PM Modi: కాంగ్రెస్కి అవినీతిలో ‘‘పీహెచ్డీ’’ ఉంది.. ప్రధాని మోడీ ఫైర్..
- కాంగ్రెస్ అవినీతిలో పీహెచ్డీ చేసింది..
- రాబోయే ఎన్నికల్లో బీజేపీ కూటమిదే విజయం..
- మహారాష్ట్రలో ప్రధాని నరేంద్రమోడీ..
PM Modi: కాంగ్రెస్, దాని కూటమి మహావికాస్ అఘాడీ(ఎంవీఏ)పై ప్రధాని నరేంద్రమోడీ నిప్పులు చెరిగారు. మంగళవారం మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అవినీతిలో కాంగ్రెస్ కూటమికి ‘‘డబుల్ పీహెచ్డీ’’ విమర్శించారు. చిమూర్లో జరిగిన సభకు హాజరైన మోడీ బీజేపీ మహాయుతి అభ్యర్థుల తరుపున ప్రచారం చేశారు. పనులను అడ్డుకోవడం, జాప్యం చేయడం, దారి మళ్లించడంలో కాంగ్రెస్ వాళ్లకు డబుల్ పీహెచ్డీ ఉందని, 2.5 ఏళ్లలో మెట్రో నుంచి వధ్వన్ పోర్టు, సమృద్ధి మహామార్గ్ వరకు ప్రతి అభివృద్ధి ప్రాజెక్టును నిలిపివేశారని అన్నారు. అఘాడీ అంటే అవినీతిలో అతిపెద్ద ఆటగాడు అని గుర్తుంచుకోండని చెప్పారు.
Read Also: China: చైనాలో అమానుష ఘటన.. కార్ ఢీకొట్టి 35 మంది మృతి..
Also Read
- Software Jobs Opening: లేఆఫ్స్ మధ్య భారీ ఊరట.. నియామకాలు స్టార్ట్ చేసిన ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ..
- FTA: ఇరాన్ యుద్ధం గొడవలో ప్రపంచం.. సైలెంట్గా కీలక ఒప్పందాన్ని పూర్తి చేసిన భారత్..
- PM Modi: మే 4 తర్వాత బెంగాల్లో మాఫియా, గుండాల అంతం ఖాయం..
- Love Marriage: నాలుగేళ్ల క్రితం ప్రేమ వివాహం.. ఇంతలోనే ఘోరం
దేశాన్ని వెనక్కి నెట్టి, బలహీన పరిచేందుకు ఏ అవకాశాన్ని కూడా కాంగ్రెస్, దాని కూటమి వదలడం లేదని దుయ్యబట్టారు. మహారాష్ట్ర భారీ మెజారిటీలో మహాయుతి కూటమి గెలుస్తుందని హాజరైన జనాలే సాక్ష్యమని చెప్పారు. మహాయుతి మహారాష్ట్రలో, కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఉంటే డబుల్ ఇంజిన్ ప్రభుత్వంలో అభివృద్ధి పరుగులు పెడుతుందని చెప్పారు. గడ్చిరోలితో పాటు దేశవ్యాప్తంగా మావోయిజాన్ని కట్టడి చేశామని అన్నారు.
జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370ని పునరుద్ధరించడానికి కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు ప్రయత్నాలు చేస్తున్నాయని ప్రధాని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘దశాబ్దాలుగా మన జమ్మూ కాశ్మీర్ వేర్పాటువాదం, ఉగ్రవాదంలో మండిపోతోంది. మాతృభూమిని కాపాడుతూ మహారాష్ట్రకు చెందిన ఎందరో వీర జవాన్లు జమ్మూకశ్మీర్ గడ్డపై వీరమరణం పొందారు. ఇదంతా జరిగిన ఆర్టికల్ 370 ముసుగులో జరిగింది. ఈ ఆర్టికల్ మేము ఆర్టికల్ 370ని రద్దు చేసాము. కాశ్మీర్ భారతదేశం, భారత రాజ్యాంగంతో పూర్తిగా విలీనం చేయబడింది, కశ్మీర్లో మళ్లీ ఆర్టికల్ 370ని పాక్ కోరుకున్నట్లే తీసుకురావాలని చూస్తున్నారు’’ అని విమర్శించారు. ఆదివాసీలను వివిధ కులాల వారీగా విభజించి వారిని నిర్వీర్యం చేసేందుకు కాంగ్రెస్ ‘కుట్ర’ పన్నుతుందని ప్రధాని హెచ్చరించారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy : ఐఏఎస్ల బదిలీల్లో రేవంత్ రెడ్డి క్యారెట్ అండ్ స్టిక్ పాలసీ
-
House Sales Down: భారీగా పడిపోయిన ఇళ్ల అమ్మకాలు.. ప్రధాన కారణం ఇదే..
-
Software Jobs Opening: లేఆఫ్స్ మధ్య భారీ ఊరట.. నియామకాలు స్టార్ట్ చేసిన ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ..
-
Success Story: ఊరి నుంచి రూ.12 అప్పు చేసి వచ్చాడు.. నేడు రూ. 15 వేల కోట్లకు అధిపతి..
-
Angkrish Raghuvanshi: రేర్ డిస్మిసల్.. అంగ్క్రిష్ రఘువంశీ ఆబ్స్ట్రక్టింగ్ ది ఫీల్డ్ కు ఔట్.. కేకేఆర్ ఆగ్రహం
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!