ్యాఖ్యలతో కొత్త టెన్షన్..! ఇంటర్నెట్ స్తంభించిపోతుందా..? భారత్కు ముప్పు తప్పదా..?
-
Salman Khan: ఒంటరితనం పోస్ట్ వెనుక అసలు నిజం చెప్పిన సల్మాన్ ఖాన్..
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!