Peegate Incident: తోటి ప్రయాణికులపై మూత్ర విసర్జన.. రైలులో ఘటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Peegate Incident: ఇటీవల కాలంలో విమానాల్లో ప్రయాణికులు తప్పతాగి సహ ప్రయాణికులపై మూత్రవిసర్జన చేసిన ఘటనల్ని మనం చూశాం. అయితే రైలులో కూడా తప్పతాగిన ఓ వ్యక్తి తోటి ప్రయాణికులపై మూత్ర విసర్జన చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. ఉత్తర్ ప్రదేశ్ సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్లో ఓ యువకుడు పీకలదాకా తాగి వృద్ధ దంపతులపై మూత్ర విసర్జనకు పాల్పడ్డాడు. బుధవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది.
Read Also: Dharmendra Pradhan: ఇండియా కూటమిని నిజమైన సవాల్గా భావిస్తున్నా.. ఎందుకంటే?
Also Read
- Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
- West Bengal: అక్రమ బంగ్లాదేశీయుల బహిష్కరణ.. బెంగాల్లో సీఏఏ స్టార్ట్..
- Pahalgam Terror Attack: పహల్గామ్ ఉగ్రదాడిలో ఎన్ఐఏ సంచలన ఛార్జిషీట్.. ఆ ఇద్దరి గైడ్స్ ఎంత పని చేశారంటే..!
- Congress: డీఎంకే వల్ల కాలేదు, 59 ఏళ్ల కాంగ్రెస్ కోరిక తీర్చిన విజయ్..
రైలులో ప్రయాణిస్తున్న రిటైర్డ్ సైంటిస్టు దంపతులకు ఈ జుగుప్సాకరమైన ఘటన ఎదురైంది. మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వీరు ఏసీ-3 కోచ్లో ప్రయాణిస్తున్న సమయంలో నిందితుడు రితేష్కి దంపతులకు మధ్యలో ఘర్షణ జరిగింది. రైలులో మద్యం తాగడాన్ని వారించిన దంపతుల బెర్తుపై రితేష్ మూత్ర విసర్జన చేశాడు.
ఈ ఘటనపై ప్రయాణికులు రైల్వే సిబ్బందికి సమాచారం అందించారు. ఫిర్యాదు మేరకు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఝాన్సీ రైల్వే స్టేషన్ లో నిందితుడు రితేష్ ని అదుపులోకి తీసుకున్నారు. టీటీఈ అందించిన వివరాల ప్రకారం అతనిపై కేసు నమోదు చేశారు పోలీసులు. మహోబాలో రైలెక్కిన అతను అప్పటికే మద్యం తాగి ఉన్నట్లు తోటి ప్రయాణికులు గుర్తించారు. ప్రస్తుతం అతడిని బెయిలుపై విడుదల చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
తాజావార్తలు
-
Rupee: రూపాయి గరిష్ట పతనంపై.. ఆర్బీఐ సంచలన నిర్ణయం..
-
KKR Vs MI: కేకేఆర్ బౌలర్ల ధాటికి ముంబై విలవిల.. కోల్కతా టార్గెట్ ఎంతంటే..
-
Off The Record : జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ గురించి టీడీపీలో చర్చలు
-
Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
-
Story Board : రూపాయి పతనం సెంచరీకి చేరువౌతోందా..? ఇరాన్ యుద్ధమే కొంప ముంచుతోందా..?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!