Mallikarjun Kharge: ఈవీఎంలు వద్దు, మాకు బ్యాలెట్ పేపర్లు కావాలి.. ఖర్గే డిమాండ్..
- ఈవీఎంలు వద్దు బ్యాలెట్ ద్వారా ఎన్నికలు జరగాలి..
- కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే డిమాండ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mallikarjun Kharge: హర్యానా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత కాంగ్రెస్ పార్టీ నేతలు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్(ఈవీఎం)లపై ఆరోపణలు గుప్పిస్తున్నారు. తాజాగా కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే మంగళవారం మాట్లాడుతూ.. ఈవీఎంలకు బదులు బ్యాలెట్ పేపర్ని ఉపయోగించాలని సూచించారు. ‘‘మనం అందరం కలిసికట్టుగా ముందుకు సాగి వారిని పక్కకు నెట్టాలి. ఎన్నికల గురించి నేను మాట్లాడకూడదని అనునకుంటున్నాను. కానీ పేద, అణగారిన వర్గాల ఓట్లు వృధా కాబోతున్నాయని నేను ఖచ్చితంగా చెబుతాను. వారందరూ బ్యాలెట్ పేపర్ ద్వారా ఓటు వేయాలని డిమాండ్ చేయాలి.’’ అని ఢిల్లీలోని తల్కతోరా స్టేడియంలో జరిగే ‘‘సంవిధాన్ రక్షక్ అభియాన్’’ కార్యక్రమంలో చెప్పారు.
మాకు ఈవీఎంలు వద్దు, బ్యాలెట్ పేపర్ ద్వారా ఓటేయాలని కోరతున్నామని, అప్పుడు వారి పరిస్థితి ఏంటో, ఎక్కడుంటారో తెలుస్తుందని బీజేపీని ఉద్దేశిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్ ఓటింగ్కి తిరిగి వెళ్లాలని కోరుతూ దాఖలైన పిటిషన్ని ఈ రోజు సుప్రీంకోర్టు కొట్టేసింది. ఎన్నికల్లో ఓడినప్పుడే ఓటింగ్ మిషన్లు ట్యాంపరింగ్ గుర్తుకు వస్తుందా..? అని ఘాటు వ్యాఖ్యలు చేసింది.
Also Read
- Union Budget: అక్టోబర్ 12 నుంచి కేంద్ర బడ్జెట్ కసరత్తు.. కీలక అంశాలపై ఫోకస్
- Central Employees: కేంద్ర ఉద్యోగుల జీతాల్లో ఊహించని మార్పు.. 3 శాతం ఉన్న ఇంక్రిమెంట్ 6 శాతానికి..?
- PM Modi: ఉజ్బెకిస్థాన్కు చేరుకున్న మోడీ.. అధ్యక్షుడు మిర్జియోయెవ్ ఘన స్వాగతం
- Reservation row: కేంద్ర మంత్రుల మధ్య మాటల యుద్ధం.. మంట పెట్టిన ‘‘రిజర్వేషన్’’ అంశం..
Read Also: Karnataka: ముస్లింల ఓటు హక్కు రద్దు చేయాలి.. హిందూ స్వామిజీ సంచలన వ్యాఖ్యలు..
బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నికలు జరగడానికి రాహుల్ గాంధీ నేతృత్వంలోని భారత్ జోడో యాత్ర తరహాలో ప్రచారం చేయాలని ఖర్గే పిలుపునిచ్చారు. కాంగ్రెస్ తరుపున ప్రతీ ఒక్కరూ బ్యాలెట్ పేపర్ విధానాన్ని తిరిగి పొందేలా ప్రచారాన్ని ప్రారంభిస్తామని, మేము ఇతర రాజకీయ పార్టీలో కూడా మాట్లాడుతున్నామని, రాహుల్ గాంధీ ఉద్యమం ప్రారంభించాలని ఖర్గే కోరారు. అంతకుముందు, మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోలే మాట్లాడుతూ.. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాన్ని తాము అంగీకరించడం లేదని, ఈవీఎం సమస్యను ఎవరూ సీరియస్గా తీసుకోవడం లేదని అన్నారు.
మహారాష్ట్ర ఎన్నికల్లో 288 సీట్లకు గానూ బీజేపీ కూటమి 233 సీట్లను కైవసం చేసుకుంది. బీజేపీ సొంతగా 132 సీట్లు గెలుచుకుని సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచింది. కాంగ్రెస్ కేవలం 16 స్థానాలకే పరిమితమైంది. మొత్తంగా ప్రతిపక్ష ఇండియా కూటమి 49 సీట్లను మాత్రమే గెలుచుకుంది. హర్యానా ఎన్నికల సమయంలో కూడా కాంగ్రెస్ ఈవీఎంలని తప్పుపట్టింది. అయితే, ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ఓటింగ్ యంత్రాలు సురక్షతంగా, పటిష్టంగా ఉన్నాయని చెప్పారు.
తాజావార్తలు
-
Kapil Dev: ఫాలో ఆన్ ఇచ్చి కూడా గెలవలేరా? కపిల్ దేవ్ ప్రశ్నల వర్షంతో టీమిండియాలో ప్రకంపనలు..
-
NASA: అంగారక గ్రహంపై ఏలియన్ ‘జెల్లీఫిష్’ కలకలం.. నాసా ఫొటోతో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
-
Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
-
Emraan Hashmi: సినిమా సక్సెస్ జోష్లో ఇమ్రాన్ హష్మీకి బిగ్ షాక్.. స్వైన్ ఫ్లూ పాజిటివ్!
-
T20 Cricket: కేవలం 7 పరుగులకే ఆలౌట్, 10 రన్స్కే కుప్పకూలిన జట్లు, టీ20 చరిత్రలోనే అత్యంత దారుణ స్కోర్లు ఇవే!
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!