PM Modi: కాంగ్రెస్కి అవినీతిలో ‘‘పీహెచ్డీ’’ ఉంది.. ప్రధాని మోడీ ఫైర్..
- కాంగ్రెస్ అవినీతిలో పీహెచ్డీ చేసింది..
- రాబోయే ఎన్నికల్లో బీజేపీ కూటమిదే విజయం..
- మహారాష్ట్రలో ప్రధాని నరేంద్రమోడీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: కాంగ్రెస్, దాని కూటమి మహావికాస్ అఘాడీ(ఎంవీఏ)పై ప్రధాని నరేంద్రమోడీ నిప్పులు చెరిగారు. మంగళవారం మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అవినీతిలో కాంగ్రెస్ కూటమికి ‘‘డబుల్ పీహెచ్డీ’’ విమర్శించారు. చిమూర్లో జరిగిన సభకు హాజరైన మోడీ బీజేపీ మహాయుతి అభ్యర్థుల తరుపున ప్రచారం చేశారు. పనులను అడ్డుకోవడం, జాప్యం చేయడం, దారి మళ్లించడంలో కాంగ్రెస్ వాళ్లకు డబుల్ పీహెచ్డీ ఉందని, 2.5 ఏళ్లలో మెట్రో నుంచి వధ్వన్ పోర్టు, సమృద్ధి మహామార్గ్ వరకు ప్రతి అభివృద్ధి ప్రాజెక్టును నిలిపివేశారని అన్నారు. అఘాడీ అంటే అవినీతిలో అతిపెద్ద ఆటగాడు అని గుర్తుంచుకోండని చెప్పారు.
Read Also: China: చైనాలో అమానుష ఘటన.. కార్ ఢీకొట్టి 35 మంది మృతి..
Also Read
- Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
- India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
- No Petrol: సంచలన తీర్పు ఇచ్చిన సుప్రీం కోర్టు.. థర్డ్ పార్టీ ఇన్సురెన్స్ లేకపోతే ఇంధనం బంద్..
- Kangana Ranaut: త్రిషపై ఉదయనిధి వ్యాఖ్యలపై కంగనా రనౌత్ ఏమన్నారంటే..!
దేశాన్ని వెనక్కి నెట్టి, బలహీన పరిచేందుకు ఏ అవకాశాన్ని కూడా కాంగ్రెస్, దాని కూటమి వదలడం లేదని దుయ్యబట్టారు. మహారాష్ట్ర భారీ మెజారిటీలో మహాయుతి కూటమి గెలుస్తుందని హాజరైన జనాలే సాక్ష్యమని చెప్పారు. మహాయుతి మహారాష్ట్రలో, కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఉంటే డబుల్ ఇంజిన్ ప్రభుత్వంలో అభివృద్ధి పరుగులు పెడుతుందని చెప్పారు. గడ్చిరోలితో పాటు దేశవ్యాప్తంగా మావోయిజాన్ని కట్టడి చేశామని అన్నారు.
జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370ని పునరుద్ధరించడానికి కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు ప్రయత్నాలు చేస్తున్నాయని ప్రధాని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘దశాబ్దాలుగా మన జమ్మూ కాశ్మీర్ వేర్పాటువాదం, ఉగ్రవాదంలో మండిపోతోంది. మాతృభూమిని కాపాడుతూ మహారాష్ట్రకు చెందిన ఎందరో వీర జవాన్లు జమ్మూకశ్మీర్ గడ్డపై వీరమరణం పొందారు. ఇదంతా జరిగిన ఆర్టికల్ 370 ముసుగులో జరిగింది. ఈ ఆర్టికల్ మేము ఆర్టికల్ 370ని రద్దు చేసాము. కాశ్మీర్ భారతదేశం, భారత రాజ్యాంగంతో పూర్తిగా విలీనం చేయబడింది, కశ్మీర్లో మళ్లీ ఆర్టికల్ 370ని పాక్ కోరుకున్నట్లే తీసుకురావాలని చూస్తున్నారు’’ అని విమర్శించారు. ఆదివాసీలను వివిధ కులాల వారీగా విభజించి వారిని నిర్వీర్యం చేసేందుకు కాంగ్రెస్ ‘కుట్ర’ పన్నుతుందని ప్రధాని హెచ్చరించారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!