IIT Students Dropouts: ఐఐటీల్లోనూ డ్రాపౌట్స్.. ఐదేళ్లల్లో 8 వేల మంది
IIT Students Dropouts: దేశంలోని ప్రతిష్టాత్మకమైన ఐఐటీల్లో చేరాలంటే విద్యార్ధులు ఎంతో కష్టపడి చదవాలి. ఐఐటీల్లో సీటు సంపాదించడం కోసం కోచింగ్లను సైతం తీసుకుంటారు. అలాంటి ఐఐటీల్లో సీటు పొందిన తరువాత విద్యార్థులు మధ్యలోనే డ్రాపౌట్ అవుతున్నారు. గత కొద్ది సంవత్సరాలుగా ఈ సంఖ్య పెరుగుతున్నట్టు ఘణాంకాలు చూస్తే తెలుస్తోంది. ఐఐటీల్లో చేరిన విద్యార్థుల్లో కొందరు ఒత్తిడిని తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. గత ఐదేళ్లల్లో ఐఐటీల్లో సుమారు 8 వేల మంది విద్యార్థలు డ్రాపౌట్ అయినట్టు కేంద్రం ప్రకటించింది.
Read also: Amit Shah: అమిత్ షా తెలంగాణ టూర్ మళ్లీ వాయిదా
Also Read
- Producing States in India: భారత్లో 'పెట్రోల్' బావులు ఏయే రాష్ట్రాల్లో ఉన్నాయో తెలుసా?
- Amrit Bharat Express: రైల్వే ప్రయాణికులు శుభవార్త.. పట్టాలపైకి మరో రెండు అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు..
- Viral: ‘మీసాల పిల్ల’ అంటూ ఎగతాళి చేశారు.. కట్ చేస్తే ప్రశంసల హోరు..
- Padma Awards 2027: దేశ అత్యున్నత పౌర పురస్కారాలు.. నేడే నామినేట్ చేసుకోండి.. పూర్తి వివరాలివే!
2019 నుంచి 2023 మధ్యలో దేశంలో ప్రతిష్టాత్మక విద్యాసంస్థలైన ఐఐటీల్లో ప్రవేశం పొందేందుకు ఏటా వేల మంది విద్యార్థులు పోటీపడుతుంటారు. అయితే గత ఐదేండ్లలో ఏకంగా 8 వేల మందికిపైగా విద్యార్థులు ఐఐటీల నుంచి డ్రాపౌట్ అయినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. రాజ్యసభలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి సుభాష్ సర్కార్ఈ మేరకు రాతపూర్వక సమాధానమిచ్చారు. మొత్తంగా కేంద్ర ఉన్నత విద్యాసంస్థల నుంచి 32 వేల మందికిపైగా విద్యార్థులు డ్రాపౌట్ అయినట్టు చెప్పారు. కేంద్ర విశ్వవిద్యాలయాల నుంచి 17,454 మంది, ఐఐటీల్లో 8,139, ఎన్ఐటీల్లో 5,623, ఐఐఎస్ఈఆర్ నుంచి 1046, ఐఐఎంల నుంచి 858 మంది డ్రాపౌట్ అయినట్టు చెప్పారు. మొత్తంగా 2019 నుంచి ఉన్నత విద్యా సంస్థల్లో ఈ సంఖ్య 32 వేలుగా ఉందని వెల్లడించారు. వీరిలో 52 శాతం మంది ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వారేనని తెలిపారు.
Read also: Nassar: పవన్ కళ్యాణ్ చెప్పింది తప్పు.. అలాంటి రూల్స్ ఏం లేవు
గత ఐదేండ్లలో ఐఐటీల్లో 39 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నట్టు కేంద్ర మంత్రి తెలిపారు. మొత్తంగా ఉన్నత విద్యాసంస్థల్లో 98 మంది బలవన్మరణానికి పాల్పడినట్టు చెప్పారు. వారిలో 39 మంది ఐఐటీల్లో, 25 మంది ఎన్ఐటీల్లో, 25 మంది కేంద్ర విశ్వవిద్యాలయాల్లో, నలుగురు ఐఐఎంల్లో విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నట్టు పేర్కొన్నారు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో గణాంకాల ప్రకారం.. ఒంటరిగా ఫీలవడం, హింస, కుటుంబ సమస్యలు, మానసిక రుగ్మతలు తదితర కారణాల వల్ల విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడినట్టు కేంద్ర మంత్రి తెలిపారు.
తాజావార్తలు
-
Salary Delay: సారీ బాస్.. ఉద్యోగులకు బ్యాడ్ న్యూస్! ఈసారి ‘ఫస్ట్’కు శాలరీ రాదు.. ఎందుకో తెలుసా?
-
Putin – Abbas Araghchi Meeting: అమెరికాకు పుతిన్ మాస్టర్ స్ట్రోక్.. ఇరాన్కు రష్యా ‘ఫుల్’ సపోర్ట్..!
-
AP Intermediate Supplementary Exams: ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఫీజు గడువు పొడిగింపు..!
-
CM Chandrababu: ఘనంగా Andhra University శతాబ్ది వేడుకలు.. విశాఖను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దుతా.!
-
RCB Vs DC: విరాట్ కోహ్లీని ఊరిస్తున్న మరో సంచలన రికార్డు.. ఒక్క అడుగు దూరంలోనే..
ట్రెండింగ్
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!